Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
మంగళవారం, 18ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చతుర్దశి(ఉ.09-34 వరకు) తదుపరి అమావాస్య; ఆశ్లేష నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి మఘ నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-28 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 06-05 నుంచి 07-39 వరకు) దుర్ముహూర్తం ( ఉ.08-17 నుంచి 09-17 వరకు తిరిగి రా,10.55 నుంచి 11.04 వరకు) రాహుకాలం (మ. 03-00 నుంచి 04-30 వరకు) సూర్యోదయం ఉ.5-46 సూర్యాస్తమయం సా.6-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 18 Aug 2020 3:10 PM IST
వాజేడు మండలంలో మహబూబాద్ ఎంపీ మాలోతు కవిత
ములుగు జిల్లా:
- వాజేడు మండలంలో మహబూబాద్ ఎంపీ మాలోతు కవిత , జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, వరద ముప్పు ప్రాంతాలపై అధికారులు తీసుకున్న చర్యలపై వాజేడు మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
- 18 Aug 2020 3:09 PM IST
ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ dream11.
క్రీడలు:
- ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ dream11.
- 250 కోట్ల రూపాయలకు టైటిల్స్ స్పాన్సర్షిప్ హక్కులను చేజిక్కించుకున్నారు డ్రీమ్11 ల
- 18 Aug 2020 3:09 PM IST
సిద్దిపేట జిల్లా :
- కరోన నేపథ్యంలో డిగ్రీ పరీక్షలు నిర్వహించవద్దంటూ NSUI రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఎన్ఎస్వీ నాయకుల రాస్తారోకో,నాయకుల అరెస్ట్ పోలీస్ స్టేషన్ కి తరలింపు.
- 18 Aug 2020 3:08 PM IST
- మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గౌడ సంఘము ఆధ్వర్యంలో సర్దార్ పాపరాయుడి విగ్రహానికి పూలమాల వేసి 370 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
- 18 Aug 2020 3:08 PM IST
- మెదక్ జిల్లా నర్సాపూర్ లో సొసైటీ ముందు యూరియా టొకన్ల కోసం బారులు తీరిన రైతులు......
- 18 Aug 2020 3:06 PM IST
కె కృష్ణసాగర్ రావు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.
- కె కృష్ణసాగర్ రావు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.
- కోవిడ్ అనంతర చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మా పార్టీ సీనియర్ నాయకులు , మాజీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గారు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని, తొందరగా కోలుకోవాలని బీజేపీ ప్రార్థిస్తోంది.
- పూర్తి ఆరోగ్యం తో ఆయన గతంలోలాగా చురుగ్గా రంగం లోకి దిగుతారని బీజేపీ ఎదురు చూస్తోంది.
- 18 Aug 2020 3:04 PM IST
మరికాసేపట్లో డిజిపి ని కలవనున్న బట్టి విక్రమార్క , జగ్గారెడ్డి , సంపత్ కుమార్
- మరికాసేపట్లో డిజిపి ని కలవనున్న బట్టి విక్రమార్క , జగ్గారెడ్డి , సంపత్ కుమార్
- రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై పోలీసుల తీరు పై డీజీపీ కి పిర్యాదు చేయనున్న కాంగ్రెస్ నేతలు
- కాంగ్రెస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిజిపి కి తెలపనున్న నేతలు
- 18 Aug 2020 2:01 PM IST
ప్రజలందరి దీవెనలతో కరోనా ను జయించాను: పఠాన్ చెరు ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా: ప్రజలందరి దీవెనలతో కరోనా ను జయించాను: పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యం గా ఉన్నాను.
- త్వరలో నియోజకవర్గం లో పర్యటిస్తాను
- పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- 18 Aug 2020 1:54 PM IST
తెలంగాణ ప్రభుత్వం పై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళ్ సై
తెలంగాణ ప్రభుత్వం పై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళ్ సై.
కొరొనా టెస్టుల విషయంలో ఓ జాతీయ పత్రిక కథనాన్ని టాగ్ చేస్తూ గవర్నర్ ట్విట్.
తెలంగాణలో కొరొనా టెస్టులు పెంచాలని ప్రజలు కోరుకుంటున్నారు- తమిళ్ సై.
WHO నిబంధనలు పాటించి- తగినన్ని టెస్టులు-ట్రెసింగ్- ట్రీట్మెంట్ చేసి ప్రజల భయాన్ని తొలగించాలి- గవర్నర్.
వర్షాలు-వరదలు ఎక్కువ కావడం వల్ల బయన్దోళనలో ప్రజలు.
రోజుకు 40వేల టెస్టులు చేస్తానన్న ప్రభుత్వం- 8వేలకె పరిమితం అయిందన్న ఓ వార్తా పత్రికను టాగ్ చేసిన గవర్నర్.
కొరొనా కట్టడికి WHO సూత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆచరించాలి- గవర్నర్.

- 18 Aug 2020 1:48 PM IST
ఎన్. ఎస్.యూ.ఐ, యూత్ కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్, ఎన్. ఎస్.యూ.ఐ అధ్యక్షులు బలమూరి వెంకట్ లను ఉదయం నుంచి గృహ నిర్బంధం చేసిన పోలీసులు
కాచిగూడ సర్కిల్ లో నిరసన వ్యక్తం చేసిన ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.






