Live Updates: ఈరోజు (సెప్టెంబర్-08) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 08 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | షష్ఠి (రా. 8-01 వరకు) తదుపరి సప్తమి | భరణి (ఉ. 6-18 వరకు) తదుపరి కృత్తిక | అమృత ఘడియలు లేవు | వర్జ్యం (రాత్రి 7-26 నుంచి 9-11 వరకు) | దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-06 వరకు తిరిగి రాత్రి 10-48 నుంచి 11-35 వరకు) | రాహుకాలం (సా. 3-00 నుంచి 4-30 వరకు) | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-07

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Coronavirus updates: అసెంబ్లీలో కరోనా కలకలం..
    8 Sep 2020 10:37 AM GMT

    Coronavirus updates: అసెంబ్లీలో కరోనా కలకలం..

    -అసెంబ్లీలో పాసులు ఇష్యూ చేసే ఉద్యోగికి కరోనా.

    -వందల సంఖ్యలో ఉద్యోగులకు సిబ్బంది కి పాసులు ఇష్యూ చేసిన అసెంబ్లీ ఉద్యోగి.

    -కరోనా పరీక్ష చేయించుకొని నెగిటివ్ రిపోర్టు ఉంటేనే అనుమతి అన్న అధికారులు.

    -ఎక్కడ చేక్ చేయని భద్రతా సిబ్బంది.

  • 8 Sep 2020 10:19 AM GMT

    Telangana updates: పివి కి భారత రత్న తీర్మాణం పై బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు..

    -పివి నరసింహరావు ప్రధాని కాకముందు దేశ పరిస్థితి వేరేలా ఉంది.

    -అటల్ బిహారి వాజ్ పేయి తో పివికి మంచి సాన్నిహిత్యం ఉంది.

    -ఆర్ధిక సంస్కరణల్లో పివి తీసుకున్న నిర్ణయాన్ని అటల్ బిహారి వాజ్ పేయి ప్రతిసారి మద్దతు ఇచ్చారు..

    -పివి ఒక మహానియా వ్యక్తి...

    -ప్రధానిగా పనిచేసిన పివికి ఆయన మరణించిన తరువాత తగిన గౌరవం దక్కలేదు..

    -పివి భారత రత్న ఇవ్వాలన్న ప్రభుత్వ తీర్మానం కు బీజేపీ మద్దతు తెలుపుతుంది...

  • Telangana updates: పివి నరసింహరావు కు భారత రత్న ఇవ్వాలన్న ప్రభుత్వం తీర్మానం కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది..జీవన్ రెడ్డి..
    8 Sep 2020 10:14 AM GMT

    Telangana updates: పివి నరసింహరావు కు భారత రత్న ఇవ్వాలన్న ప్రభుత్వం తీర్మానం కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది..జీవన్ రెడ్డి..

    జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీ..

    -ఇందిరా గాంధీ కి పివి అత్యంత సన్నిహితుడు...

    -భూ సంస్కరణల్లో గుర్తింపు పొందారు..

    -దేశ రాజకీయాల్లో ఇందిరాగాంధీ కి పివి అండగా నిలిచారు..

    -కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పివి కృషి చేసారు...

    -దేశ ఆర్థిక వ్యవస్థ ను ముందుకు తీసుకువెళ్లారు...

    -భారత రాజకీయాల్లో పివి ది ప్రత్యేక స్థానం...

    -హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ కి పివి పేరు పెట్టాలి..


  • TS-Legislative Council updates:  పివికి భరత రత్న తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్..
    8 Sep 2020 9:57 AM GMT

    TS-Legislative Council updates: పివికి భరత రత్న తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్..

    శాసన మండలి..

    -భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశ ఆర్థిక పరిస్థితి ని గాడిలో పెట్టారు..

    -ఆర్ధిక సంస్కరణలు చేసిన గొప్ప వ్యక్తి..

    -కాశ్మీరు లో శాంతి నెలకొల్పారు.

    -భూసంస్కరణలు చేసి పేద ప్రజలకు భూములు అందజేసిన వ్యక్తి పివి..

    -పివి నరసింహ రావు బహు బాషా కోవిధుడు..

    -పివి పాండిత్యం చాలా గొప్పది...

    -ప్రధానిగా మన దేశాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లారు...

    -పీవీ కి భారత రత్న ఇప్పటికే ఆలస్యం అయింది...ఇప్పటికి అయినా పివి భారత రత్న తక్షణమే ఇవ్వాలి...

    -పార్లమెంట్ ప్రాంగణంలో పివి విగ్రహం పెట్టాలి..

    -హైదరాబాద్ విశ్వవిద్యాలయనికి పివి పెరు పెట్టాలి...

  • Telangana updates: రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లులు, చట్టాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది:చాడా వెంకట్ రెడ్డి...
    8 Sep 2020 9:44 AM GMT

    Telangana updates: రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లులు, చట్టాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది:చాడా వెంకట్ రెడ్డి...

    చాడా వెంకట్ రెడ్డి...సిపిఐ రాష్ట్ర కార్యదర్శి....

    -రాష్ట్రంలో చెరువులు, కుంటలు అన్యాక్రాంత మైతున్నాయని పలు మార్లు విన్న వించిన పట్టించుకోలేదు.

    -ప్రశ్నించే వారిని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు...

    -సమగ్ర సర్వే చేయకుండా ఎల్ ఆర్ ఎస్ అమలు చేయడం అసాధ్యం

    -రెవెన్యూ చట్టానికి సంబంధించి ముసాయిదా పెట్టి ప్రజలలో చర్చకు పెట్టాలి...

    -కరోనా పై అసెంబ్లీలో బలమైన చర్చ జరగాలి...

