Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 03 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ రా.12-36 తదుపరి చవితి | రోహిణి నక్షత్రం రా.12-55 తదుపరి మృగశిర | వర్జ్యం సా.4-13 నుంచి 5-57 వరకు | అమృత ఘడియలు రా.9-26 నుంచి 11-10 వరకు | దుర్ముహూర్తం ఉ.8-19 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-28 నుంచి 11-19 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-౨౬


ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 3 Nov 2020 2:35 PM GMT

    Warangal Urban Updates: కోవిడ్ మరియు సీజనల్ వ్యాధులపై వైద్య అధికారులతో సమీక్ష సమావేశం..

     వరంగల్ అర్బన్ జిల్లా

    - కోవిడ్ మరియు సీజనల్ వ్యాధులపై వరంగల్ ఉమ్మడి జిల్లా వైద్య అధికారులతో సమీక్ష సమావేశం

    - నిర్వహించిన రాష్ట్ర వైద్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు

    - వచ్చే3 నెలలో కోవిడ్ తీవ్రత ఎక్కువ ప్రభావం

    - ఇతర దేశాలలో పెరుగుతున్న కేసులు

    - మన దేశంలో గత రెండు నెలల నుంచి తగ్గుతున్న కేసులు

    - Dmho లతో మీటింగ్

    - రాబోయే రోజుల్లో కేసులు పెరుగుతే ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చ

    - ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము

    - ప్రజలు అజాగ్రత్తగా ఉండకూడదు.

    - వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ?

    - వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో తెలియదు

    - కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి మనకు maltiple వేవ్ ఉంటాయి.

    - మాస్క్, శానిటేషన్, భౌతిక దూరం, 60- 65 సం, 10 సం లోపు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి.

    - 242506 కేసుల నమోదు

    - అక్టీవ్ 17742

    - 2800 మంది హాస్పిటల్ చికిత్స

    - 3.5 పాజిటివ్ కేసులు

    - గత సంవత్సరం కంటే 50శాతం తక్కువ అంటూ వ్యాధులు

    - రాష్ట్రంలో 1600 మంది మృతి టార్గెట్ కంటే ఎక్కువ మంది ని టెస్ట్ చేయాలి.

    - ఎలాంటి సింతంటాక్ ఫ్లూ వచ్చిన uphc టెస్ట్ చేయించుకోవాలి 

  • 3 Nov 2020 2:29 PM GMT

    Mulugu District Updates: విలేకరుల సమావేశంలో కంటతడి పెట్టిన వాజేడు యంపిపీ శ్యామల శారద..

    ములుగు జిల్లా.....

    -ప్రజా ప్రతినిధుల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని యంపిపీ ఆవేదన

    -స్వేచ్ఛ లేని ప్రజాప్రతినిధులు

    -రైతు వేదిక నిర్మాణంలో నాణ్యతా లోపాలు బయట పెట్టటంతో అధికార పార్టీ యంపీపీ కి బెదిరింపులు.

    -పదవి నుంచి తప్పిస్తామని హెచ్చరికలు చేస్తున్నారని ఆమె విలేకరులతో బోరున విలపించారు.

    -అధికారులు అధికారిక కార్యక్రమాలు గురించి తనకు ఏవిధమైన సమాచారం ఇవ్వకుండా యంపీడీఓ అవహేలన చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

    -ఈ విషయాన్ని పార్టీ నాయకుల దృష్టికి తీసుకొని వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

    -యంపీడీఓ నిర్లక్ష్య వైఖరిని ములుగు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆమె తెలిపారు.

    -అధికార పార్టీ కి చెందిన తన పట్ల అధికార పార్టీ నాయకులు, అధికారులు వివక్ష చూపుతున్నారని యంపిపీ శ్యామల శారద తెలిపారు

  • 3 Nov 2020 2:27 PM GMT

    Mulugu District Updates: పోలీసుల వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ మావోయిస్ట్ కొరియర్లు..

    ములుగు జిల్లా...

    - ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద పోలీసుల వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ ఇద్దరు మావోయిస్ట్ కొరియర్లు.

