Live Updates: ఈరోజు (సెప్టెంబర్-11) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 11 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | నవమి (రా.11-12 వరకు) తదుపరి దశమి | మృగశిర (ఉ.11-55 వరకు) తదుపరి ఆర్ద్ర | అమృత ఘడియలు (రా.2-20 నుంచి 4-08 వరకు) | వర్జ్యం (రా.8-39 నుంచి 10-19 వరకు) | దుర్ముహూర్తం (ఉ.8-16 నుంచి 9-05 వరకు తిరిగి మ.12-21 నుంచి 1-10 వరకు) | రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-04

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 11 Sep 2020 9:45 AM GMT

    Guntur updates: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది..ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు..

    గుంటూరు....

    ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు..

    -రాజ్యాంగ న్ని పక్కనపెట్టి...రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది

    -కొడాలి నాని చంద్రబాబు, దేవినేని ఉమా గురించి అసభ్యకరంగా మాట్లాడటం దారుణం..

    -కొడాలి నాని మానవత్వం మరచి మాట్లాడుతున్నారు...

    -గుడివాడ లో టీడీపీ నాయకులపై గుండాలని పెట్టి దాడి చేయించారు...

    -ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు..

    -మీ ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేయటం తగదు..

    -న్యాయస్థానాలు, రాజ్యాంగం ఉంది మీ అరాచకాలు సాగవు.

  • Guntur updates: కొడాలి నాని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు...మాజీమంత్రి దేవినేని ఉమా..
    11 Sep 2020 9:42 AM GMT

    Guntur updates: కొడాలి నాని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు...మాజీమంత్రి దేవినేని ఉమా..

    గుంటూరు....

    -మాజీమంత్రి దేవినేని ఉమా..

    -ఈనెల 4న వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ విలేకరుల   సమావేశం ఏర్పాటు చేసి నాపై బెదిరింపులకు పాల్పడ్డారు...

    -ఒక బాధ్యత గల మంత్రి అయిఉండి అసభ్యకరంగా మాట్లాతున్నారు..

    -లారీతో గుద్ది యాక్సిడెంట్ చేసి చంపేస్తా అని బెదిరించారు...

    -ఈ కుట్రలో సీఎం జగన్ కు భాగం ఉంది...

    -అమరావతి రైతులు, దళితులని,న్యాయ విభాగంలో ఉన్నవారిని తిడితే కేసులు ఉండవా...రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది...

    -శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే వైసిపి నాయకులకు వత్తాసు పలుకుతున్నారు...

    -గుడివాడలో టీడీపీ నాయకులపై 20 మంది గుండాలు ఇంటిమీద పడి దాడిచేసై ఇప్పటివరకు చర్యలు లేవు...

    -కృష్ణా జలాలు పులివెందులకు ఇచ్చినందుకే మాపై సీఎం జగన్ కు కోపం...

    -రాష్ట్ర ప్రజలు అందరు వైసిపి అరాచకాలు గమనిస్తున్నారు...త్వరలోనే తగిన బుద్ధి చెప్తారు...

  • Vijayawada updates: గుడివాడలో దింట్యాల రాంబాబు ఇంటి పై దాడిని ఖండించిన కృష్ణా జిల్లా బ్రాహ్మణ సంఘనాయకులు..
    11 Sep 2020 9:28 AM GMT

    Vijayawada updates: గుడివాడలో దింట్యాల రాంబాబు ఇంటి పై దాడిని ఖండించిన కృష్ణా జిల్లా బ్రాహ్మణ సంఘనాయకులు..

    కృష్ణాజిల్లా..

    -గుడివాడలో టిడిపి మాజీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు ఇంటి పై దాడి నీ ఖండించిన కృష్ణా జిల్లా బ్రాహ్మణ సంఘనాయకులు.

    -కొడాలి నాని రాజదాని విషయంలో అసత్యాలు మాట్లాడుతుంటే, ఖండించిన బ్రాహ్మణ సంఘ నేతపై కొడాలి నాని అనుచరులు దాడి చేయడం హైయమైన చర్య -   బ్రాహ్మణ సంఘ నాయకులు

    -తక్షణమే మంత్రి కొడాలి నానీ క్షమాపణ చెప్పాలి - కృష్ణా జిల్లా బ్రాహ్మణ సంఘ నాయకులు.

