Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Published on: 18 Aug 2020 6:57 AM IST

ఈరోజు పంచాంగం

మంగళవారం, 18ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చతుర్దశి(ఉ.09-34 వరకు) తదుపరి అమావాస్య; ఆశ్లేష నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి మఘ నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-28 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 06-05 నుంచి 07-39 వరకు) దుర్ముహూర్తం ( ఉ.08-17 నుంచి 09-17 వరకు తిరిగి రా,10.55 నుంచి 11.04 వరకు) రాహుకాలం (మ. 03-00 నుంచి 04-30 వరకు) సూర్యోదయం ఉ.5-46 సూర్యాస్తమయం సా.6-21

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • రామన్నగూడెం పుష్కర ఘాట్ ను సందర్శించిన మహబూబాబాద్ ఎంపీ కవిత
    18 Aug 2020 12:37 PM IST

    రామన్నగూడెం పుష్కర ఘాట్ ను సందర్శించిన మహబూబాబాద్ ఎంపీ కవిత

    ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం ,మండపేట పుష్కర ఘాట్ ను సందర్శించిన మహబూబాబాద్ ఎంపీ కవిత,ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ లు.

  • వరద కాలువలో పడి  వ్యక్తి మృతి.
    18 Aug 2020 12:35 PM IST

    వరద కాలువలో పడి వ్యక్తి మృతి.

    ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ శివారున కాలువలో పడి జూకంటి మల్లయ్య(45) అనే వ్యక్తి మృతి.

    మృతుడు మండలంలోని కాల్వపల్లి కి వె చెందినట్లు గుర్తింపు. 

  • శాoతించిన గోదారమ్మ.
    18 Aug 2020 11:15 AM IST

    శాoతించిన గోదారమ్మ.

    ములుగు జిల్లా: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం,ముళ్ళకట్ట, మంగపేట పుష్కర ఘాట్ ల వద్ద శాoతించిన గోదారమ్మ.

    మొదటి ప్రమాద హెచ్చరికకు దిగువన ప్రవహిస్తున్న గోదావరి.

    క్రమేపీ గోదావరి తగ్గుతున్నట్లు జలవనరుల శాఖాధికారి తెలిపారు.

  • యూరియా కోసం బారులు తీరిన రైతులు
    18 Aug 2020 11:14 AM IST

    యూరియా కోసం బారులు తీరిన రైతులు

    మెదక్: తూప్రాన్ లో యూరియా కోసం బారులు తీరిన రైతులు...వరుసగా కురిసిన వర్షానికి నాట్లు వేసి రైతులు యూరియా కొరత ఏర్పడతాదని షాపు ల ముందు రైతులు

  • భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుతున్న గోదావరి ఉధృతి
    18 Aug 2020 11:12 AM IST

    భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుతున్న గోదావరి ఉధృతి

    భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుతున్న గోదావరి ఉధృతి

    55.30 అడుగులకు చేరుకున్న నీటిమట్టం

    కొనసాగుతున్న 3వ ప్రమాద హెచ్చరిక

  • 18 Aug 2020 9:48 AM IST

    ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కురుస్తున్నా వర్షాలు..

    - వర్షాలతో ఎజెన్సి ప్రాంతంలో పోంగుతున్న వాగులు, వంకలు

    - ప్రాణహిత లోతట్టు ప్రాంతంలో కోనసాగుతున్నా వరద..

    - పత్తి, వరి పంటలు నీటమునిగి అందోళన చెందుతున్న రైతులు

  • 18 Aug 2020 9:43 AM IST

    ఖమ్మం కలెక్టరేట్ లో కరోనా కలకలం

    ఖమ్మం:

    - ముగ్గురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

    - మరో ముగ్గురు కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్

  • 18 Aug 2020 9:42 AM IST

    హైదరాబాద్:

    - ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇన్ఫెక్టర్ ను సస్పెండ్ చేసిన సీపీ అంజనీ కుమార్.

    - స్పెషల్ బ్రాంచ్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న చందర్ కుమార్ పై సీపీ కి మహిళ ఫిర్యాదు.

    - దర్యాప్తు అనంతరం ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేసిన సీపీ

    - పోలీసు శాఖ లో ఇలాంటివి సహించేది లేదు: సిపి అంజనీ కుమార్

    - ఎవరైనా వేధింపులకు పాల్పడితే 949061655 కి వాట్సాప్ సందేశం పంపండి: సిపి

  • 18 Aug 2020 9:41 AM IST

    చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు కు వరద ఉదృతి తగ్గింది

    భద్రాద్రి కొత్తగూడెం:

    - ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రిజర్వాయర్ లోకి వచ్చే వరద ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది

    - నిన్న వరకూ తాలిపేరు ఉగ్రరూపం దాల్చడంతో 25 గేట్ల ద్వారా భారీగా వరదను వదిలిన అదికారులు నేడు 25 గేట్లలో 10 గేట్లను దించివేసి మరో 15 గేట్ల ద్వారా 34 వేల 305 క్యూసెక్కుల వరదను దిగువనున్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

    - మరో వైపు గోదావరి సైతం తగ్గుముఖం పట్టడంతో పలు చోట్ల రహదారులపైకి చేరుకున్న వరద నీరు తొలగిపోవడంతో చర్లకు రాకపోకలు పుణప్రారంభమయ్యాయి.

  • 18 Aug 2020 9:06 AM IST

    ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కురుస్తున్నా వర్షాలు..

    - ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కురుస్తున్నా వర్షాలు..

    - వర్షాలతో ఎజెన్సి ప్రాంతంలో పోంగుతున్న వాగులు, వంకలు

    - ప్రాణహిత లోతట్టు ప్రాంతంలో కోనసాగుతున్నా వరద..

    - పత్తి, వరి పంటలు నీటమునిగి అందోళన చెందుతున్న రైతులు

K V D Varma

K V D Varma

Next Story