Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 03 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ రా.12-36 తదుపరి చవితి | రోహిణి నక్షత్రం రా.12-55 తదుపరి మృగశిర | వర్జ్యం సా.4-13 నుంచి 5-57 వరకు | అమృత ఘడియలు రా.9-26 నుంచి 11-10 వరకు | దుర్ముహూర్తం ఉ.8-19 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-28 నుంచి 11-19 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-౨౬


ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Dubbaka Updates: ఉప ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తెరాస కార్యకర్తలు..
    3 Nov 2020 12:21 PM GMT

    Dubbaka Updates: ఉప ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తెరాస కార్యకర్తలు..

    సిద్దిపేట జిల్లా :

    -దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా రాయపోల్ మండలం ఆరెపల్లిలో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తెరాస కార్యకర్తలు

    -దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు

    -పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొచ్చుకెళ్లే యత్నం చేసారు

    -కాంగ్రెస్,తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చెదర గొట్టిన పోలీసులు.

  • Karimnagar Updates: రైతు వ్యతిరేక బిల్లుకు నిరసనగా పొన్నం ప్రభాకర్ కామెంట్స్..
    3 Nov 2020 12:09 PM GMT

    Karimnagar Updates: రైతు వ్యతిరేక బిల్లుకు నిరసనగా పొన్నం ప్రభాకర్ కామెంట్స్..

    కరీంనగర్ జిల్లా:

    -చొప్పదండి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లుకు నిరసనగా రైతుల నుండి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్   ఆధ్వర్యంలో సంతకాల సేకరణ...

    -రుక్మాపూర్ నుండి చొప్పదండి కేంద్రం వరకు ట్రాక్టర్లు, బైక్ లతో ర్యాలీ నిర్వహించిన కాంగ్రేస్ శ్రేణులు...

    పొన్నం కామెంట్స్...

    - ఎయిర్ ఫోర్ట్స్, ఎల్ఐసి, బిపిసిఎల్ లను కేంద్ర ప్రభుత్వం ప్రవేట్ పరం చేసింది...

     -రైతు వ్యతిరేక బిల్లు వల్ల వ్యవసాయం రంగం కూడా ప్రవేట్ పరం అవుతుంది...

     -రైతులను ఓనర్ గా మాత్రమే ఉంచాలనే కుట్ర ను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది...

     -దేశంలో 25 పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి...

     -పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లో బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడుస్తున్నాయి...

     -పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లో రైతులు కేవలం మార్కెట్ లో మాత్రమే పండించిన పంటలు అమ్మకం చేస్తారు...

     -కేంద్రం చేస్తున్న మోసాన్ని కరపత్రాల ద్వారా రైతులకు తెలియజేస్తున్నాం...

     -పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన బిల్లును మూజువాణి పద్ధతిలో పాస్ చేయించింది...

     -సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక బిల్లుకు నేను ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నా అంటున్న అని డ్రామాలు ఆడుతున్నాడు...

     -ఈరోజు నుండి కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బిల్లుకు వ్యతిరేకంగా రైతుల నుండి సంతకాలు సేకరిస్తున్నాం...

      -పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో ఈ బిల్లు ను అమలు కానివ్వబోమని అంటున్నారు...

      -దమ్ముంటే సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా బిల్లులను చేయాలి...

      -సన్న రకపు వరి ధాన్యానికి 2500 మద్దతు ధర ప్రకటించాలి...

     -అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి...

  • 3 Nov 2020 11:24 AM GMT

    Mulugu District Updates: టి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశం...

    ములుగు జిల్లా

    - పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరావు,

    - ఎంపీ కవిత, జడ్పీఛైర్పర్సన్ కుసుమ జగదీష్, అన్ని మండలాల ఎంపీపీ లు,జడ్పీటీసీ లు,పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు...

    - ములుగు లీల గార్డెన్ లో కార్యకర్తల సమావేశం .

  • 3 Nov 2020 11:20 AM GMT

    Warangal Urban Updates: జిల్లా అభివృద్ధి సమావేశానికి హాజరైన వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు....

    వరంగల్ అర్బన్ :

    - జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశానికి హాజరైన వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు

    - వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ చైర్మన్ గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి హాజరైన ఇరువురు

    -రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ , కెప్టెన్ లక్ష్మీ కాంతరావు,

    - అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ పమేలా సత్పతి,

    - మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది

  • 3 Nov 2020 7:23 AM GMT

    సూర్యాపేట జిల్లా : కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ ముందు వివిధ సంఘాల ఆధ్వర్యంలో దర్నా, న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమని నిరసన..

    సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీక్లానాయక్‌ తండాకు చెందిన కోటేశ్వరిపై అత్యాచారం ఆరోపణతో మృతి చెందిందని ఆరోపిస్తూ మహిళా సంఘాలు, ఎల్ హెచ్ పిఎస్ ,సిపిఎం, బీజేపీ,ఎమ్మార్పీఎస్ , వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా,

    మృతి పై అనుమానాలు ఉన్నాయని వెంటనే సిట్టింగు జడ్జితో విచారణ చేపట్టాలని ఆందోళన ...

    మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే లు సైదిరెడ్డి, బొల్లం‌ మల్లయ్య యాదవ్

  • 3 Nov 2020 7:23 AM GMT

    సిద్దిపేట: పోలీస్ పహారా నడుమ న ఓటు హక్కు వినియోగించుకున్న మల్లన్న సాగర్ ముంపు గ్రామం లక్ష్మ పూర్ గ్రామస్థులు...

    .... గజ్వెల్ లోని సంగాపూర్ నుండి ప్రత్యేక బస్సుల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి యేటి గడ్డ కిష్టపూర్ గ్రామంలోని పోలింగ్ బూత్ కు వచ్చిన లక్ష్మపూర్ ముంపు గ్రామ ప్రజలు

  • 3 Nov 2020 7:23 AM GMT

    ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు...

    దుబ్బాక ఎన్నికల్లో పోలింగ్ మొదలయినప్పటి నుండి కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై తప్పుడు ప్రచారం జరుగుతోంది...

    ఒక ప్రొఫెషనల్ వీడియో ఉదయం నుండే ఒక ప్రముఖ ఛానెల్ లో ప్లే అయినట్టు సోషల్ మీడియా లో వస్తుంది...

    మా అభ్యర్థి నిన్న హైదరాబాద్ వచ్చినట్టు ,టీఆరెస్ నాయకులను కలిసినట్టు వస్తుంది దీనిని మా అభ్యర్థి కూడా ఖండించారు...

    దీనిపైన డీజీపీ తో పాటు అదనపు ఎన్నికల అధికారి కి పిర్యాదు చేసాం...

    కొద్ది సేపట్లో ఎవరు చేశారో తెలిస్తుంది...

    బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, టీఆరెస్ మంత్రి హరీష్ రావు లు కలిసి ఓటమి భయంతో కుట్ర పన్నారు...

    చాలా సీరియస్ గా శిక్ష పాడాలని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలంచాలని ఎన్నికల కమిషన్ ను కోరాం...

    కుట్ర పన్నిన వారికి శిక్ష పాడాలని డిమాండ్ చేస్తున్నాం...

  • 3 Nov 2020 7:22 AM GMT

    హైదరాబాద్:

    పాతబస్తీ చంచల్ గూడ కు చెందిన మహమ్మద్ ఆరిఫ్ ముహియుద్దీన్ యు ఎస్ ఏ జార్జియాలో దారుణ హత్య హైదరాబాద్ లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన జార్జియా పోలీస్ అధికారులు.

  • 3 Nov 2020 7:22 AM GMT

    హైదరాబాద్

    బుద్ధాభవన్ లో ఎన్నికల అదనపు ఎన్నికల అధికారి బుద్ధ ప్రకాష్ ని కలిసిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి,మాజీ ఎంపీ అంజనికుమార్ యాదవ్...

    దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి పై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు..

  • 3 Nov 2020 7:22 AM GMT

    ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు

    దుబ్బాక లో పోలింగ్ మొదలు కాగానే...సోషల్ మీడియాలో టిఆర్ఎస్ ,బీజేపీ దుష్ప్రచారం మొదలు పెట్టాయి...

    కాంగ్రెస్ అభ్యర్ధి టిఆర్ఎస్ లో చేరినట్లు..ప్రముఖ టీవీ ఛానెల్ బ్రేకింగ్ నడినట్లు

    ఓక ఫ్రోఫెషనల్ తయారు చేసిన విడియో ను సోషల్ మీడియా లో ప్రచారం చేసారు...

    ఆ టీవీ ఛానెల్ కూడా మేము ప్రసారం చేయలేదని చెప్పింది..

    ఓటమి భయం తో హరీష్ రావు ,రఘనందన్ చేసిన కుట్రే ఇది..

    ఈ కుట్ర పై డీజీపీ కి ఫిర్యాదు చేసాం..

    కేరళ లదో ఇదే విధంగా దుష్ప్రచారం ఛేస్తే..గెలిచిన అభ్యర్థి ని డిస్ క్వాలిఫై చేసింది.. అక్కడి హైకోర్టు

    కేరళ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు ను ఎన్నికల కమిషనర్ కు ఇస్తాం..

Print Article
Next Story
More Stories