  • Vijayawada updates: ఆసరా పధకాన్ని ప్రారంభించిన వైసీపీ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్..
    11 Sep 2020 9:24 AM GMT

    Vijayawada updates: ఆసరా పధకాన్ని ప్రారంభించిన వైసీపీ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్..

    విజయవాడ...

    దేవినేని అవినాష్ కామెంట్స్....

    -వైస్సార్ ఆసరా వారోత్సవాలు లో భాగంగా తూర్పు నియోజకవర్గంలో ఆసరా పధకాన్ని ప్రారంభించిన వైసీపీ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్

    -మహిళలు తో కలసి సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం

    -వైస్సార్ ఆసరా ద్వారా అందిన నగదుతో ఏర్పాటు చేసిన షాప్ ని ప్రారంభించిన అవినాష్

    -సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వైస్సార్ ఆసరా ప్రారంభించారు

    -మహిళ సాధికారిత కోసం వైసీపీ ప్రభుత్వం పని చేస్తుంది

    -మహిళలు ఆర్ధికంగా ఎదగటానికి జగన్ ఎంతో కృషి చేస్తున్నారు

    -సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారుల మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది

    -గత ప్రభుత్వం ఓట్ల కోసం రాజకీయాలు చేస్తే,, జగన్ మాత్రం ప్రజలు తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుందుకు పని చేస్తున్నారు

    -దేశంలోనే అందరికీ జగన్ రోల్ మోడల్ గా నిలుస్తున్నారు

    -వైస్సార్ ఆసరా ద్వారా మహిళల్లో మరింత ఆత్మవిశ్వాసన్నీ జగన్ నింపారు

    -మహిళలు ఇచ్చే ఆశీర్వాదం తో జగన్ మరో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉంటారు.

  • Mekatoti Sucharita-Home minister: శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా పోలీస్ పాసింగ్ పెరేడ్ లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు..
    11 Sep 2020 9:13 AM GMT

    Mekatoti Sucharita-Home minister: శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా పోలీస్ పాసింగ్ పెరేడ్ లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు..

    ప్రకాశం:

    -మేకతోటి సుచరిత - హోమ్ శాఖ మంత్రి...

    -ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, మంత్రులు బాలినేని శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతం సవాంగ్, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ లు పాల్గొన్నారు.

    -19 వ బ్యాచ్ కు చెందిన 398 మంది మహిళా పోలీసులు శిక్షణ పూర్తి చేసుకున్నారు.

    -అమరులైన పోలీసులకు 50 లక్షల బీమా కల్పించడం జరిగింది.

    -దేశం లోనే తొలి సారిగా వీక్లీ ఆఫ్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం మాదే.

    -ఆంధ్రప్రదేశ్ లో జీరో ఎఫ్ ఐ ఆర్ విజయవంతంగా అమలవుతోంది.

    -ఇప్పటివరకు రాష్ట్రంలో 320 జీరో FIR కేసులు నమోదు చేయడం జరిగింది.

    -మహిళా పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా మహిళా మిత్ర ను ఏర్పాటు చేసాము.

    -ఇంటర్నెట్ ద్వారా మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు సైబర్ మిత్ర ను ఏర్పాటు చేసాము.

    -ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతర్వేది ఘటన పై సీరియస్ గా ఉన్నారు.

    -సీబీఐ ఎంక్విరీ లో అన్ని విషయాలు బయటపడతాయి.

  • 11 Sep 2020 8:56 AM GMT

    East Godavari-Mamidikuduru: సాఫ్ట్ వేర్ భార్యకు వేధింపులు..కంటి డాక్టర్ అని చెప్పి మోసం..

    తూ.గో.జిల్లా.....

    మామిడికుదురు (మం)..

