Live Updates: ఈరోజు (16 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 16 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | పాడ్యమి ఉ. 9-07 తదుపరి విదియ | అనూరాధ నక్షత్రం సా. 5-41 తదుపరి జ్యేష్ఠ | వర్జ్యం రా.10-59 నుంచి 12-29 వరకు | అమృత ఘడియలు ఉ.7-56 నుంచి 9-26 వరకు | దుర్ముహూర్తం మ.12-07 నుంచి 12.52 వరకు తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-09 | సూర్యాస్తమయం: సా.05-21

ఈరోజు తాజా వార్తలు








Show Full Article

Live Updates

  • Chittoor District Updates: బంగారుపాళ్యం మండల కేంద్రంలోని మేదర వీధి లో దారుణం..
    17 Nov 2020 12:31 PM GMT

    Chittoor District Updates: బంగారుపాళ్యం మండల కేంద్రంలోని మేదర వీధి లో దారుణం..

    చిత్తూరు..

    -బంగారుపాళ్యం మండల కేంద్రంలోని మేదర వీధి లో వృద్ధ దంపతులు ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య

    -ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులు బయట ప్రాంతం నుండి జీవనం కోసం బంగారు పాళ్యం లో నివాసం ఉన్నట్లు సమాచారం

    -భర్త కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నట్లు తెలిసింది

    -వృద్ధురాలు ఓ ఫ్యాన్సీ షాప్ నందు పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు

  • Krishna District Updates: లక్ష్మీ నరసింహన్ పోలీసులపై చేసిన ఆరోపణలు నిరాధారం...
    17 Nov 2020 12:26 PM GMT

    Krishna District Updates: లక్ష్మీ నరసింహన్ పోలీసులపై చేసిన ఆరోపణలు నిరాధారం...

     కృష్ణాజిల్లా...

    - దళిత పారిశ్రామిక వేత్త లక్ష్మీ నరసింహన్ అంశంపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ సత్యానందం, మహిళా పోలీస్ DSP షేక్ అబ్దుల్ అజీజ్    మీడియా బ్రీఫింగ్

    - డిఎస్పీ సత్యానందం

    - నందివాడ మండలం తమిరిస గ్రామంలో లక్ష్మీ నరసింహన్ 147 ఎకరాల రొయ్యల చెరువు సబ్ లీజుకు తీసుకొని సాగు చేస్తోంది

    - మచిలీపట్నం, గుడివాడ లలో లక్ష్మీ నరసింహన్ పై అనేక ఆర్థిక లావాదేవీల అవకతవకలపై ఫిర్యాదులు విచారణ దశలో ఉన్నాయి

    - 2018 లో మచిలీపట్నం పరిధిలో, పలువురిపై కేసు పెట్టిన సందర్భాల్లో తాను ముదలియార్ కులానికి చెందినట్లుగా లక్ష్మీ నరసింహన్ ఫిర్యాదు చేసింది

    - గత అక్టోబర్ లో నూకల రామకృష్ణ, అతని కుమారుడు బాలాజీ తనను కులం పేరుతో దూషించారని ఆమె చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు     చేశాం 

    - లక్ష్మీ నరసింహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మహిళ పోలీస్ డిఎస్పి ఆధ్వర్యంలో చట్ట ప్రకారం దర్యాప్తు చేస్తున్నాం

    - నూకల రామకృష్ణ, అతని కుమారుడు పై కేసు విచారణ జరుగుతుండగానే తాను సాగు చేస్తున్న చెరువులో 150 టన్నుల రొయ్యలను దొంగిలించినట్లు         నరసింహన్ మరో ఫిర్యాదు చేసింది

    - లక్ష్మీ నరసింహన్ ఇచ్చిన రెండో ఫిర్యాదు పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం

    - ఆధారాలు లేకపోవడంతో ఎవరినీ అరెస్టు లు చేయలేదు

    - చట్ట ప్రకారం విచారణ జరుగుతుంది

    - మహిళా పోలీస్ స్టేషన్, DSP షేక్ అబ్దుల్ అజీజ్

    - లక్ష్మీ నరసింహన్ ఇచ్చిన రెండు ఫిర్యాదులపై కేసు నమోదు చేసి చట్టప్రకారం విచారణ చేస్తున్నాం

