Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 18ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చతుర్దశి(ఉ.09-34 వరకు) తదుపరి అమావాస్య; ఆశ్లేష నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి మఘ నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-28 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 06-05 నుంచి 07-39 వరకు) దుర్ముహూర్తం ( ఉ.08-17 నుంచి 09-17 వరకు తిరిగి రా,10.55 నుంచి 11.04 వరకు) రాహుకాలం (మ. 03-00 నుంచి 04-30 వరకు) సూర్యోదయం ఉ.5-46 సూర్యాస్తమయం సా.6-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 18 Aug 2020 9:47 AM IST
తూర్పుగోదావరి :
- పిఠాపురం వై జంక్షన్ వద్ద బెండపూడి నుంచి మండపేట కు అక్రమంగా తరలిస్తున్న 12 టన్నుల రేషన్ బియ్యం, ఐషర్ వ్యాన్ సీజ్ చేసిన పోలీసులు..
- 18 Aug 2020 9:46 AM IST
కడప :
- రైల్వేకోడూరు మండలం ఎస్ ఉప్పరపల్లె సమీపంలో డాబా వద్ద నిలబడి ఉన్న లారీని ఢీ కొన్న మరో టెంపొ
- ఇద్దరు మృతి , వెనుక భాగాన లారీని ఢీకొన్న టెంపో
- ఐదుగురికి స్వల్ప గాయాలు ఆస్పత్రికి తరలింపు
- 18 Aug 2020 9:46 AM IST
కోనసీమ లంక గ్రామాలను భయపెడుతున్న అమావాస్య..
తూర్పుగోదావరి :
- అమావాస్య సమయంలో వచ్చే ఆటుపోట్లు కారణంగా సముద్రం వేగంగా ప్రవహించని వరద నీరు..
- బ్యాక్ వాటర్ రూపంలో వరద నీరు వెనక్కి వచ్చే అవకాశం..
- బ్యాక్ వాటర్ వస్తే మరో మూడు రోజుల పాటు జలదిగ్బంధంలో కొనసాగనున్న లంక గ్రామాలు..
- 18 Aug 2020 9:45 AM IST
తూర్పుగోదావరి :
- నేడు కోనసీమ లో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ పర్యటన..
- కోనసీమ లో పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న మంత్రి కృష్ణ దాస్..
- 18 Aug 2020 9:45 AM IST
తూర్పుగోదావరి :
- వరద నీటిలో మామిడికుదురు మం. అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయం.
- 1986,2006 తరువాత అత్యధిక స్థాయిలో ఆలయంలో ప్రవేశించిన వరద నీరు..
- 18 Aug 2020 9:44 AM IST
తూర్పు గోదావరి :
- ముమ్మిడివరం మం. గోవలంక, పళ్ళ వారి లంక, మామిడికుదురు మండలం పెదపట్నం లంక వద్ద బలహీనంగా ఉన్న ఏటి గట్లు..
- దిగువ గ్రామాల ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఏటి గట్టు లీకేజీ లు..
- ఇసుక బస్తాలతో లీకేజీ లను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోన్న స్థానికులు..
- 18 Aug 2020 9:43 AM IST
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
- గోదావరికి మరింత వరద ఉధృతి
- ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మూడవ ప్రమాద హెచ్చరిక
- ప్రస్తుత ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 22,90,000 క్యూసెక్కులు
- గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు
- 18 Aug 2020 7:02 AM IST
ప.గో:
- ఇవ్వాళ పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పార్టీ నాయకులు...
- ఉదయం 10 గంటలకు పోలవరంలో రింగ్ బండ్ గట్టు పాత పోలవరం బిక్కుబాబా గుడి వద్ద గట్టు పరిశీలన.
- కడెమ్మ సలూయిజ్ వద్ద గట్టు పరిశీలన..
- పోలవరం గ్రామం వైపు ముంపుకి గురి అయిన వరి పొలాలు పరిశీలన..
- 18 Aug 2020 7:01 AM IST
ప.గో:
- నేడు కొవ్వూ రు మండలం మద్దూరు లంక గ్రామంలో
- వరద ప్రభావిత ప్రాంతంలో మంత్రి తానేటి వనిత పర్యటన..
- ఉదయం 10.30 గంటలకు వరద ముంపు ప్రాంతాలను పరిశీలి న..
- ఉదయం 11 గంటలకు మద్దూరు లో ఏర్పాటు చేసిన పు నరావాస కేంద్రాలను పరిశీలిస్తారు.
- ఉదయం 11.30 గంటలకు గోష్పాద క్షేత్రం లో వరదను మంత్రి వర్యులు పరిశీలిస్తారు.
- 18 Aug 2020 7:01 AM IST
ప.గో:
- నేడు వేలేరుపాడులో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ,జిల్లా ఇంచార్జి మంత్రి పేర్ని నాని ..
- వరద ముంపు ప్రాంతంలో సహాయ చర్యలు ,వరద
- తీవ్రతను పరిశీలించనున్న మంత్రులు..



