Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 06 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం తదియ(రాత్రి 12-15 వరకు) తదుపరి చవితి; శతభిష నక్షత్రం (ఉ.11-18 వరకు) తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 6-18 నుంచి 8-03 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 01-30 నుంచి 03-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 6 Aug 2020 8:25 AM GMT

    బీజేపీ మీడియా స్టేట్మెంట్: కె .కృష్ణసాగర రావు.

    - కె .కృష్ణసాగర రావు..బీజేపీ

    - ముఖ్య అధికార ప్రతినిధి.

    - సీఎం కేసీఆర్ ఏక ఛత్రాధిపత్యాన్ని బీజేపీ ఖండిస్తుంది.

    - రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతిపక్ష పార్టీల శాసన సభాపక్షనేతలను కానీ ఆయా పార్టీల అధ్యక్షులను కానీ పరిగణనలోకి తీసుకోకపోవడం పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.

    - ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కనీసం ప్రతిపక్షాలను కూడా సంప్రదించకుండా సచివాలయ కొత్త భవనాలను ఆమోదించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది.

    - రాష్ట్రంపై,ప్రజలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో ప్రతిపక్షాలను కూడా పరిగణలోకి తీసుకోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయం.

    - ప్రతిపక్ష పార్టీలను బాగస్వామ్యులను చేయడం వల్ల ప్రజల గొంతుక వినిపిస్తుంది.విస్తృతమైన సలహాలు వస్తాయి.

    - కొత్త సచివాలయ భవనం డిజైన్ నిజాం కాలం నాటి కట్టడాలను,నిజాం కాలం నాటి నిర్మాణ శైలిని సూచిస్తోంది.

    - ఇది ప్రభుత్వ పరిపాలన భవనంలా కాకుండా ఒక మసీదులా కనిపిస్తోంది.

    - ఒక విదేశీ నియంత నిజాం కట్టిన ఐదు వందల ఏళ్ల క్రితం కట్టిన పాతకాలపు భవన్ నిర్మాణ శైలి కట్టడాలను ఇప్పుడు ఆధునిక సచివాలయ భవనానికి సీఎం కేసీఆర్ ఎందుకు ఎంచుకున్నారో ప్రజలకు సీఎం కేసీఆర్ వివరించాలి.

    - ప్రస్తుతం బ్రహ్మాండంగా పని చేస్తున్న సచివాలయ భవనాన్ని కూలగొట్టి నాలుగు వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ కొత్త సచివాలయ భవనాన్ని కడుతున్న కేసీఆర్ అందులో తన రాజకీయ వారసత్వాన్ని నిలువుకునేలాగా ,ముస్లింల ఓట్ల కోసం దీనిని ఉపయోగించుకుంటున్నారు.

    - ప్రభుత్వ పరిపాలన భవనాలు ప్రభుత్వ పనితీరుకు తగ్గట్టుగా ఆధునిక హంగులతో ఉండాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర సచివాలయము ప్రస్తుత తరాన్ని , ప్రస్తుత భారతీయ నిర్మాణ శైలిని అలాగే భారత దేశంలో విలీనమైన స్వతంత్ర తెలంగాణ ఆకాంక్ష లకు చిహ్నంగా ఉండాలి. అంతే కానీ అది విదేశీ నియంత నిజాం నిరంకుశ పాలనను ప్రతిభింబించేలా ఉండకూడదు.

    - ప్రస్తుతం సీఎం కేసీఆర్ ,కేబినెట్ ఆమోదించిన కొత్త సచివాలయం భవన నమూనాను బీజేపీ తిరస్కరిస్తుంది. దీనిపై తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ,అఖిలపక్ష సలహాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రత్యామ్నాయ భవన నమూనా పై అఖిలపక్ష సలహాలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.

  • 6 Aug 2020 8:21 AM GMT

    మంచిర్యాల జిల్లా:

    నస్పూర్ మున్సిపల్ కో అప్షన్ సభ్యులుగా టీఆరెస్ కు చెందిన ముత్తె రాజేశం,భాగ్యలక్ష్మి, నాసర్, హజూర్నిశ బేగం ఏకగ్రీవంగా ఎన్నిక

  • 6 Aug 2020 8:20 AM GMT

    గాంధీ భవన్ ఎదుట ఉల్లి గడ్డ లోడ్ తో వెళ్తున్న మిని డీసీమ్ బోల్తా..

    నాంపల్లి:

    - గాంధీ భవన్ ఎదుట ఉల్లి గడ్డ లోడ్ తో వెళ్తున్న మిని డీసీమ్ బోల్తా..

    - నేలమట్టం అయిన ఉల్లి గడ్డల వాహన..

    - భారీగా ట్రాఫిక్ జామ్..

    - ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు..

    - వాహనాన్ని పక్కకు జరిపి పోలీసులు..

    - అధిక బరువు లోడ్ తో వెళ్లడం

    - డ్రైవర్ ఒక్క సారిగా కుడి వైపు తిప్పడం బొలతా పడ్డ వాహనం..

  • 6 Aug 2020 8:18 AM GMT

    సిద్దిపేట :

    ఎమ్మెల్యే రామలింగారెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సిద్దిపేట జెడ్పి చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్.