    - లక్ష్మీ నరసింహన్, నూకల రామకృష్ణ కు చెరువు సబ్ లీజు సొమ్ము తో పాటుగా ఆరు లక్షల కరెంట్ బిల్లులు బకాయి

    - బకాయి సొమ్ము ఇవ్వని నేపథ్యంలో 20 టన్నుల రొయ్యలను, తమ బకాయి గా జమ చేసుకొని రామకృష్ణ తీసుకెళ్లినట్లు గా గుర్తింపు

    - సంబంధం లేని ఇతర ఆర్థిక లావాదేవీల కేసులను నూకల రామకృష్ణ కేసుతో ముడి పెట్టడం వల్ల, విచారణ ఆలస్యమవుతోంది

    - పోలీసులపై లక్ష్మీనరసింహన్ చేసిన వాక్యాలు పూర్తి నిరాధారం

    - ఆమెపై పలువురు చేసిన ఫిర్యాదులపై కూడా విచారణ జరుగుతుంది

  • Visakha weather Updates: ఈశాన్య, తూర్పు దిశల నుండి వీస్తున్న గాలులు...
    17 Nov 2020 12:14 PM GMT

    Visakha weather Updates: ఈశాన్య, తూర్పు దిశల నుండి వీస్తున్న గాలులు...

      విశాఖ...

    - ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య, తూర్పు దిశల నుండి వీస్తున్న గాలులు...

    - కొమరిన్ ప్రాంతము నుండి ఉత్తర తమిళనాడు తీరం వరకు 1.5 km ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి....

    - పశ్చిమ దిశ వైపు ప్రయాణించి, మాల్దీవుల నుండి ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు కొనసాగుతున్న ద్రోణి..

    - ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో అక్కడ అక్కడ వర్షాలు

  • Amaravati Updates: ఆన్‌లైన్‌ విధానంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైయస్‌ జగన్‌..
    17 Nov 2020 12:12 PM GMT

    Amaravati Updates: ఆన్‌లైన్‌ విధానంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైయస్‌ జగన్‌..

     అమరావతి

    - ‘వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం’ తో పాటు, ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి అక్టోబరు నెలలో సంభవించిన పంటల నష్టంపై పెట్టుబడి     సహాయం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) చెల్లింపు.

    - క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ విధానంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైయస్‌ జగన్‌

    - సీఎం జగన్ కామెంట్స్:

    - ఇది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వం

    - సీఎం స్ధానంలో మీ బిడ్డ కూర్చున్నాడు

    - దేశంలో ఎవరూ చేయని విధంగా వారికి అండగా నిలబడుతున్నాం

    - ఏ సమస్య వచ్చినా మీ బిడ్డగా తోడుగా ఉంటాను

    - రైతులకు ఎంత చేసినా తక్కువే

    - సకాలంలో రుణాలు చెలిస్తే ప్రభుత్వం వడ్డీ కడుతుంది

    - ఆ నమ్మకాన్ని రైతుల్లో కల్పించాం, గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి భరోసా ఇవ్వలేదు.

    - రైతులు, అక్కచెల్లమ్మలకు మరింత ఆదాయం వచ్చేలా అమూల్ ద్వారా పాలసేకరణ

    - 3 జిల్లాల్లో ఈ నెల 26 నుంచి తొలిదశ పాలసేకరణ.

    - రాష్ట్ర వ్యాప్తంగా 9800 బీఎంసీయూలు.‌

    - ఆర్బీకేల పక్కనే బీఎంసీయూల నిర్మాణం 

  • West Godavari Updates: అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు...
    17 Nov 2020 12:08 PM GMT

    West Godavari Updates: అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు...

    పశ్చిమ గోదావరి జిల్లా..

    తాడేపల్లిగూడెం...

    - అనేక కేసుల లో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 18.30 కాసుల బంగారం,

    - 5లక్షల నగదు, 2బైక్ లు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు...

  • Amaravati Updates: ఏపీలో కరోనా అదుపులోకి వస్తోంది..
    17 Nov 2020 12:03 PM GMT

    Amaravati Updates: ఏపీలో కరోనా అదుపులోకి వస్తోంది..