    -రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి....

    -తెలంగాణ సాయుధ పోరాట కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 11 నుండి 17 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాం....

  • TS High court: పెంఛనర్ల పిటీషన్ పై హైకోర్టు లో విచారణ..
    8 Sep 2020 9:32 AM GMT

    TS High court: పెంఛనర్ల పిటీషన్ పై హైకోర్టు లో విచారణ..

    టీఎస్ హైకోర్టు....

    -అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో పెన్షనర్ల పిటీషన్ పై ప్రభుత్వం సానుకూలంగా ప్రకటన చేసే అవకాశం ఉందన్న ఏజీ

    -అసెంబ్లీ సమావేశాలోపు పెంఛనార్ల పై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామన్న హై కోర్ట్

    -లేని పక్షంలో తాము ఆదేశాలు ఇస్తామన్న హైకోర్ట్.

    -తదుపరి విచారణ అక్టోబర్ 1 కు వాయిదా వేసిన హైకోర్టు..

  • 8 Sep 2020 8:52 AM GMT

    Medchal–Malkajgiri updates: మేడిపల్లి మండలం నారపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు రియల్టర్ల ధర్నా...

    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా....

    -ఎల్ ఆర్ ఎస్ లేని ప్లాట్లను కూడా యధావిధిగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్...

    -ఉప్పల్ డిపో నుండి మేడిపల్లి మీదుగా నారపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ...

    -131 జీవో ద్వారా ఎల్ ఆర్ ఎస్ చార్జీలు పెంచడం సామాన్య ప్రజలను ముంచడమే...

    -2వందల గజాల లోపు ఉన్న ప్లాట్లను ఒక రూపాయికి ఎల్ ఆర్ ఎస్ ఇవ్వాలి...

    -స్థానిక సంస్థల ఆమోదం పొందిన లేఅవుట్ల లోని ప్లాట్లు అక్రమమని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు...

    -నామమాత్రపు రుసుముకే ఎల్ ఆర్ ఎస్ ఇవ్వాలి..

    -lrs ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేయాలి, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్న రియల్టర్లు..

  • 8 Sep 2020 8:27 AM GMT

    Telangana updates: రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా..సోము వీర్రాజు..

    సోము వీర్రాజు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు..

    -హిందుత్వాన్ని పరిరక్షింస్తుందా లేదా తేల్చి చెప్పాలి.

    -రాష్టంలో దేవాలయాలలో జరుగుతున్న పరిణామాలు పై భాజపా ఒక కమిటీ వేస్తాం.

    -అంత్యర్వేది ఘటన పై టిడిపి మాట్లాడే హక్కు లేదు .

    -గోదావరి,కృష్ణ, పుష్కరాల సమయంలో ఎన్నో దేవాలయాలు టిడిపి ప్రభుత్వం కూల్చి వేసింది.

    2024 లో అన్ని మతాలకు మేలు చేసేలా మేనిఫెస్టో నిర్మిస్తునాం...

    పెద్ద సంఖ్యలో స్వామిజీ లు తూర్పుగోదావరి చేరుకుంటున్నారు..రేపు నేను వెళ్తున్నాను.:

  • 8 Sep 2020 8:23 AM GMT

    Telangana updates: గన్ పార్క్ నుండి ప్లకార్డుల తో ప్రదర్శనతో అసెంబ్లీ కి బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్ర రావు...

    -అసెంబ్లీ గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు..

    -ప్లకార్డులు బయటే పెట్టి అసహనంతో లోపలికి వెళ్లిన బీజేపీ నేతలు...

    -ప్లకార్డుల్లో పలు డిమాండ్లు..

    -ప్రభుత్వ ఉద్యోగులకు , ఉపాధ్యాయులకు పీఆర్సీ ,ఐఆర్ ప్రకటించాలి..

    -కరోన కట్టడిలో ప్రభుత్వం విఫలం...

    -జీవో నెం 131 ని ఎల్ ఆరేస్ పై ఉపసహరించుకోవాలి ..

    -ప్రయివేటు స్కూల్ టీచర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి..

  • 8 Sep 2020 8:19 AM GMT

    Yadadri Bhuvanagiri updates: -కెసిఆర్ ని ఉద్దేశిస్తూ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ మీట్...

    యాదాద్రి భువనగిరి జిల్లా..

    -భువనగిరి బైపాస్ వద్ద ఓ హోటల్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ మీట్.....కామెంట్స్...

    -సెప్టెంబర్ 17 ని అధికారికంగా నిర్వహించాలి...

    -రాష్ట్రాన్ని ఏలని వాడు, దేశాన్ని ఎలా ఉద్దరిస్తాడు...

    - కేసీఆర్ మజ్లీస్ తో లోపాయకారి ఒప్పందం తో రాష్ట్రాన్ని దివాళా తీయించారు...రేపు దేశాన్ని అప్పగిస్తే ఓ పాకిస్థాన్ కో, ఆఫ్ఘనిస్తాన్ కో అంటగడుతారు...

    - ఎల్ ఆర్ ఎస్ పేరు తో హైదరాబాద్ లోని వారి అక్రమ ఆస్తులను క్రమబద్ధీకరణ చేసుకోవటానికే...

    - ఎల్ ఆర్ ఎస్ పేరుతో పేదల రక్తం తాగుతున్నారు...

    - రెవిన్యూ చట్టాన్ని నిర్వీర్యం చేశారు. పేదలకు అన్యాయం చేస్తున్నారు.

    -ప్రజల దృష్టి ని మరల్చడానికి కొన్ని పత్రికలలో అనుకూల వార్తలు రాయించుకుంటున్నారు .

Print Article
Next Story
More Stories