    - వాజేడు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన బంధం వేణు,టేకులగూడెం గ్రామానికి చెందిన ఆలెం రవి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

    - వారి వద్ద నుండి డిటోనేటర్స్,జెలిటీన్ స్టిక్స్, విప్లవ సాహిత్యాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

  • 3 Nov 2020 2:15 PM GMT

    Medchal Updates: రైల్వే స్టేషన్ వద్ద రైలు అగ్నిప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే ప్రకటన...

    - మేడ్చల్ రైల్వేస్టేషన్ వద్ద ఆగి ఉన్న ట్రైన్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు స్టేషన్ మాస్టర్ సమాచారం ఇచ్చారు...

    - రైలు అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది..

    - ఈ రైలు సెప్టెంబర్ 22 నుండి నవంబర్ 4 వరకు 10 బోగీలు అక్కడే ఉంచబడ్డాయి..

    - ఈ 10 కోచ్ లలో ఒక స్లీపర్ కోచ్ కాలిపోయింది..

    - డ్యూటీ లో ఉన్న రైల్వే సిబ్బంది మిగిలిన కోచ్ లను వేరు చేయడం తో పాటు,ఎలక్ట్రిక్ సరఫరా దిస్ కనెక్ట్ చేసి మంటలు వ్యాపించకుండా నివారణ చర్యలు    తీసుకున్నారు..

    - వెంటనే ఫైర్ ఇంజన్ల సహయం తో మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది..

  • Bhadradri Kothagudem Updates: ఛత్తీస్‌ఘడ్ లో లొంగిపోయిన పది మంది మావోయిస్టులు...
    3 Nov 2020 2:04 PM GMT

    Bhadradri Kothagudem Updates: ఛత్తీస్‌ఘడ్ లో లొంగిపోయిన పది మంది మావోయిస్టులు...

     భద్రాద్రి కొత్తగూడెం..

    - లోన్ వరాట్ కార్యక్రమం లో బాగంగా దంతెవాడ జిల్లా ఎస్ పి ముందు లొంగిపోయిన మావోయిస్టులు.

    - వీరిలో ఏసిఎం, డి సి ఎం, ఎల్ జి ఎస్ డిప్యూటీ కమాండర్ స్దాయిగల ఐదుగురు కీలక దళ సభ్యులు కాగా వీరి తలపై ఒక్కొక్కరికి రూ. లక్ష నుండి ఐదు లక్షల    వరకు రివార్డులు ఉన్నట్లు తెలిపిన దంతెవాడ పోలీసులు.

  • Hyderabad Updates: ఐపీఎల్ బెట్టింగ్ లకు ఓ యువకుడు బలి...
    3 Nov 2020 2:00 PM GMT

    Hyderabad Updates: ఐపీఎల్ బెట్టింగ్ లకు ఓ యువకుడు బలి...

     హైదరాబాద్

    - జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోను కుమార్ యాదవ్ కొంతకాలంగా ఐపీఎల్ బెట్టింగ్ లో పాల్గొని తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నాడు.

    - పంజాగుట్ట ద్వారకపురి కాలనీ లో స్నేహితులతో కలిసి ఉంటూ కొబ్బరి బోండాలు విక్రయించేవారు.

    - మంగళవారం ఉదయం మిగిలిన వారు బయటకు వెళ్లగా ఇంట్లోనే ఉండి ఎవరూ లేని సమయంలో గ్రిల్ కు ఉరి బిగించుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు.

    - అతని సోదరుడు అర్జున్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • 3 Nov 2020 1:56 PM GMT

    Nizamabad Updates: ధరణి పోర్టల్ , రిజిస్ట్రేషన్ పరిశీలన..

    నిజామాబాద్ జిల్లా :

    - ఇందల్వాయి రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ నారాయణరెడ్డి..

    - రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పట్టాదారు పాసు పుస్తకాలను అందజేసిన జిల్లా కలెక్టర్...

  • Basara Saraswathi Devi Temple Updates: భక్తులు సమర్పించిన కానుకల హుండీల లెక్కింపు...
    3 Nov 2020 1:16 PM GMT

    Basara Saraswathi Devi Temple Updates: భక్తులు సమర్పించిన కానుకల హుండీల లెక్కింపు...

