Live Updates:ఈరోజు (ఆగస్ట్-07) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 07ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చవితి (రాత్రి 12-17 వరకు) తదుపరి పంచమి; పూర్వాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి ఉ. 6-06 వరకు), వర్జ్యం (రా. 11-37 నుంచి 1-22 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-16 నుంచి 9-07 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 7 Aug 2020 11:25 AM GMT

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మీ బ్యారేజ్

    - జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    - లక్ష్మీ బ్యారేజ్

    - 30 గేట్లు ఎత్తిన అధికారులు

    - పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 98.70 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 12.230 టీఎంసీ

    - ఇన్ ఫ్లో 63000 క్యూసెక్కులు

    - ఓట్ ఫ్లో 39900 క్యూసెక్కులు

  • 7 Aug 2020 11:24 AM GMT

    జిల్లాలో విషాదం.. నీటి తొట్టిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

    జగిత్యాల :

    - జిల్లాలో విషాదం

    - నీటి తొట్టిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

    - మేడిపల్లి మం. కేంద్రంలో సెప్టిక్ ట్యాంక్ కోసం నిర్మించిన నీటి తొట్టి లో పడి దుబ్బేటి రుతిక (7), వోల్పుల అశ్వంత్ (5) మృతి

    - ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడిన చిన్నారులు

    - ప్రాణాపాయ స్థితిలో జగిత్యాల ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చిన్నారులు మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యుడు.

    - రాఖీ పండగ కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చి ప్రమాదంలో మృతి చెందిన రుతిక

  • 7 Aug 2020 11:23 AM GMT

    నిజామాబాద్ :

    నగరంలోని డబ్బా ప్రాంతంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టర్ భవనాన్ని పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పి చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, ఎమ్మెల్సీ ఆకుల లలిత, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి.

  • 7 Aug 2020 11:22 AM GMT

    హైకోర్టులో కాంగ్రెస్ నేతల పిటిషన్

    - సచివాలయం కూల్చివేతల పనుల పరిశీలనకు అనుమతివ్వాలని హైకోర్టులో కాంగ్రెస్ నేతల పిటిషన్

    - పిల్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వరరెడ్డి

    - అత్యవసర వ్యాజ్యంగా పరిగణించి ఇవాళ విచారణ జరపాలని కోరిన న్యాయవాది

    - అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు నిరాకరించిన హైకోర్టు

    - గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోందన్న పిటిషనర్ల న్యాయవాది

    - నిరాధార, ఊహాజనిత అంశాలను పరిగణనలోకి తీసుకోలేమన్న హైకోర్టు

  • 7 Aug 2020 11:19 AM GMT

    భగవంతుడు ఇచ్చిన సంజీవని ప్లాస్మా ను దానం చేయండి, ప్రాణాలు కాపాడండి

    - ఒకసారి కోవిడ్ వచ్చిన తరువాత రెండో సారి రావడం అనేది చాలా తక్కువ అని డాక్టర్స్ చెపుతున్నారు

    - కోవిడ్ వచ్చిందని ఎంతో మంది భయం తో ఆత్మహత్య చేసుకుంటున్నారు

    - అలాంటి వారి కి మనం అవగాహన చేయాల్సిన అవసరం ఉంది

    - మా ఇంట్లో , నా దగ్గర పని చేసే వర్కర్స్ కి నలుగురికి కరోనా సోకింది

    - వంట మనిషి సీను, స్విమ్మింగ్ లక్ష్మణ్ తో పాటు మరో ఇద్దరికి వచ్చింది

    - ఇప్పుడు వారందరు కోవిడ్ నుండి కోలుకుని మరి ఇంట్లో వర్క్ చేస్తున్నారు

  • 7 Aug 2020 11:19 AM GMT

    సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శరణ్య 25 బెంగళూరులో ఇంట్లో అనుమానాస్పద మృతి

    - కామారెడ్డికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శరణ్య 25 బెంగళూరులో ఇంట్లో అనుమానాస్పద మృతి

    - కామారెడ్డి నుంచి హుటాహుటిన బెంగుళూరుకు బయలుదేరిన పేరెంట్స్

    - భర్త రోహిత్ చంపి ఉంటాడని లేదా

    - వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని తల్లిదండ్రుల అనుమానం

    - ఏడాది కిందటే ప్రేమ పెళ్లి చేసుకున్న శరణ్య రోహిత్..

