Live Updates: ఈరోజు (సెప్టెంబర్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 10 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అష్టమి (రా.10-36 వరకు) తదుపరి నవమి | రోహిణి నక్షత్రం (ఉ. 10-28 వరకు) తదుపరి మృగశిర | అమృత ఘడియలు: ఉ.7-01 నుంచి 8-44 వరకు తిరిగి తె. 2-35 నుంచి 4-16 వరకు | వర్జ్యం: సా. 4-24 నుంచి 6-05 వరకు | దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-44 వరకు తిరిగి మ. 2-49 నుంచి 3-38 వరకు | రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-05

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 10 Sep 2020 1:08 PM GMT

    ACB Updates: మెదక్ అడిషనల్ కలెక్టర్ కేసులో కొనసాగుతున్న ఏసీబీ విచారణ...

    ఏసీబీ అప్ డేట్స్......

    -ఐదుగురు నిందితులను ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్న ఏసీబీ అధికారులు...

    -మరి కాసేపట్లో న్యాయమూర్తి నివాసంలో హాజరు పరచనున్న ఏసీబీ...

    -కలెక్టర్ నివాసంలో బ్యాంకు లాకర్ ను గుర్తించిన ఏసీబీ..

    -లాకర్ కీ తన వద్ద లేదంటున్న అడిషనల్ కలెక్టర్ నగేష్...

    -బ్యాంకు కు నోటిసులు ఇచ్చిన ఏసీబీ..

    -ఇతర ఉద్యోగుల పాత్ర, మాజీ అధికారి పాత్ర పై ఏసీబీ ఆరా..

    -ఆడియో టేపులు, చెక్ లు, ల్యాండ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్లను నిందితుల ముందు ఉంచి విచారిస్తున్న ఏసీబీ.

    -అడిషనల్ కలెక్టర్ నగేష్ వద్ద కీలక ఆధారాలు సేకరిస్తున్న ఏసీబీ..

    -నిందితుల నివాసాలలో దొరికిన నగదు, నగలు ఆస్తులను పరీశీలించిన ఏసీబీ....

  • 10 Sep 2020 1:06 PM GMT

    Kollur updates: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను సందర్శించిన శాసనసభాపతి పోచారం, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి..

    కొల్లూరు..

    -తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చురుగ్గా కొనసాగుతుదన్న కేటీఆర్

    -జిహెచ్ఎంసి పరిధిలో సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం.

    -ఈ సంవత్సరం డిసెంబర్  మాసానికి సుమారు 85వేల ఇళ్లను పేదలకి అందిస్తాం.

    -కొల్లూరులో జిహెచ్ఎంసి నిర్మిస్తున్న భారీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాజెక్టుని శాసనసభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో          కలిసి సందర్శించిన కేటీఆర్

    -అక్కడ కొనసాగుతున్న పనులను కేటీఆర్ సమీక్షించారు.

    -స్పీకర్, మంత్రులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, అక్కడ ఉన్న సౌకర్యాలు, పనులు జరుగుతున్న తీరు ని తెలుసుకున్నారు.

    -అంతకుముందు ముగ్గురు నిర్మాణం పూర్తయిన ఇళ్లల్లోకి వెళ్లి వాటిని స్వయంగా పరిశీలించారు.

    -ఈ టౌన్ షిప్ రికార్డుల్లోకెక్కుతుందని గుర్తు చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

    -ఇళ్ళు లేని నిరు పేదల కోసం, ప్రత్యేకంగా టౌన్ షిప్ నిర్మించడం బహుశా ప్రపంచంలోనే మొదటిసారి అన్న పోచారం.

    -దేశంలోనే పేదల హౌసింగ్ కార్యక్రమాల్లో కొల్లూరు ఒక ఆదర్శమైన ప్రాజెక్టుగా నిలుస్తుంది.


  • Hyderabad-Weather Updates: రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలతో పాటు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం..రాజారావు వాతావరణ అధికారి..
    10 Sep 2020 12:59 PM GMT

    Hyderabad-Weather Updates: రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలతో పాటు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం..రాజారావు వాతావరణ అధికారి..

