Live Updates:ఈరోజు (ఆగస్ట్-05) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 05ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం విదియ(రాత్రి 9-34 వరకు) తదుపరి తదియ; ధనిష్ఠ నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి శతభిష నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 5-04 నుంచి 6-47 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-౨౯

జగదానంద కారకుడికి మందిర నిర్మాణం. ఎన్నో ఏళ్ల కల.. ఆ కల సాకారానికి తొలిఅడుగు మరి కొద్దిగంటల్లో పడనుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఆ వేడుకకు సంబంధించి ఎప్పటికప్పుడు లైవ్ అప్ డేట్స్!

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • ములుగులో   గంజాయి స్వాధీనం
    5 Aug 2020 9:45 AM GMT

    ములుగులో గంజాయి స్వాధీనం

    ములుగు జిల్లా: ములుగు పట్టణ శివారు ఎర్రి గట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా కారులో తరలిస్తున్న 2 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్న ములుగు సిఐ దేవేందర్ రెడ్డి.

  • మొబైల్ షాపులో చోరీ..
    5 Aug 2020 8:19 AM GMT

    మొబైల్ షాపులో చోరీ..

    రాచకొండ కమిషనరేట్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న మొబైల్ షాపులో చోరీ...

    దుకాణానికి కన్నం వేసి సెల్ ఫోన్ లు చోరీ చేసిన దుండగులు..

    యజమాని ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

  • బండి సంజయ్ ప్రత్యేక పూజలు
    5 Aug 2020 8:16 AM GMT

    బండి సంజయ్ ప్రత్యేక పూజలు

    కరీంనగర్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షడి ప్రత్యేక పూజలు ...

    అయోధ్య లో రామాలయ నిర్మాణానికి భూమి పూజ సందర్బంగా కరీంనగర్ లో పూజలు చేసిన బండి సంజయ్

    కుటుంబ సమేతంగా కరీంనగర్ లోని తన ఇంట్లో పూజలు చేసిన సంజయ్

  • 5 Aug 2020 8:14 AM GMT

    జగిత్యాల : జగిత్యాల లో బిజెపి అద్వర్యం లో పూజలు

    - ధరూర్ లోని కోదండరామాలయం లో పూజలు నిర్వహించిన బిజెపి కార్యకర్తలు

  • అపెక్స్ కౌన్సిల్  సమావేశం వాయిదా
    5 Aug 2020 8:12 AM GMT

    అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా

    - నేడు జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు వాయిదా వేసినట్లు ప్రకటించిన కేంద్ర జలవనరుల శాఖ

    - అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు నిర్వహించబోయోది ఇరు రాష్టాలకు సమాచారం ఇస్తామన్న జలవనరుల శాఖ

  • భద్రాచలంలో ప్రత్యేక పూజలు
    5 Aug 2020 8:07 AM GMT

    భద్రాచలంలో ప్రత్యేక పూజలు

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:  నేడు అయోధ్య లో శ్రీరామ మందిర నిర్మాణానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ శంఖుస్థాపన చేస్తున్న నేపథ్యంలో నేడు దక్షిణ అయోధ్య భద్రాద్రి రామాలయంలో శ్రీ రామాయణ హవనం,

    శ్రీరామావతారకోపనిషత్తు,అష్టావింశతి వార ఆవృత్తి,సువర్ణ పుష్పాఅర్చన నిర్వహించిన అర్చకులు


  • రైతు వేదిక భవన శంకుస్థాపన
    5 Aug 2020 8:02 AM GMT

    రైతు వేదిక భవన శంకుస్థాపన

    ఖమ్మం: బోనకల్ మండలం రాయన్నపేట గ్రామంలో రైతు వేదిక భవనానికి శంకుస్థాపన చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు.

  • రైతు వేదిక‌కు శంఖుస్థాప‌న చేసిన ఎమ్మేల్యే సండ్రా
    5 Aug 2020 8:00 AM GMT

    రైతు వేదిక‌కు శంఖుస్థాప‌న చేసిన ఎమ్మేల్యే సండ్రా

    ఖమ్మం జిల్లా: సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన యం.ఎల్.ఏ సండ్ర వెంకటవీరయ్య

  • కామారెడ్డిలో స్వచ్చంద లాక్ డౌన్
    5 Aug 2020 7:55 AM GMT

    కామారెడ్డిలో స్వచ్చంద లాక్ డౌన్

    కామారెడ్డి : జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న స్వచ్చంద లాక్ డౌన్

    నేటి నుంచి 10 రోజుల పాటు పూర్తి స్తాయి లాక్ డౌన్ అమలు

    ఉదయం నుంచి తెరుచుకొని దుకాణాలు.. నిర్మానుష్యంగా మారిన జిల్లా కేంద్రం

    కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో స్వచ్చంద లాక్ డౌన్ నిర్ణయం

  • 5 Aug 2020 6:07 AM GMT

    కుమరంభీమ్ జిల్లా : కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్

    హోంగార్డ్ కు కరోనా పాజిటివ్

    హైదారాబాద్ లో అసుపత్రి లో చికిత్స పొందుతూ మ్రుతి

Print Article
Next Story
More Stories