    * నిర్మల్ జిల్లా/బాసర,, శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం....

    * ఈ రోజు అమ్మవారి ఆలయంలో భక్తులు సమర్పించిన 119 రోజుల కానుకల హుండీలను లెక్కింపు

    * ఆదాయము..

    * మిశ్రమ బంగారం:--55 గ్రాములు..

    * మిశ్రమ వెండి:--1 కిలో 110 గ్రాములు..

    * విదేశీ కరెన్సీ నోట్లు:-- 04

    * మొత్తము:- 33,83048 రూపాయలు....

  • Palvai Rajani Comments: ముఖ్యంగా దళితులపై ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతున్నాయి..
    3 Nov 2020 12:41 PM GMT

    Palvai Rajani Comments: ముఖ్యంగా దళితులపై ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతున్నాయి..

    పాల్వాయి రజని బీజేపీ మహిళ నేత

    -తెలంగాణ అత్యాచారాలకు అడ్డాగా మారుతుంది..

    -ఒక మారుమూల ప్రాంతం నుండి చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చిన అమ్మాయి పై అఘాయిత్యం చేసి చంపేశారు..

    -దాదాపు 2000 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి మీ చట్టాలు అన్ని ఏమయ్యాయి...?

    -మంత్రుల స్థానంలో ఉన్నవారు కూడా మహిళలను వేధిస్తున్నారు..

    -చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చిన మహిళలకు రక్షణ లేకుండా పోయింది..

    -గత 4 రోజులుగా 200 మంది మహిళలు మిస్సయ్యారు..

    -ఇంతమంది ఎక్కడికి వెళ్లారు,ఏ ముఠా చేసింది..

    -అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో ఎంత వరకు శిక్షలు పడ్డాయి..

    -నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు..

    -బాధితురాలి కుటుంబానికి మేము అండగా ఉంటాము...

    -ఉద్యోగాల కోసం తాము ఆత్మహత్య చేసుకుంటాం అనుమతి ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ ను ఒక సోదరి కలసి చెప్పడం బాధాకరం..

    -బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఘటనల్లో ముందుడే రాహుల్ గాంధీ తెలంగాణ లో ఇన్ని అత్యాచారాలు జరుగుతున్న రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు..

  • 3 Nov 2020 12:27 PM GMT

    Suryapet Updates: హుజూర్ నగర్ పిట్లా నాయక్ తండాలో దారుణం..

    బంగారు శ్రుతి బీజేపీ జనరల్ సెక్రటరీ..

    -హుజూర్ నగర్ లో పిట్లా నాయక్ తండాలో అమ్మాయిని దారుణంగా చంపేశారు...

    -నిందితుడు ఎవరో తల్లిదండ్రులు చెప్పిన ఎందుకు అరెస్ట్ చేయలేదు...?

    -కోవిడ్ సమయంలో తెలంగాణ లో వరుసగా దారుణాలు జరుగుతున్న ప్రభుత్వం ఎంత సేపు ఎన్నికల్లో గెలవలెనే ఆలోచిస్తుంది...

    -మహిళల పైన అత్యాచారాలు జరిగిన ప్రభుత్వం స్పందించడం లేదు..

    -ఇంతమంది బిడ్డలు పోగొట్టుకున్న తల్లుల గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు...

    -స్వయంగా హోం మంత్రి ఇలాకా చందర్ ఘాట్ లో జరిగింది హోంమంత్రి ఎక్కడ...?

    -దేశంలో మహిళల మీద జరిగిన క్రైమ్ లో తెలంగాణ 4 వస్థానం లో ఉంది..

    -రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు..

    -ఏ మహిళ మంత్రి కూడా మహిళలపైన జరుగుతున్న అత్యాచారాల పైన మాట్లాడడం లేదు...

    -ఆదివారం ఈ ఘటన జరిగిన నిందితులు ఎవరో తెలిసిన అరెస్టులు చేయడం లేదు...

Print Article
Next Story
More Stories