  • 6 Aug 2020 8:16 AM GMT

    ప‌్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్, సిద్ధాంత క‌ర్త‌గా తెలంగాణ ప్రజల గుండెల్లో వేసిన ముద్ర చెరగనిది: మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

    వరంగల్:

    - ఆచార్య జయశంకర్ జయంతి సంద‌ర్భంగా సార్‌కు ఘన నివాళుర్పించిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

    - మంత్రి ఎర్ర‌బెల్లి కామెంట్స్

    - ప‌్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్, సిద్ధాంత క‌ర్త‌గా తెలంగాణ ప్రజల గుండెల్లో వేసిన ముద్ర చెరగనిది.

    - ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో ఆయ‌న చేసిన సూచ‌న‌లు, స‌ల‌హాలు భ‌విష్య‌త్ త‌ర‌కాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు

    - జ‌యశంకర్ సార్ ఆజ‌న్మాంతం బ్ర‌హ్మ‌చారిగా, తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా జీవించారు.

    - యావజ్జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోశారు.

    - జ‌య‌శంక‌ర్ సార్ ఆశ‌యాల‌నే ఆదేశిక సూత్రాలుగా, సీఎం కెసిఆర్ తెలంగాణ‌ను బంగారు తెలంగాణ‌గా తీర్చిదిద్దుతున్నారు.

    - తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో అగ్ర‌భాగాన నిల‌వ‌డానికి సిఎం కెసిఆర్ గారికే స్ఫూర్తిగా జ‌య‌శంక‌ర్ గారు నిలిచారు.

    - ఆచార్య జ‌య‌శంక‌ర్ సార్ తో నాకున్న అనుబంధం కొన్ని ద‌శాబ్దాల నాటిది

    - జ‌య‌శంక‌ర్ సార్, న‌డుస్తున్న తెలంగాణ చారిత్ర‌క గ్రంథంగా ఉండే వారు

    - జ‌య‌శంక‌ర్ సార్ జీవితం యువ‌త‌కు ఆద‌ర్శం, స్ఫూర్తి దాయ‌కం

  • 6 Aug 2020 8:15 AM GMT

    సిద్దిపేట :

    ఎమ్మెల్యే రామలింగారెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

  • 6 Aug 2020 8:14 AM GMT

    వేములవాడ పట్టణంలో విజృంభిస్తున్న కరోనా

    రాజన్నసిరిసిల్ల జిల్లా:

    - బిజెపి రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ

    - తనకు వైరస్ నిర్ధారణ అయినట్లు ఫేస్ బుక్ ద్వారా వెల్లడించిన రామకృష్ణ

    - వైద్యుల సూచన మేరకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడి

    - తనతో సన్నిహితంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచన

  • 6 Aug 2020 8:13 AM GMT

    చాడా వెంకట్ రెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

    - ముఖ్యమంత్రి మేలుకో.. ప్రజలను కాపాడు" నినాదంతో రేపు ప్రగతి భవన్ వద్ద నిరసన తెలపుతాం

    - కోవిడ్ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది

    - నిరసన కార్యక్రమంలో కమ్యూనిస్టులు, టీజేఎస్, టీటీడీపీ, ప్రజా సంఘాలు పాల్గొంటాయి

    - ఎల్.రమణ టిటిడిపి అధ్యక్షుడు

    -  ప్రభుత్వాన్ని మేల్కపటానికే ప్రగతి భవన్ వద్ద నిరసన తెలపాలని నిర్ణయించాం

    - కరోనా నియంత్రణపై క్యాబినెట్ లో చర్చించకపోవటం బాధాకరం

    - ప్రజా సమ్యలపై వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి

    - ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలు నమ్మకం కోల్పోయారు

    - కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

    - ప్రొ.కోదండరాం

    - జనసమితి అధ్యక్షుడు

    - ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రేపు ఉదయం 11గంటలకు ప్రగతి భవన్ వద్ద నిరసన తెలుపుతాం

    - 9గంటల క్యాబినెట్ సమావేశంలో కరోనా గురించి చర్చించకపోవటం బాధాకరం

    - పేదలకు ఆరు నెలల పాటు ఉచిత రేషన్ అందించాలి

    - కరోనా సమయంలో మంత్రుల పుట్టినరోజు వేడుకులకు అనుమతి ఇవ్వటం దౌర్భాగ్యం

    - పనులు లేక పేదలు, వివిధ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు

  • 6 Aug 2020 8:11 AM GMT

    ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలు వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్

    - 4 శాతం వద్దే రెపో రేటు, రివర్స్‌ రెపో 3.35 శాతంగా కొనసాగింపు.

    - రిజర్వ్‌ బ్యాంక్ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయం.

    - ఆర్థిక వ్యవస్థకు కోవిడ్‌-19 విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో ఎంపీసీ ఇందుకు ఏకగ్రీవ ఆమోదాన్ని తెలిపినట్లు సమాచారం.

    - అవసరమైతే తగిన సందర్భంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడి.

  • 6 Aug 2020 8:09 AM GMT

    జాతీయం:

    యధాతధంగా కీలక వడ్డీ రేట్లు: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్

Print Article
Next Story
More Stories