Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 06 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం తదియ(రాత్రి 12-15 వరకు) తదుపరి చవితి; శతభిష నక్షత్రం (ఉ.11-18 వరకు) తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 6-18 నుంచి 8-03 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 01-30 నుంచి 03-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 6 Aug 2020 8:39 AM GMT

    అమరావతి:

    - ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

    - విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరు

  • 6 Aug 2020 8:39 AM GMT

    జంగాలదరువు గ్రామంలో రెండు అలయాల్లో హుండీలు చోరీ..

    నెల్లూరు:

    - సంగం (మం) జంగాలదరువు గ్రామంలో రెండు అలయాల్లో హుండీలు చోరీ.

    - పూజారి,కాపలా సిబ్బంది ని లోపల బంధించి హుండీ చోరీ చేసిన దుండగులు.

    - గ్రామస్థుల ఫిర్యాదు తో దర్యాప్తు చేపట్టిన ఎస్సై శ్రీకాంత్.

  • 6 Aug 2020 8:37 AM GMT

    అమరావతిని అభివృద్ధి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాం..

    - శివ రామకృష్ణ కమిటీ వేశారు, ఆ నివేదిక పరిగణనలోకి తీసుకోవాలని చెప్పాం.

    - విశాఖ ప్రజలు అంతా ఈ ప్రాంత అభివృద్ధి కోరుకుంటున్నారు.

    - ఉత్తరాంధ్ర ప్రజలు అక్కర్లేదా అనే ధోరణి కనిపిస్తోంది.

    - రాష్ట్రం అంటే అమరావతి, ఆ 29 గ్రామలేనా.

    - మూడు రోజులు నుంచి సహనంతో పరిశీలిస్తున్నాము

    - గడిచిన 5 సంవత్సరాలలో చంద్రబాబు తీసుకున్న విధానాలు,నిర్ణయాలు వల్ల రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది.

    - రాష్ట్ర విభజన సమయం చంద్రబాబు ఇచ్చిన లేఖ ఫలితం అందరికి తెలుసు.

    - మా పార్టీ నినాదం వికేంద్రీకరణ.

    - 13 జిల్లా లు అభివృద్ధి మా ప్రభుత్వ నినాదం.

    - ప్రతిపక్షం పదవులను త్యాగం చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళండి.

    - కేంద్ర హోమ్ శాఖ రాజధాని అంశం మా పరిధిలో లేదని స్పష్టం చేసింది.

    - రాష్ట్ర ప్రభుత్వం జులై 21 మూడు రాజధానులు పై అధికారిక గెజిట్ కూడా విడుదల చేసింది.

  • 6 Aug 2020 8:24 AM GMT

    Hmtv తో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి

    అమరావతి:

    - దోచుకోవటనికి అడ్డాగా అమరావతిని మార్చేశారు

    - రాజధాని అమరావతి లో పెట్టి గుంటూరు,కృష్ణ జిల్లా రైతులకు చంద్రబాబు అన్యాయం చేసారు.

    - పొలిటికల్ exit కోసం చంద్రబాబు హైద్రాబాద్ లో ఉండి దారులు వెతుకుంటున్నారు

    - అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలి అన్ని లక్ష్యం తోనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నాం

    - పవన్ రెండు చోట్ల ఓడిపోయి సిగ్గు లేకుండా form హౌస్ లో ఉండి మమ్మల్ని రాజీనామా చేయమనడం సిగ్గు చేటు..

    - రాజధాని విషయంలో మరోసారి కేంద్రం స్పష్టంగా చెప్పింది ఇప్పటికైనా చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలి..

    - 3 రాజధానులు ప్రజా వ్యతిరేకిస్తున్నారు అన్ని చంద్రబాబు అంటున్నారు ...గతం లో ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు కేసీఆర్, జగన్ ప్రజల్లోకి వెళ్లి గెలిచి వచ్చారు..

    - చంద్రబాబుకు రాజీనామా చేసే దమ్ము, ధైర్యం లేక మాకు డెడ్ లైన్ విధిస్తున్నారు..

  • 6 Aug 2020 8:23 AM GMT

    కర్నూల్:

    - ఎంఎల్సీ రవీంద్ర బాబు వాఖ్యలపై మండి పడ్డ టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.

    - ఎంఎల్సీ రవీంద్ర బాబు పై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సోమిశెట్టి..

    - జగన్ వెంట్రుక కూడా ఎవరూ పీక్కో లేరు అంటూ ఎంఎల్సీ రవీంద్ర న్యాయ వ్యవస్థనే కించ పరిచాడు...

    - న్యాయవ్యవస్థ,జడ్జీ లను అసభ్య కరంగా మాట్లాడిన ఎంఎల్సీ రవీంద్ర పై చర్యలు తీసుకోవాలి.

    - గవర్నర్ వెంటనే స్పందించి రవీంద్ర ను ఎంఎల్సీ పదవి నుంచి తొలగించాలి..

  • 6 Aug 2020 8:22 AM GMT

    తూర్పు గోదావరి జిల్లా:

    అమలాపురం పట్టణానికి చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు కరోనా తో మృతి

    కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

  • 6 Aug 2020 8:19 AM GMT

    కాకినాడ జీజీహెచ్ లో ఈ నెల 10 వ తేదీ వరకు ఓపి సేవలు పొడిగింపు..

    తూర్పుగోదావరి:

    -  కాకినాడ జీజీహెచ్ లో ఈ నెల 10 వ తేదీ వరకు ఓపి సేవలు పొడిగింపు..

    - కొవిడ్‌ హాస్పిటల్ గా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో నేటి నుంచి అన్ని సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన వైద్యాధికారులు..

    - దూర ప్రాంతాల నుంచి రోగుల కోసం మరో నాలుగు రోజులు ఈనెల ఓపీ సేవలు కొనసాగించాలని ఆదేశించిన కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి..

  • 6 Aug 2020 8:17 AM GMT

    మంత్రి బొత్స సత్య నారాయణ కామెంట్స్

    విశాఖ:

    - మూడు రోజులు నుంచి చంద్రబాబు వీధి నాటకం ఆడుతున్నారు.

    - చంద్రబాబు సమాజం కోసం కాకుండా , సామాజిక వర్గం కోసం ఆలోచిస్తున్నారు.

    - చంద్రబాబు కొత్త పద్ధతులు మొదలు పెట్టారు.

    - శాసన సభలో వెనక ,ముందు కట్ చేసి వారికి అనుకూలంగా ఉన్న మాటలను చూపిస్తున్నారు.

    - దేశ రాజకీయాలలో కూడా ద్వంద వైఖరి అవలభించారని జాతీయ పార్టీ నాయకులే చెప్తున్నారు.

  • 6 Aug 2020 8:11 AM GMT

    ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలు వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్

    - 4 శాతం వద్దే రెపో రేటు, రివర్స్‌ రెపో 3.35 శాతంగా కొనసాగింపు.

    - రిజర్వ్‌ బ్యాంక్ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయం.

    - ఆర్థిక వ్యవస్థకు కోవిడ్‌-19 విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో ఎంపీసీ ఇందుకు ఏకగ్రీవ ఆమోదాన్ని తెలిపినట్లు సమాచారం.

    - అవసరమైతే తగిన సందర్భంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడి.

  • 6 Aug 2020 8:10 AM GMT

    జాతీయం:

    యధాతధంగా కీలక వడ్డీ రేట్లు : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్

Print Article
Next Story
More Stories