Live Updates: ఈరోజు (సెప్టెంబర్-09) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 09 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | సప్తమి (రా.9-31వరకు) తదుపరి అష్టమి, | కృత్తిక నక్షత్రం (ఉ. 8-34వరకు) తదుపరి రోహిణి | అమృత ఘడియలు ఉ. 5-56 నుంచి 7-41 వరకు | వర్జ్యం రా. 1-50 నుంచి 3-34 వరకు | దుర్ముహూర్తం: ఉ. 11-33 నుంచి 12-22 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-06

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 9 Sep 2020 6:33 AM GMT

    Antervedi updates: పోలీసుల వలయంలో అంతర్వేది ఆలయం..

    తూర్పుగోదావరి..

    -అంతర్వేది స్వామి వారి ఆలయం వద్ద భారీగా పోలీసులు

    -పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు

    -గ్రామాల నుంచి ఆలయం వద్దకు ఏవిధమైన వాహనాలు రాకుండా, వెళ్లకుండా పోలీసు బారికేడ్లు ఏర్పాటు.

  • Srikakulam updates: రాజాం మడ్డువలస రిజర్వాయర్ ఆఫీస్ ముందు జి సిగడాం మండలం రైతులు ఆందోళన..
    9 Sep 2020 6:31 AM GMT

    Srikakulam updates: రాజాం మడ్డువలస రిజర్వాయర్ ఆఫీస్ ముందు జి సిగడాం మండలం రైతులు ఆందోళన..

    శ్రీకాకుళం జిల్లా..

    -రెండు సంవత్సరాలుగా మడ్డువలస కుడికాలువ ద్వారా నీరు రావడం అందడం లేదంటూ ధర్నా..

    -అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంతో ఆందోళన బాట పట్టిన రైతులు..

    -బిజెపి ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన..

  • Amaravati updates: సచివాలయంలో మరో 17 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్..
    9 Sep 2020 6:28 AM GMT

    Amaravati updates: సచివాలయంలో మరో 17 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్..

    అమరావతి..

    -సచివాలయం లో 100 దాటిన కరోనా కేసులు

    -తాజా కేసులతో ప్లానింగ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ కు వర్క్ ఫ్రమ్ హోం

  • Kakinada updates: రాష్ట్రీయ బ్రాహ్మిన్ ఫ్రంటి తెలుఁగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్సి dhv సాంబశివరావ్ కామేంట్స్....
    9 Sep 2020 6:26 AM GMT

    Kakinada updates: రాష్ట్రీయ బ్రాహ్మిన్ ఫ్రంటి తెలుఁగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్సి dhv సాంబశివరావ్ కామేంట్స్....

    తూర్పు గొదావరి....

    -అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం రథం దగ్ధం ఫై విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర వెంటనె స్పందించ్చారు.

    -అయితే సాధుపరిషత్ పేరిట శ్రీనివాసానంద అనే సాధువు ఈ విషయంలో శారదా పీఠాధిపతి ని నిందించడం సమంజసం కాదు..

    -ఆ సాధువు చేసిన ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నము

    -దేశంలోనే కాదు, ప్రపంచంలోనే విశాఖ శారదా పీఠానికి హిందూ ధర్మాన్ని కాపాడే ఏకైక పీఠంగా పేరు ఉంది..

    -మరోసారి ఈ సాధువు రాజకీయాలు మాట్లాడినా, విశాఖ శారదా పీఠం పేరు ఎత్తినా సహించేది లేదు..

    -స్వామీజీ సూచనల మేరకు మంత్రులు పర్యటించారని,లోతుగా విచారణ చేస్తున్నారు..

    -మరోసారి స్వరూపానంద పై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు..

  • Amaravati updates: సచివాలయం లో వాస్తు మార్పులు..
    9 Sep 2020 6:20 AM GMT

    Amaravati updates: సచివాలయం లో వాస్తు మార్పులు..

    అమరావతి..

    -ఇప్పటికే అసెంబ్లీ, సచివాలయంలో మూడు గేట్లు మూసివేత

    -తాజాగా మరో రెండు గేట్లకు గోడను నిర్మిస్తున్న అధికారులు

    -సచివాలయం గేట్ నంబర్ 1, అసెంబ్లీ గెట్ నంబర్ 2 వద్ద గోడ నిర్మాణం

    -గతం లో అసెంబ్లీ గేట్ నంబర్ 5, సచివాలయం గేట్ నంబర్ 1, 8 మూసివేత.

  • Amaravati updates: మూడు రాజధానులపై సీఎం జగన్..
    9 Sep 2020 5:34 AM GMT

    Amaravati updates: మూడు రాజధానులపై సీఎం జగన్..

    అమరావతి..

    -ఏపీకి మూడు రాజధానులు, అమరావతి భవిష్యత్తు, పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, ఫోన్ ట్యాపింగ్ వంటి పలు కీలక అంశాలపై ఒక జాతీయ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి

    -లక్ష కోట్ల ఖర్చు బెట్టి మహా నగరాన్ని నిర్మించడం సాధ్యం కాదు.