    రాజారావు వాతావరణ అధికారి @ హైదరాబాద్..

    -3.6కిమీ ఎత్తున షీర్ జోన్స్ ఏర్పడడం వల్ల ఈరోజు నుండీ వచ్చే 5 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలతో పాటు 1-2 చోట్ల భారీ వర్షాలు     కురిసే అవకాశం ఉంది..

    -ఈనెల 13 న పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో ఆంద్రప్రదేశ్ తీరానికి వెంబడి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది..

    -13 నుండి తెలంగాణ జిల్లాలో ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..

    -గత 10 రోజులుగా నిన్నటి వరకు గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి...

    -నిన్న భద్రాచలం లో 36.2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది..

    -నిన్నటి వరకు ఎలాంటి ఉపరితల అవర్తనాలు ఏర్పడలేవు గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం వల్లే వాతావరణం లో మార్పులు...

  • 10 Sep 2020 12:48 PM GMT

    Seconderabad updates: మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన మహిళ కేసు చేదించిన మార్కెట్ పోలీసులు..

    సికింద్రాబాద్.. 

    -సికింద్రాబాద్ మార్కెట్ పోలిస్ స్టేషన్..

    -శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన మార్కెట్ పోలీసులు..

    -మృతురాలు బన్సీలాల్ పేట్ లో ఒంటరిగా నివాసం ఉంటున్న మహిళ గా గుర్తించిన పోలీసులు..

    -మరికొద్ది సేపట్లో మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించనున్న నార్త్ జోన్ డీసీపీ కళామేశ్వర్.

  • 10 Sep 2020 9:45 AM GMT

    ACB updates: మెదక్ ఏసీబీ కేసులో దర్యాప్తు ముమ్మరం...

    ఏసీబీ అప్ డేట్స్......

    -అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులను ఏసీబీ ప్రధాన కార్యాలయంకు తీసుకొచ్చిన ఏసీబీ...

    -హైదరాబాద్ ఏసీబీ ప్రధాన కార్యాలయం లో ఐదుగురు నిందితులను విచారిస్తున్న ఏసీబీ అధికారులు...

    -ఉన్నతాధికారి పాత్ర తో పాటు కింది స్థాయి ఉద్యోగుల పాత్ర పై నిందితులను నుండి వివరాలు సేకరిస్తున్న ఏసీబీ...

    -స్టాంప్ అండ్ రీజిస్టేషన్ కు రాసిన లేఖ తో మాజీ కలెక్టర్ పాత్ర పై అనుమానాలు...

    -మాజీ కలెక్టర్ రిటైర్మెంట్ రోజునే స్టాంప్ అండ్ రీజిస్టేషన్ కు లేఖ..

    -దీంతో మాజీ కలెక్టర్ పై బలపడుతున్న అనుమానాలు...

    -అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులను ఉస్మానియా ఆసుపత్రి లో వైద్య పరీక్షలు నిర్వహించనున్న ఏసీబీ...

    -అనంతరం ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్న ఏసీబీ అధికారులు...

  • 10 Sep 2020 9:40 AM GMT

    Telangana updates: రవీంద్రభారతి వద్ద ప్రయివేటు స్కూల్ టీచర్ నాగులు ఆత్మహత్యయత్నం బాధాకరం...నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శి..

    నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శి..

    -ప్రయివేటు స్కూల్ లో పనిచేసే టీచర్లు ఉద్యోగాలు లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు..

    -దీనిమీద ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం అడ్డుకోకపోవడంతో టీచర్లు ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు...

    -తక్షణమే ప్రభుత్వం ప్రయివేటు టీచర్లకు డబ్బులు రుణాలు ఇప్పించాలి వాళ్ళని ఆదుకోవాలి...

    -ఆత్మహత్యయత్నం చేసిన టీచర్ కి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి..

