Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 08 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పంచమి (మ. 3-36 వరకు) తదుపరి షష్ఠి; ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి రేవతి నక్షత్రం, అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 8 Aug 2020 12:05 PM GMT

    తూర్పు గోదావరి:

    పెద్దాపురం: మాజీ ఉపముఖ్యమంత్రి మరియు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కామెంట్స్..

    - ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఒక వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మించాలి అని అమరావతి ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది.

    - దీనితో బాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతా ల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి పని చేసింది

    - ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిమిత్తం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించి అభివృద్ధిలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సముచితం స్ధానం కల్పించి అక్కడ ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది.

    - హూద్ హూద్ తుఫాన్ తర్వాత విశాఖపట్నం ను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆర్ధిక రాజధానిగా చంద్రబాబు మలచడం జరిగింది..

    - వైసిపి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం మూడు నెలలు కావస్తున్నా..... ఎక్కడ అభివృద్ధి నోచుకోలేదు..... ఒక్క పైసా అభివృద్ధి పై ఖర్చు చేయలేదు...

    - ముఖ్యమంత్రి కేవలం రాజధాని మార్పుపైని దృష్టి సారించారు. మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజావసరాలను విస్మరించారు.

    - ఈ రోజు కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న... వైరస్ నిరోధించే చర్యలు చేపట్టడంలో ను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కావలసిన సామాగ్రి ఏర్పాటు విషయంలోనూ.... క్వారెంటైన్ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన వియంలోను ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని....

    - ఈ చర్యలతో ప్రజారోగ్యంతో పాటు.... రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడుతుంది.

  • 8 Aug 2020 12:02 PM GMT

    అన్నవరం దేవస్థానంలో తాత్కాలికంగా భక్తుల దర్శనాలు నిలిపివేసిన అధికారులు..

    తూర్పుగోదావరి:

    - అన్నవరం దేవస్థానంలో తాత్కాలికంగా భక్తుల దర్శనాలు నిలిపివేసిన అధికారులు..

    - ఈ నెల 9 వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులను రావద్దని కోరిన అధికారులు,

    - దేవస్థానం ఉద్యోగులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 29 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ..

  • 8 Aug 2020 11:32 AM GMT

    రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన కేంద్ర జలశక్తి శాఖ మంత్ర గజేంద్ర సింగ్ షెకావత్

    - రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన కేంద్ర జలశక్తి శాఖ మంత్ర గజేంద్ర సింగ్ షెకావత్

    - 2016 సెప్టెంబర్లో ఒకసారి మినహా ఇప్పటివరకు మళ్లీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగలేదు

    - విభజన చట్టం సెక్షన్ 84(3) ప్రకారం అపెక్స్ కౌన్సిల్ గోదావరి, కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డులపై పర్యవేక్షణ అధికారాలు కలిగి ఉంది

    - అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశం చాలాకాలంగా పెండింగ్‌లో ఉండిపోయింది

    - 2018 ఫిబ్రవరి, 2020 జనవరిలో జలశక్తి శాఖ కార్యదర్శి నిర్వహించిన సమీక్షలో అనేక అపరిష్కృత అంశాలను గుర్తించారు

    - వాటిని పరిష్కరించడం కోసం అపెక్స్ కౌన్సిల్ 2019 సెప్టెంబర్లో ఎజెండా సిద్ధం చేయాలని రెండు రాష్ట్రాలను కోరింది

    - మే 2020లో జలశక్తి శాఖ మరోసారి రాష్ట్రాలకు గుర్తుచేస్తూ లేఖలు రాసింది. అయినా స్పందన లేదు

    - దాంతో గోదావరి, కృష్ణా బోర్డులు సూచించిన అంశాలతో జలశక్తి శాఖ అపెక్స్ కౌన్సిల్ ఎజెండా సిద్ధం చేసింది

    - 2020 మే 14న గోదావరి బోర్డుకు ఏపీ సర్కారు ఏడు తెలంగాణ ప్రాజెక్టులపై తీవ్ర అభ్యంతరాలు చెబుతూ లేఖ రాసింది

