Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 13ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం నవమి(ఉ. 09-25 వరకు) తదుపరి దశమి; రోహిణి నక్షత్రం (రా. 03-05 వరకు) తదుపరి మృగశిర నక్షత్రం, అమృత ఘడియలు (రా.11-38 నుంచి 01-21 వరకు), వర్జ్యం (సా.0 6-28 నుంచి 08-11 వరకు) దుర్ముహూర్తం (ఉ. 09-58 నుంచి 10-48 వరకు) రాహుకాలం (మ.01-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.05-45 సూర్యాస్తమయం సా.06-25

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 13 Aug 2020 6:30 AM GMT

    విశాఖ జీవిఎంసీ గాంధీ విగ్రహాం వద్ద కార్మిక సంఘాలు ఆందోళన

    విశాఖ:

    - పరిశ్రమల్లో ప్రమాదాలను నిలువరించి, కార్మికుల ప్రాణాలను రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవిఎంసీ గాంధీ విగ్రహాం వద్ద కార్మిక సంఘాలు ఆందోళన

    -పరిశ్రమల్లో నిత్యం తనిఖీలు చేపట్టి, భద్రతా ప్రమాణాలు కఠినంగా అమలు చేయాలంటూ డిమాండ్

  • 13 Aug 2020 6:29 AM GMT

    కరోనా విస్తరిస్తున్న నేపద్యంలో తుని పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ ..

    తూర్పుగోదావరి : 

    తుని: కరోనా విస్తరిస్తున్న నేపద్యంలో తుని పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ ..

    - కూరగాయలు, మెడికల్ షాపులు ఒకపూట మినహా అన్ని దుకాణాలు పూర్తిస్థాయిలో మూసివేత...

  • 13 Aug 2020 5:35 AM GMT

    స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధం అవుతున్న ఇందిరాగాంధీ స్టేడియం

    విజయవాడ:

    - ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న 74వ స్వాతంత్య్ర దినోత్సవ రిహర్షల్స్ లో పాల్గొన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

    - పోలీసు, భద్రతా,రిజార్వ్ బలగాలు నుంచి గౌరవ వందనం స్వీకరణ

    - కరోనా నేపధ్యంలో ముఖాలు కు మాస్క్ లు, హెడ్ మాస్క్ లు చేతికి గ్లౌజెస్ ధరించి రిహర్షల్స్

    - 74 వ స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధం అవుతున్న ఇందిరాగాంధీ స్టేడియం

    - వర్షంలోను రిహార్సల్స్ చేస్తున్న భద్రతా బలగాలు,పోలీసులు

    - వర్షం వల్ల నీరు ఉన్న ప్రాంతాల్లో బ్లాక్ గ్రావెల్ తో స్టేడియం గ్రౌండ్ లో నింపుతున్న విజయవాడ కార్పొరేషన్ అధికారులు

    - ఇండిపెండెన్స్ కు సిద్ధం అవుతున్న ప్రత్యేక శకటాలు

    - త్రివర్ణ పతాకాలుతో ముస్తాబు అవుతున్న ఇందిరాగాంధీ స్టేడియం

  • 13 Aug 2020 5:32 AM GMT

    జన్మదిన వేడుకల పేరిట అడంబ‌రాలు వ‌ద్దు..

    విజ‌య‌వాడ‌:

    - జన్మదిన వేడుకల పేరిట అడంబ‌రాలు వ‌ద్దు

    - కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయండి.

    - దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు.

    - క‌రోనా కార‌ణంగా ఈ ఏడాది

    - జన్మదిన వేడుకల పేరిట అడంబ‌రాలకు దూరంగా ఉండాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు,

    - అభిమానుల‌కు పిలుపునిచ్చిన మంత్రి వెలంప‌ల్లి.

  • దేవిపట్నం మండలాన్ని మళ్ళీ ముంచెత్తనున్న వరద..
    13 Aug 2020 5:25 AM GMT

    దేవిపట్నం మండలాన్ని మళ్ళీ ముంచెత్తనున్న వరద..

