Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 14 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం దశమి(ఉ. 10-29 వరకు) తదుపరి ఏకాదశి ; మృగశిర నక్షత్రం (తె. 04-27 వరకు) తదుపరి ఆర్ద్ర నక్షత్రం, అమృత ఘడియలు (రా.07-09 నుంచి 08-50 వరకు), వర్జ్యం (ఉ.0 9-00 నుంచి 10-42 వరకు) దుర్ముహూర్తం (ఉ. 08-17 నుంచి 09-08 వరకు తిరిగి మ. 12-30 నుంచి 01-20 వరకు) రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-24
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 14 Aug 2020 9:59 AM IST
అనంతపురం నగరంలో క్రాంతి ఆసుపత్రి లో బాలింత మృతి
అనంతపురం:
- అలంక రాయుని పేట కి చెందిన
- అనుషా (21) కు నిన్న మధ్యాహ్నం నుంచి ఆసుపత్రిలో చికిత్స.
- కడుపు నొప్పి రావడం తో తీవ్ర రక్త స్రావం. గర్భ సంచి ఆపరేషన్ చేయడం తో ఆపరేషన్ వికటించి గర్భిణీ మృతి.
- ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్షమే మృతికి కారణం అంటున్న బంధువులు... ఆసుపత్రి వద్ద ఆందోళన.
- 14 Aug 2020 9:59 AM IST
సాధినేని యామినిపై పోలీసులకు టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు
తిరుమల:
- టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సాధినేని యామినిపై ఆరోపణ
- ఐపీసీ 505(2), 500 సెక్షన్ల కింద యామినిపై కేసునమోదు
- రామమందిరం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని యామిని విమర్శలు
- 14 Aug 2020 9:58 AM IST
నేడు రాజమండ్రిలో పర్యటించనున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
- నేడు రాజమండ్రిలో పర్యటించనున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
- శిరోముండనం బాధితుడు వరప్రసాద్, అత్యాచారానికి గురైన దళిత బాలికలను పరామర్శించనున్న రామకృష్ణ.
- 14 Aug 2020 9:57 AM IST
చిలకలూరిపేట లో విజృపిస్తున్న కరోనా...
గుంటూరు:
- కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు నేటి నుంచి కఠినంగా అకాంక్షలు విధించిన అధికారులు...
- ఉదయం పదకొండు గంటలనుండి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు 144 సెక్షన్ అమలు....
- నిబంధనలు ఉల్లంఘింస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.....
- 14 Aug 2020 8:57 AM IST
కృష్ణ జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ కామెంట్స్...
- వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల రానున్న రెండు రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది
- జిల్లా లోని అన్ని మండలాలలో గల లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా యంత్రాంగం
- టెలీ కాన్సెరెస్సీ ద్వారా అధికారు లకు, రెవిన్యూ యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశాలు జారీ
- అన్ని డివిజనల్ కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు
- లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు రెవిన్యూ యంత్రాంగాయానికి సహకరించాలి.
- కృష్ణా జిల్లాలోని ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు...
- బందరు కలెక్టరేట్ : 08672-252572
- విజయవాడలో ని కలెక్టర్ క్యాంపు కార్యాలయ: 0866 - 2474805
- సబ్ కలెక్టర్ ఆఫీస్ విజయవాడ : 0866-2574454
- సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడు: 08656- 232717
- రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ బందర్ ఫోన్ నెంబర్ : 08672-252486
- రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ గుడివాడ ఫోన్ నెంబర్ : 08674 - 243697
- 14 Aug 2020 8:34 AM IST
కోనసీమలో గోదావరి ఫ్లడ్ ఎఫెక్ట్..
తూర్పుగోదావరి :
- కోనసీమలో ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి ఉప నదులు గౌతమి.. వృద్ధగౌతమి.. వశిష్ట.. వైనతేయ..
- కోటిపల్లి - ముక్తేశ్వరం, సఖినేటిపల్లి - నరసాపురం రేవుల్లో పంటులపై రాకపోకలు నిలివేసిన అధికారులు..
- అయినవిల్లి మం. ముక్తేశ్వరం తొగరుపాయ పాత వంతెనను ముంచెత్తిన వరద నీరు..
- పి.గన్నవరం మండలం జి.పెదపూడి లంక గ్రామాల్లో పడవలపై రాకపోకలు సాగిస్తున్న ప్రజలు..
- 14 Aug 2020 7:55 AM IST
తిరుమల నూతన పరకామణి భవన నిర్మాణానికి శంకుస్థాపన
తిరుమల
- నూతన పరకామణి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి
- సుమారు 9 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అధునాతన వసతులతో పరకామణి భవనం నిర్మాణం
- నిర్మాణ వ్యయాన్ని విరాళంగా అందిస్తున్న బెంగళూరుకు చెందిన భక్తుడు మురళి కృష్ణ
- శ్రీవారి కానుకలు లెక్కింపు భక్తులు చూసేలా నూతన భవనం నిర్మాణం
- ఆలయం లోపల జరిగే పరకామణి లెక్కింపు వల్లా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు అందుకే ఆలయం వెలుపలకు మార్చాం.. ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి
- భవన నిర్మాణం చేసే భాగ్యం స్వామివారు నాకు కల్పించడం పూర్వజన్మ సుకృతం..దాత మురళీ కృష్ణ
- 14 Aug 2020 7:50 AM IST
అమరావతి
ఉదయం11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గౌడౌన్స్, కోల్డ్ స్టోరేజ్ ల పై సీఎం జగన్ సమీక్ష.
12.30 కు నంద్యాల లోని ఉదయనంద హాస్పిటల్ ను క్యాంపు ఆఫీస్ నుండి వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం.
- 14 Aug 2020 7:48 AM IST
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి
కర్నూలుజిల్లా
- ఇన్ ఫ్లో : 1,41,606 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 40,259 క్యూసెక్కులు
- పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు
- ప్రస్తుతం : 865.50 అడుగులు
- నీటి నిలువ సామర్థ్యం : 215.807 టిఎంసీలు
- ప్రస్తుతం : 124.2268 టిఎంసీలు
- ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 14 Aug 2020 7:47 AM IST
శ్రీశైలం మల్లన్న దర్శనానికి సర్వం సిద్దం!
కర్నూలు జిల్లా
- ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు శుక్రవారం నుండి పునః ప్రారంభం కానున్నాయి.
- దేవస్థానం ఈఓ కె.ఎస్.రామారావు ఆదేశాల మేరకు అధికారులు కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తగిన జాగ్రత్తలతో పలు చర్యలు తీసుకుంటున్నారు.
- దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా భౌతిక దూరం పాటిస్తూ తప్పని సరిగా మాస్కు ధరించాలని ఆదేశించారు.
- ఈరోజు ఉదయం 6 గంటల నుండి స్థానికులకు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యాన్ని కల్పించారు.
- ఆగస్టు15 వ తేదీ నుండి యధావిధిగా భక్తులను దర్శనానికి అనుమతి..