    - అభ్యంతరం చెప్పిన ప్రాజెక్టుల్లో కాళేశ్వరం, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్-3, సీతారామ లిఫ్ట్, తుపాకులగూడెం, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్, పెన్‌గంగాపై నిర్మించిన బ్యారేజులు రామప్ప - పాకాల సరస్సుల నీటి దారి మళ్లింపు ఉన్నాయి

    - జూన్ 2018లో కాళేశ్వరం లిఫ్ట్ డీపీఆర్‌ను జలశక్తి శాఖ అడ్వైజరీ కమిటీ అంగీకరించిన విషయం తెలిసిందే

    - అయితే ఎలాంటి అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం రోజుకు 2 టీఎంసీ నుంచి 3టీఎంసీ వరకు లిఫ్ట్ సామర్థ్యం పెంచింది

    - ప్రాజెక్టులో మార్పులు, సామర్థ్యం పెంపు వంటి వాటికి జలశక్తి శాఖ ఆమోదం ఉండాలి

    - ఏపీ సర్కారు అభ్యంతరం చెప్పిన ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవు

    - అందుకే అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందే వరకు ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లవద్దని తెలంగాణ ప్రభుత్వానికి గోదావరి బోర్డ్ 2020 మే 30న లేఖ ద్వారా తెలియపర్చింది

    - జూన్ 5న జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టులపై లోతుగా చర్చ జరిగింది. వాటి డీపీఆర్‌లను జూన్ 10లోగా అందజేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని గోదావరి బోర్డు ఆదేశించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు సమర్పించలేదు.

    - ఈ పరిస్థితుల్లో ఏపీ అభ్యంతరం తెలిపిన ప్రాజెక్టులపై డీపీఆర్‌లు సమర్పించకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందకుండా నిర్మాణం జరపవద్దని తెలంగాణ ప్రభుత్వానికి జలశక్తి శాఖ చెబుతోంది.

    - వీలైనంత త్వరగా అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశం జరపాలని కోరుకుంటున్నాను

    - లేఖలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

  • 8 Aug 2020 11:30 AM GMT

    మండపేట వైసిపి కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు కామెంట్స్..

    తూర్పు గోదావరి జిల్లా:

    మండపేట:  మండపేట లో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మండపేట వైసిపి కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు కామెంట్స్..

    - రాష్ట్రం లో 35, 30 సంవత్సరాలు వైఎస్ ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతాది.

    - అర్హులైన వారందరికి ఇళ్లు ఇస్తాo.

    - మీలో ఎవరికి కష్టం వచ్చినా నేనున్నాను.

    - ఆగష్టు15 వ తేదిన ఆర్హులైన వారందరికి సుమారు 28 వేల కోట్లతో అద్భుతమైన కార్యక్రమ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

    - 30 లక్షల ఇళ్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్నారు

  • 8 Aug 2020 11:28 AM GMT

    కరోనా పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులను చులకనగా చూస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది..

    తూర్పుగోదావరి:

    - కరోనా పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులను చులకనగా చూస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది..

    - హోం క్వారంటైన్ లో ఉన్న జర్నలిస్టు గురించి పట్టించుకోని క్షేత్రస్థాయి సిబ్బంది..

    - హోం క్వారంటైన్ కిట్ సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది..

    - బాధితుడికి హోం క్వారంటైన్ కిట్ సరఫరా చేయమని అడిగిన తోటి జర్నలిస్టులను దుర్భాషలాడుతున్న వేట్లపాలెం పిహెచ్సీ వైద్యాధికారిణి ధనలక్ష్మీ..

    - నాలుగు మందు బిల్లలు ఆ దరిద్రుల ముఖాన్ని కొట్టండంటూ క్రింది స్థాయి సిబ్బంది కి ఆదేశం..

    - సోషల్ మీడియా లో వైరల్ గా మారిన వైద్యాధికారి ఫోన్ రికార్డింగ్..