    తూర్పుగోదావరి: 

    రాజమండ్రి: దేవిపట్నం మండలాన్ని మళ్ళీ ముంచెత్తనున్న వరద. ప్రమాదం

    - గోదావరి వరద పరవళ్ళుతో జలదిగ్భంధంలో చిక్కుకోనున్న 18 గిరిజన గ్రామాలు

    - పోశమ్మగండి వద్ద పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం వద్ద పోటెత్తి ప్రవహిస్తున్న వరద గోదావరి

    - దేవిపట్నం - తొయ్యేరు ప్రధాన రహదారిపై గోదావరి వరద నీరు..

    - పొంగుతున్న దండంగి వాగు..

    - పోశమ్మగండి, పూడిపల్లి, దేవిపట్నం, తొయ్యేరు, అగ్రహారం, మూలపాడు, మంటూరు, పెనీకీలపాడు, కచ్చులూరు, తున్నూరు, కొండమొదలు వంటి గ్రామాలకు తెగిపోతున్న రాకపోకలు

  • 13 Aug 2020 4:13 AM GMT

    బంగాళాఖాతంలో అల్పపీడనం..

    విశాఖ:

    - బంగాళాఖాతంలో అల్పపీడనం..

    - కోస్తా కు బారీ వర్ష సూచన..

    - మత్స్యకారుల కు కొనసాగుతున్న హెచ్చరికలు..

    - బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణీ, ఉపరితల ఆవర్తనం..

    - తీరం వెంబడి గంట కు 45 నుండి 55 కీ మీ వేగం తో గాలులు

    - సముద్రం లో 3.5 మీటర్ల ఎత్తులో అలల ఉదృతి...వుండే అవకాశం..

  • 13 Aug 2020 4:11 AM GMT

    కరోనా తీవ్రత నేపధ్యంలో జిల్లాలో సిరో సర్వైలెన్స్ సర్వే పూర్తి

    తూర్పుగోదావరి:

    రాజమండ్రి: కరోనా తీవ్రత నేపధ్యంలో జిల్లాలో సిరో సర్వైలెన్స్ సర్వే పూర్తి

    - 3757 మంది నుంచి రక్తనమూనాలు సేకరణ

    - వీటిలో హైరిస్క్ కరోనా సేవలలో నిమగ్నమైన 757 మంది నుంచి రక్తనమూనాలు

    - రక్త నమూనాలు ఇచ్చిన వారిలో జిల్లా కలెక్టరు మురళీధర్ రెడ్డి, జేసీలు రాజకుమారి, కీర్తి, ఎస్పీ నయిం ఆస్మీ, శిక్షణ కలెక్టరు అపరాజిత సింగ్

  • 13 Aug 2020 4:10 AM GMT

    తుంగభద్ర కు నిలకడగా కొనసాగుతున్న ప్రవాహం..

    అనంతపురం: 

    - డ్యాం ఇన్ ఫ్లో: 38823 క్యూసెక్కులు.

    - ఔట్ ఫ్లో: 9031 క్యూసెక్కులు.

    - డ్యాం లో నీటి నిల్వ: 88.380

    - పూర్తి స్థాయి నీటి మట్టం: 100.850

    - డ్యాం లో నీటి మట్టం: 1629.62 అడుగులు.

    - పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు.

  • 13 Aug 2020 4:09 AM GMT

    కరోనా కేసులలో ఏపీలోనే తూర్పుగోదావరి తొలిస్థానం

    తూర్పుగోదావరి: 

    రాజమండ్రి: కరోనా కేసులలో ఏపీలోనే తూర్పుగోదావరి తొలిస్థానం

    - 35వేల 642 కి చేరిన పాజిటీవ్ కేసులు

    - వీరిలో 20వేల 120 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు

    - యాక్టీవ్ పాజిటీవ్ కేసులు 15వేల 284 మంది

    - జిల్లాలో 238 కి చేరిన కరోనా మరణాలు

  • 13 Aug 2020 4:08 AM GMT

    హైకోర్టు లో మరో రెండు పిటిషన్లు దాఖలు..

    అమరావతి:

    - హైకోర్టు లో మరో రెండు పిటిషన్లు దాఖలు..

    - వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు..

    - కొత్తగా తీసుకొచ్చిన రెండు చట్టాలు చట్టవిరుద్దం అంటూ పిటిషన్ లో పేర్కొన్న పిటిషనర్..

    - ఇప్పటికే మూడు రాజధానుల కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మరి కొందరు రైతులు..

Print Article
Next Story
More Stories