    -ఇంటర్ చదివి కంటి డాక్టర్ అని చెప్పి మోసం చేసి సాఫ్ట్ వెర్ యువతిని పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు

    -కంటి డాక్టర్ గా నమ్మ బలికి 2016 లో నగరం గ్రామానికి చెందిన కులుసుం ఉన్నిషా అనే వివాహితను పెళ్లాడిన ఆలీ హుస్సేన్

    -పెళ్లి అయ్యినప్పటి నుండి భర్త , అత్తా మామల నుండి ఉన్నిష కు వేధింపులు

    -నాలుగు సంవత్సరాలు నుండి 25 లక్షలు అదనపు కట్నం తేవాలంటూ తీవ్ర వేధింపులకు గురి చేసిన శాడిస్ట్ భర్త హాలీ ఉసేన్, అత్త ఫాతిమా గులబాజన్,     మామ  అలీ అబ్బాస్.

    -ఆడపిల్ల పుట్టిందని నెపంతో మరింత వేధింపులకు గురి చేసిన భర్త ఆలీ హుస్సేన్

    -కట్టుకున్న భార్యను నిత్యం వేధింపులకు గురిచేయడంతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్య కులుసుం ఉన్నిషా

    -ఇదే అదునుగా ఆగస్ట్ 6 న మరో మహిళతో హైదరాబాదులో వేరే పెళ్లి చేసుకున్న భర్త ఆలీ హుస్సేన్

    -హింసించి ...మోసం చేసిన భర్త ను శిక్షించకపోతే చావే శరణ్యం అంటున్న బాధితురాలు

  • Kurnool Updates:  శ్రీశైలం మండలంలో చెంచు గిరిజనులకు కరోనా టెస్టుల నిర్వహణ..
    11 Sep 2020 8:50 AM GMT

    Kurnool Updates: శ్రీశైలం మండలంలో చెంచు గిరిజనులకు కరోనా టెస్టుల నిర్వహణ..

    కర్నూలు జిల్లా..

    -ఇటీవల కాలంలో శ్రీశైలం మండలంలో విజృంభిస్తున్న కరోనా వ్యాప్తి నేపథ్యంలో చెంచు గిరిజనులకు కరోనా టెస్టుల నిర్వహణ

    -శ్రీశైలం గిరి పుత్రులకు కరోన టెస్టులను నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

    -శ్రీశైలం లో మేకల బండ చెంచుగూడెం, పాలధార-పంచదార, హటకేశ్వరం, శిఖరేశ్వరం వద్ద నివసిస్తున్న చెంచు గిరిజనులకు కరోన టెస్టుల నిర్వహణ

  • Srisailam Project updates: శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద..
    11 Sep 2020 8:44 AM GMT

    Srisailam Project updates: శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద..

    కర్నూలు జిల్లా....

    -7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత

    -ఇన్ ఫ్లో: 2,21,645 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో: 2,62,600 క్యూసెక్కులు

    -పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు

    -ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులు

    -పూర్తిస్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టిఎంసీలు

    -ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 214.3637 టీఎంసీలు

    -కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 11 Sep 2020 8:15 AM GMT

    East Godavari updates: అమలాపురం Rdo కార్యాలయం వద్ద జనసేన, బిజెపి ఆందోళన..

    తూర్పు గోదావరి జిల్లా..

    అమలాపురం..

    -అంతర్వేది సంఘటనలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్

    -హిందూ ఆలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్

    -ఆందోళనలో పాల్గొన్న బిజెపి నాయకులు మానేపల్లి అయ్యా జీవేమ, యాళ్ల దొరబాబు , జనసేన నాయకులు పితాని బాలకృష్ణ

    -పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని Rdo కార్యాలయంలో అందజేసిన బిజెపి, జనసేన నాయకులు

  • East Godavari updates: అంతర్వేది కేసు సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ..
    11 Sep 2020 8:12 AM GMT

    East Godavari updates: అంతర్వేది కేసు సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ..

    తూర్పుగోదావరి..

    -అంతర్వేది రథం దగ్ధం కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

    -ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఈరోజు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

    -సీబీఐ దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో వేచిచూడాలి

Print Article
Next Story
More Stories