  • 8 Aug 2020 11:26 AM GMT

    విశాఖ ఫిష్షింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం

    విశాఖ:

    - చేపల బోటు ఇంజన్ లో చెలరేగిన మంటలు

    - ప్రమాదం జరగ్గానే అప్రమత్తమైన మత్స్యకారులు

    - పోర్టు ట్రస్ట్ కు సమాచారం ఇచ్చిన మత్స్యకారులు

    - మంటల్ని ఆర్పేందుకు పోర్టు సిబ్బందిని పంపిన అధికారులు

    - మత్స్యకారులను రక్షించిన స్థానిక యువకులు

  • 8 Aug 2020 11:25 AM GMT

    ఏలూరు కలక్టరేట్ లో ముగిసిన జిల్లా కరోనా టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం..

    ప.గో..

    - ఏలూరు కలక్టరేట్ లో ముగిసిన జిల్లా కరోనా టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం..

    - వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కామెంట్స్..

    - కోవిడ్ హాస్పిటల్స్ లో 11, 200మంది సిబ్బందిని వైద్యం అందించడానికి నియమిస్తున్నాం...

    - కరోనా మరణాలు తగ్గించడానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాం...

    - జ్వరం వచ్చి.. శ్వాసకోస సమస్యలతో బాధ పడితే...

    - టెస్ట్ ల తో సంబంధం లేకుండా వెంటనే వైద్యం కోసం హాస్పిటల్స్ జాయిన్ చేసుకోవాలి..

    - రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు నిర్వహణలో ఇతర రాష్ట్రాల కంటే అగ్ర స్థానంలో ఉన్నాం...

    - కోవిడ్ హాస్పిటల్స్ భోజనం... పారిశుద్యం..మందులు.. సరఫరా ఎలా ఉన్నాయో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం...

    - వైద్యం కోసం ఎక్కడికి వెళ్ళాలి.. అనే అంశంపై ANM లకు మార్గనిర్దేశం చేయాలని అధికారులకు అదేశం...

    - దేశంలో ఎక్కడ లేని విధంగా రోజుకి 50వేల టెస్ట్ లు చేస్తున్నాం...

    - జిల్లాలో త్వరలో ఆక్సిజన్ లైన్ బెడ్స్ అధిక సంఖ్యలో పెంచడానికి చర్యలు చేపట్టాం..

    - ప్రతి ఆదివారం జిల్లాలో పూర్తి లాక్ డౌన్ ఏర్పాటు చేసాం..

    - జిల్లాలో కరోనా కేసులు 75 శాతం రికవరీ అవుతున్నా యి..

    - జిల్లా లోని కోవిడ్ హిస్పిటల్స్ లో 10వేల 600బెడ్స్ అందుబాటులో ఉన్నాయి..

    - జిల్లాకు 19కోట్లు రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది..

    - 14కోట్లు 40లక్షలు రూపాయలు ఖర్చు చేయడం జరిగింది..

  • 8 Aug 2020 11:24 AM GMT

    అమరావతి:

    - నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 1100 కోట్లను ఖర్చు చేసేందుకు పాలనానుమతి మంజూరు

    - వైఎస్ఆర్ గృహవసతి పథకంలో భాగంగా వెయ్యి కోట్లు, 13 జిల్లాల్లోనూ నిర్వహణా ఖర్చుల కింద మరో వంద కోట్లను ఖర్చు చేయనున్న ప్రభుత్వం

  • 8 Aug 2020 10:41 AM GMT

    చిత్తూరు జిల్లా , చంద్రగిరి మండలం :

    - మండలంలోని కల్యాణి డ్యాం లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సుమారు 100 మంది శిక్షణార్థులకు కరోనా పాజిటివ్.

    - శానిటేషన్,పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేసిన ఏ.రంగంపేట పంచాయతీ అధికారులు.

    - ప్రస్తుతం 380 మంది శిక్షణ పొందుతున్న పోలీసులు.

    - శిక్షణా కళాశాలను మూసివేసే దిశగా చర్యలు చేపడుతున్న అధికారులు.

  • 8 Aug 2020 9:58 AM GMT

    అనంతపురం:

    - నార్పల లో కొత్త బస్టాండ్ వద్ద బోలోరో వాహనం ఢీకొని వెంకట్(35)అనే వ్యక్తి మృతి.

    - మరో వ్యక్తికి గాయాలు ఆసుపత్రికి తరలింపు.

Print Article
Next Story
More Stories