Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 13ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం నవమి(ఉ. 09-25 వరకు) తదుపరి దశమి; రోహిణి నక్షత్రం (రా. 03-05 వరకు) తదుపరి మృగశిర నక్షత్రం, అమృత ఘడియలు (రా.11-38 నుంచి 01-21 వరకు), వర్జ్యం (సా.0 6-28 నుంచి 08-11 వరకు) దుర్ముహూర్తం (ఉ. 09-58 నుంచి 10-48 వరకు) రాహుకాలం (మ.01-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.05-45 సూర్యాస్తమయం సా.06-25

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 13 Aug 2020 4:05 AM GMT

    ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

    అమరావతి:

    - ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

    - వైఎస్ఆర్ చేయూతతో పేదరికానికి శాశ్వతంగా చెక్.

    - 45ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750

    - మొత్తం నాలుగేళ్లపాటు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకే డబ్బు.

    - జీవనోపాధి కోసం చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకోవడానికి చేయూత.

  • 13 Aug 2020 2:49 AM GMT

    కడప :

    పులివెందుల మండలంలోని కనంపల్లె తనిఖీ కేంద్రం వద్ద అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను పట్టుకున్న పొలీసులు...

    ఒకరి అరెస్ట్... 2.20 లక్షల విలువైన గుట్కా, పది మద్యం సీసాలు స్వాధీనం...

  • 13 Aug 2020 2:47 AM GMT

    విశాఖ తీరానికి అమ్మోనీయం నైట్రేట్ నౌక

    - అప్రమత్తమైన నౌకశ్రయ వర్గాలు..

    - రష్యా నుండి 25 వేల టన్నుల అమోనీయం నైట్రేట్ లోడుతో రాత్రి విశాఖ చేరుకున్న నౌక...

    - బీరూట్ ప్రమాదం దృష్ట్యా అత్యంత భద్రతా ప్రమాణాలను పాటిస్తున్న పోర్టు..

  • రాజమండ్రి వద్ద పరవళ్ళు తొక్కుతున్న వరద గోదావరి
    13 Aug 2020 2:39 AM GMT

    రాజమండ్రి వద్ద పరవళ్ళు తొక్కుతున్న వరద గోదావరి

    తూర్పుగోదావరి -రాజమండ్రి

    - గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ లో 175 గేట్లు ఎత్తివుంచిన అధికారులు

    - బ్యారేజ్ నుంచి 4లక్షల 10వేల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల

    - దిగువన పొంగుతున్న కోనసీమలోని వశిష్ట,వైనతేయ, గౌతమీ గోదావరి ఉపనదులు

    - అప్రమత్తమైన అధికార యంత్రాంగం '

    - పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం వద్ద మరింతగా పెరుగుతున్న వరద

    - పోలవరం ముంఫు మండలం దేవీపట్నం లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని అధికారుల హెచ్చరికలు

    - ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 9.40 అడుగుల నీటిమట్టం

    - భద్రాచలం వద్ద 32 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం

    - పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం వద్ద 24.750 మీటర్ల వరద నీటిమట్టం

    - డొంకరాయి ప్రాజెక్టు నుంచి 34వేల 500 క్యూసెక్కుల వరదనీరును గోదావరిలోకి విడుదల

    - ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కులకు పెరగనున్న వరద ప్రవాహం

  • స్వర్ణప్యాలెస్ ఘటనలో నివేదికలు సిద్ధం
    13 Aug 2020 2:34 AM GMT

    స్వర్ణప్యాలెస్ ఘటనలో నివేదికలు సిద్ధం

    విజయవాడ

    - ఈరోజు అధికారులకు ఫోరెన్సిక్, వైద్య, రెవెన్యూ, ఫైర్ నివేదికలు

    - రమేష్ హాస్పిటల్, స్వర్ణప్యాలెస్ యాజమాన్యాల కోసం కొనసాగుతున్న గాలింపులు

    - కోవిడ్ నెగెటివ్ వచ్చిన తరువాత కూడా ఎందుకు డిచ్ఛార్జ్ చేయలేదనే అనుమానాలు

    - ప్రభుత్వం ప్రైవేటు క్వారంటైన్ అంటుంటే, ప్రైవేటు కోవిడ్ కేర్ అనుమతులపై వ్యక్తమవుతున్న అనుమానం

    - నివాస భవన నిర్మాణానికి అనుమతులుంటే, హోటల్ ఎలా నిర్మించారనే దిశగా విచారణ

    - రిసెప్షన్ వద్ద ఘటన సమయానికి ఎవరూ లేరా అనే ప్రశ్నకు పొంతన లేని సమాధానాలు

Print Article
Next Story
More Stories