    - ఇద్దరిదీ కామారెడ్డి, పైగా క్లాస్ మేట్స్

    - పెళ్ళైన కొన్నాళ్ల నుంచే రోహిత్ నిత్యం మద్యం సేవిస్తూ కొట్టడం వేధించడం చేశాడని పేరెంట్స్ ఆరోపణలు

  • 7 Aug 2020 11:18 AM GMT

    నిజామాబాద్:

    - సివిల్ సప్లై హమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏ ఐ టి యు సి ఆద్వర్యం లో కలెక్టరేట్ వద్ద ధర్నా..

    - వేతన సవరణ ముగిసి ఏడాది గడిసినా పట్టించుకోవడం లేదని ఆందోళన

    - ఈ నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె కు పిలుపు

  • 7 Aug 2020 11:17 AM GMT

    నాగర్ కర్నూల్ జిల్లా:

    కలెక్టరేట్ లో రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో సమావేశమైన జాతీయ బిసి కమిషన్ సభ్యులు ఆచారి.. కలెక్టర్ శర్మన్.

  • 7 Aug 2020 11:16 AM GMT

    వనపర్తి జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి...

    వనపర్తి జిల్లా:

    - వనపర్తి జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి...

    - కలెక్టరేట్ లో వివిధ ప్రభుత్వ పథకాలపై సమీక్ష చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి..హాజరైన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా..ఇతర అధికారులు.


  • 7 Aug 2020 11:14 AM GMT

    కోవిడ్ పరిస్థితుల్లో సైబరాబాద్ పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం

    మెగాస్టార్ చిరంజీవి:

    - రక్త దానం నుండి ఫ్లాస్మా దానం వరకు సైబరాబాద్ పోలుసులు చేస్తున్న సేవను గుర్తించుకోవాలి

    - ఇలాంటి మంచి మార్గం లో నన్ను నడిపిస్తున్నందుకు సీపీ సజ్జనార్ కి ధన్యవాదాలు

    - 22 ఏళ్ల క్రితం నాకు సామాజిక బాధ్యత తెలియని సమయంలో

    - ఓ న్యూస్ పేపర్ లో ఒక వార్తా చూసి చలించి పోయాను

    - ఆక్సిడెంట్ లో ఎంతో మంది మృతి చెందడం , రక్తం దొరక మృతి చెందుతున్నారు అని గమనించి

    - నేను బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని భావించి ఏర్పాటు చేశాము

    - దీనికి అభిమానులు సహకరిస్తూ , నిత్యం బ్లడ్ దానం చేస్తూ ముందుకు సాగుతున్నాం

    - మాకు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు ఇచ్చింది

    - ఈ కోవిడ్ పరిస్థితిల్లో ఇప్పుడు అసలైన ఆయుధం ఫ్లాస్మా

    - ఈ ఫ్లాస్మా దానం చేయడం తో మరో ప్రాణాన్ని కాపాడిన వారు అవుతాము

    - రెండు రోజులు క్రితమే మా సమీప బందువుకు కోవిడ్ సోకి చాలా సీరియస్ అయ్యింది

    - వెంటనే నాకు తెలిసిన స్వామి నాయుడు అనే వ్యక్తి ని ఫ్లాస్మా దానం చేయమని చెప్పాను

    - అతను దానం చేయడం తోనే మా బందువు ప్రాణాలతో బయట పడ్డాడు

    - ఈ ఫ్లాస్మా దానం పై ఎవరు అపోహలకు పోవద్దు

    - మీరు ఫ్లాస్మా దానం చేయడం ద్వారా ఎలాంటి బ్లడ్ లాస్ జరగదు

Print Article
Next Story
More Stories