       అమరావతి

    * నిమ్మగడ్డ రమేష్ ,ఎన్నికల కమీషనర్

    * గతంలో పదివేలు కేసులు ఉంటే..ఇపుడు 753 కి తగ్గాయి

    * రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు వలన ఇది సాధ్యపడింది

    * డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది నిస్వార్థంగా పని చేయడంతో ఇది సాధ్యం అయ్యింది

    * తెలంగాణ..జీహెచ్ఎంసీ ఎన్నికలను పూర్తి భద్రతా చర్యలతో నిర్వహిస్తోంది

    * ఎన్నికల నిర్వహణ.. రాజ్యాంగ బద్ధ, న్యాయబద్ద మైన బాధ్యత

    * రాజస్థాన్ లో కూడా ఈ బాధ్యత ను సమర్థవంతంగా నిర్వహించారు

    * ప్రభుత్వం తో సంప్రదించిన తరువాత ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేయబడుతుంది

    * షెడ్యూల్ ఇచ్చిన తర్వాత నాలుగు వారాల ముందు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది

    * భవిష్యత్ లో ఫైనాన్స్ కమిషన్ నిధులు రావాలంటే ఎన్నికల నిర్వహణ తప్పనిసరి

    * ఏపీ ప్రభుత్వం,ఆరోగ్య శాఖ తెలిపిన అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకుంది

    * స్వేచ్చాయిత ,పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి బాద్యుల అందరి సహకారం కోరుతున్నాము

  • Nellore District Updates: ఉద్యోగ భద్రత కావాలంటూ నిరసన దీక్ష చేపట్టిన కార్మికులు...
    17 Nov 2020 11:51 AM GMT

    Nellore District Updates: ఉద్యోగ భద్రత కావాలంటూ నిరసన దీక్ష చేపట్టిన కార్మికులు...

       నెల్లూరు: 

    -- సీఐటీయూ కార్యదర్శి నరసింహారావు..

    -- జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న కృష్ణపట్నం పోర్టు కార్మికుల ఆందోళన.

    -- పోర్టు కార్మికులకు సంఘీభావం తెలిపిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నర్సింగ్ రావు.

    -- కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది.

    -- అన్యాయంగా కార్మికుల పొట్ట కొడుతోంది.

  • Anantapur Updates: సోము వీర్రాజు పై అనంతపురం టు టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు..
    17 Nov 2020 11:47 AM GMT

    Anantapur Updates: సోము వీర్రాజు పై అనంతపురం టు టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు..

      అనంతపురం:

    * భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పై అనంతపురం టు టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు.

    * సలీం కుటుంభం ఆత్మహత్య ఘటన పై విద్వేషాలు రెచ్చగొడుతూ మాట్లాడారని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు.

  • Vijayawada Updates: పోలీసు కష్టడీకి దివ్యతేజస్విని కేసు నిందితుడు..
    17 Nov 2020 11:38 AM GMT

    Vijayawada Updates: పోలీసు కష్టడీకి దివ్యతేజస్విని కేసు నిందితుడు..

      విజయవాడ...

    - మూడు రోజులపాటు కష్టడీకి అనుమతించిన న్యాయస్ధానం

    - రేపటి నుంచీ ఈనెల 20 వరకూ కష్టడీకి అనుమతించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు

    - రేపు కష్టడీకి తీసుకుని విచారించనున్న పోలీసులు

  • Vijayawada Updates: శివాలయంలో విరిగిపడ్డ ధ్వజస్తంభం....
    16 Nov 2020 2:42 PM GMT

    Vijayawada Updates: శివాలయంలో విరిగిపడ్డ ధ్వజస్తంభం....

     విజయవాడ

    * సత్యనారాయణ పురం శివాజీ కేఫ్ సెంటర్ లోని శివాలయంలో విరిగిపడ్డ ధ్వజస్తంభం....

    * కార్తీక సోమవారం కావడంతో శివాలయానికి పోటెత్తిన భక్తులు

    * ఒక్కసారిగా కూలిన ధ్వజస్తంభం

    * మణిక్యంభా అనే భక్తురాలుకు తీవ్ర గాయాలు

    * హాస్పిటల్ కు తరలించిన స్థానికులు

    * శివాలయం మూసివేసిన కమిటీ సభ్యులు

    * తృటిలో తప్పిన పెను ప్రమాదం

Print Article
Next Story
More Stories