    -దానివల్ల అదనపు ఆదాయం పక్కన పెడితే,మౌలిక సదుపాయాల కోసం చేసిన అప్పులు కూడా తీర్చలేము.

    -అమెరికా ఆర్థిక వ్యవస్థలో మహా నగరాల పాత్ర ఎక్కడా?

    -గతంలో విశాఖపట్నం రాజధాని కాదు చిన్న పట్నంలా ఉన్న సమయంలో దశాబ్దాల క్రితం స్టీల్ ప్లాంట్ తో చాలా పరిశ్రమలు వచ్చాయి.

    -ఇప్పుడు విశాఖపట్నం మహా నగరంగా అభివృద్ధి చెందుతుంది.

    -పెట్టుబడులు అన్ని ఒక ప్రాంతంలో పెట్టడం కంటే అనేక ప్రాంతాలను అనుసంధానం చేయవచ్చు.

    -నగరాల ద్వారా ఆదాయాలు పెరుగుతాయని అనుకోవడం తప్పుడు ఆలోచన.

    -ఒకటి రెండు మినహాయించి ప్రపంచంలో ఎక్కడా కూడా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీస్ సఫలం కాలేదు.

    -శివరామ కృష్ణన్ కమిటీ చెప్పిన విధంగానే మూడు ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం.

    -ప్రభుత్వ పనులు మొత్తం ఒకే ప్రాంతం నుండి ఎందుకు జరగాలి.

    -చెన్నై, హైదరాబాద్ ద్వారా రాష్ట్రం ఇప్పటికే నష్టం పోయిందని చరిత్ర చెప్తుంది.

    -గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని కూడా మూడు ప్రాంతాలపై దృష్టి పెట్టాం

    -1990లో గతంలో హైదరాబాద్ జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ తరహాలో అమరావతిలో కూడా చెయ్యాలని చూసారు.

    -సచివాలయం,హైకోర్టు,అసెంబ్లీ వల్ల అభివృద్ధి జరగదు అని భావిస్తే వాటి కోసం ఎందుకు పట్టుబడుతున్నారు.

    -అమరావతి ప్రాంతం భారీ నిర్మాణాలకు అనువైన ప్రాంతం కాదు.

    -33వే ల ఎకరాలు రైతుల నుండి తీసుకోవడం కంటే మరో ప్రాంతంలో 500ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టి ఉండొచ్చు.

    -*భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది*

    -బినామిలు అందరూ బయటపడతారు.

    -రాజధానిలో భూములు కొన్నవారు వేల కోట్లు సంపాదించారు.

    -విశాఖపట్నం,అనంతపురం, కర్నూలు,తిరుపతి సహా రాష్జ్త్రంలో మరోకోన్నీ నగరాలు అభివృద్ధి కేంద్రాలుగా మారతాయి.

    -నేను అమరావతిని విస్మరించలేదు ఇక్కడ శాసన రాజధాని కొనసాగుతుంది

    -దేశంలో రెఫరెండం కాన్సెప్ట్ ఉపయోగంలో లేదు అందుకే నిపుణుల సలహా తీసుకుంటున్నాం

    -దేశంలో రెఫరెండం అప్షన్ ఉంటే ఈ అంశంపై రెఫరెండం కు వెళ్లే వాళ్ళం.

    -అభివృద్ధి వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రజల మద్దత్తు ఉందని మాకు నమ్మకం.

    -కేవలం29గ్రామాలు,10 వే ల మంది రైతులు అనేక కారణాల వల్ల వ్యతిరేకిస్తున్నారు కానీ, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు అన్ని వికేంద్రీకరణకు మద్దత్తు ఇస్తున్నాయి

    -చంద్రబాబుకు మరో ఎజెండా లేదు.

    -గత 15నెలలుగా చంద్రబాబు అమరావతి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు.

    -మేము అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని ముందే చెప్పాము.

    -అమరావతి అంత చర్చించదగిన అంశం కాదు

    -ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన సీఎం

    -ఆధారాలు సమర్పించాలని డిజిపి చంద్రబాబును కోరారు.

    -ట్యాపింగ్ కు సంబంధించి ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు.

    -మేము ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మా ఫోన్ ట్యాప్ చేశారు. ఆధారాలు కూడా సమర్పించాం.

    -కాంగ్రెస్,బీజేపీలపై మాది రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ.

    -లోక్ సభలో నాలుగవ అతిపెద్ద పార్టీ అయినప్పటికీ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయ లేదు.

    -రాష్ట్ర విభజన అనంతరం కేవలం ఎపి అభివృద్ధిపై మాత్రమే మేము దృష్టి సారించాం.

    -రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నాం.

    -జాతీయ అంశాలు మాకు అంత ప్రాధాన్యత కాదు.