  • 10 Sep 2020 9:10 AM GMT

    Kamareddy updates: తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో తమ్మినేని కామెంట్స్..

    కామారెడ్డి..

    -తమ్మినేని కామెంట్స్..

    -తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి     తమ్మినేని వీరభద్రం

    -తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచింది

    -నిజాం సర్కార్ చేస్తున్న దౌర్జన్యాలపై ఐలమ్మ పోరాడింది

    -ఆమె స్పూర్తితో మేము పోరాటాలకు సిద్ధం అవుతున్నాము

    -సీఎం కేసీఆర్ తెచ్చిన నూతన రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం

    -రైతుబంధు సమయంలో కూడా కౌలు రైతులను గుర్తించలేదు

    -ఈ చట్టంలో రెవిన్యూ లోపాలు, కుంభకోణాల జోలికి వెళ్ళలేదు

    -కొత్తగా భూ సర్వే పై శాసన సభలో చట్టం చేయాలి

  • 10 Sep 2020 9:05 AM GMT

    Pragathi Bhavan: ప్రగతి భవన్ లో ప్రారంభమైన ఎంపీల తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ.

    ప్రగతి భవన్..

    -సమావేశానికి ప్రభుత్వం ఉన్నతాధికారులను కూడా పిలిచిన కేసీఆర్.

    -కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, జిఎస్టి వాటా, పరిపాలన అనుమతులు, కొత్త విద్యుత్ చట్టం పై చర్చ.

    -పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అంశాలు, సభలో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్..

  • 10 Sep 2020 9:00 AM GMT

    Telangana updates: కేసీఆర్ మూడనమ్మకాల కోసం సచివాలయం.. గుడి.. మజీద్ కూల్చివేసారు....రేవంత్ రెడ్డి..

    -రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ @ అరణ్య భవన్

    -హుస్సేన్ సాగర్ పరిదిలో సచివాలయం నిర్మాణం వస్తుంది

    -2006తరువాత మ్యాపులే ఉంచి.. పాతవి మాయం చేసింది

    -ఎన్జీటి బృందం ను తప్పు దోవ పట్టించారు

    -సికింద్రాబాద్ ఆర్మీ ఏరియాలో ఉన్న బ్రిటిష్ లైబ్రరీ లో పాత మ్యాప్ ఉంది

    -సచివాలయంకు అన్ని అనుమతులు వచ్చాయని .. త్వరలోనే సచివాలయం నిర్మాణం చేస్తామని సునీల్ శర్మ ప్రకటించారు

    -400కోట్ల నుంచి 700కోట్లకు అంచనాలు పెంచేసారు

    -హుస్సేన్ సాగర్ చుట్టు ఉన్న నిర్మానాలు అన్ని తాత్కాలిక మైనవే

    -మక్తాకూడా హుస్సేన్ సాగర్ అని తేల్చింది

    -ఖైరతాబాద్ నుంచి మింట్ కంపౌండ్.. అమృత కస్టల్.. బండ్ వరకు హుస్సేన్ సాగర్ అని కేంద్ర కమిటీ తీర్పు ఇచ్చింది

    -గుళ్ళను కూల్చిలేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

    -ఎర్రగడ్డ కేసీఆర్ జన్మస్థలం..

    -ఎన్జీటి కమిటీ వచ్చిందని నన్ను హౌజ్ అరెస్ట్ చేసారు

  • 10 Sep 2020 8:38 AM GMT

    Pragathi Bhavan: మరికొద్ది సేపట్లో ప్రగతిభవన్ లో పార్టీ ఎంపీలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్..

    -సీఎం తో జరిగే ఈ సమావేశానికి పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరవుతారు.

    -ఈ నెల 14 నుండి పార్లమెంట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

    -రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జిఎస్టి       విషయంలో కేంద్రం వైఖరి.

    -ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెందని సీనియర్ అధికారులు కూడా పాల్గొని వివిధ అంశాలపై వివరాలు అందిస్తారు.

Print Article
Next Story
More Stories