    -కేంద్రంతో సంబంధాలు

    -ఎపి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో మా మద్దతు ఉంటుంది.

    -ప్రత్యేక హోదా కోసం మా పోరాటం కొనసాగుతుంది.

    -రెవెన్యూ లోటుతో రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది.

    -పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తేనే రాష్ట్రాభివృద్ధి చెందుతుంది.

    -ప్రత్యేక ప్యాకేజి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.

    -జిఎస్టీ మినహాయింపు లపై కేంద్రంజిఎస్టీ చెల్లింపులలో కొంత ఆలస్యం చేసినప్పటికీ, పెద్ద ఎత్తున జిఎస్టీ చెల్లింపులు తగ్గించలేదు.

    -కరోన నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని కేంద్రo అర్థం చేసుకోవాలి.

    -ప్రస్తుతంసంక్షోభం నుండి బయట పడాలి అంటే అప్పులు తెచ్చుకోవడమే మార్గం.

    -ఇప్పటికే అదనంగా అప్పులు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

    -ప్రజల పై పన్నుల భారం విధించలేము.

    -ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషిస్తున్నాం.

    -ఇంగ్లిష్ మీడియంపై సీఎం జగన్

    -జాతీయ విద్యా విధానంలో కూడా 6వ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియంకు శ్రీకారం చుట్టారు

    -మేము ఇంగ్లీష్ మీడియం అమలు దిశగా అడుగులు వేశాం.

    -జాతీయ విద్యా విధానంపై 2020 దేశంలో సమానత్వాన్ని తీసుకొస్తుంది.

    -ఇంగ్లీష్ పై ప్రేమతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టలేదు.

    -మాతృభాషను విస్మరించము విస్మరించే ఆలోచన కూడా లేదు.

    -సమానత్వాన్ని తీసుకు రావడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం

    -స్థోమత ఉన్న వాళ్లు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీషు మీడియం చదివిస్తుంటే పేద విద్యార్థులు మాత్రం ప్రాంతీయ భాషల్లో చదువుతున్నారు.

    -ప్రయివేటు స్కూల్ నుండి వచ్చిన వారు ప్రభుత్వ,ప్రయివేటు రంగాల్లో అధిక శాతం ఉద్యోగాలు సాధిస్తున్నారు.

    -సీఎం జగన్..

  • Visakhapatnam updates: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..
    9 Sep 2020 4:03 AM GMT

    Visakhapatnam updates: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

    విశాఖ..

    -ఈనెల 13 నాటికి ఆంధ్రప్రదేశ్ తీరాన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.

    -దాని ప్రభావంతో తగ్గునున్న పగటి ష్ణోగ్రతలు

    -ఈనెల 12 నుంచీ కోస్తాంధ్ర, తెలంగాణలకు వర్షాలు

    -నేడు రేపు తెలంగాణ, రాయలసీమల్లో ఉరుములతో కూడిన జల్లులు. ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల జల్లులు

  • Antarvedi Fire Accident: చలో అంతర్వేది కి పిలుపునిచ్చిన బిజెపి, జనసేన నాయకుల గృహనిర్బంధం
    9 Sep 2020 2:35 AM GMT

    Antarvedi Fire Accident: చలో అంతర్వేది కి పిలుపునిచ్చిన బిజెపి, జనసేన నాయకుల గృహనిర్బంధం

    తూర్పు గోదావరి

    అమలాపురం: అమలాపురం సబ్ డివిజన్ లో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా చలో అంతర్వేది కి పిలుపునిచ్చిన బిజెపి జనసేన నాయకులను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేసిన పోలీసులు..

    - కర్ఫ్యూ వాతావరణం తలపిస్తున్న కోనసీమ...

    - 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా ర్యాలీలు ,నిరసన కార్యక్రమాలు నిషేధం

    - ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది..

    - నిన్న అనుమతి లేకుండా చలో అంతర్వేది కార్యక్రమంలో నిర్వహించిన 43 మంది పై కేసు నమోదు చేసి అరెస్టు లు.

  • 9 Sep 2020 2:31 AM GMT

    Anantapur Pesticides: అనంతపురం జిల్లాలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

    - జిల్లా వ్యాప్తంగా 64.50 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలు నిలిపివేత

    - ఎరువుల కు సంబంధించి సరైన పత్రాలు డీలర్ల వద్ద లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు

    - మొత్తం రూ.13,12,573 విలువైన సరుకును సీజ్ చేసిన అధికారులు.

  • Anantapur Arts College: ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు అనంతపురం ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు పరీక్షలు.
    9 Sep 2020 2:30 AM GMT

    Anantapur Arts College: ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు అనంతపురం ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు పరీక్షలు.

    అనంతపురం: 

    - ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు బిఏ, బీకాం పరీక్షలు

    - మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు బిఎస్సి పరీక్షలు నిర్వహణ

    - మొత్తం 1622 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

Print Article
Next Story
More Stories