Live Updates: ఈరోజు (02 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 02 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పాడ్యమి: రా.03-02 వరకు తదుపరి విదియ | రేవతి నక్షత్రంపూర్తిగా | వర్జ్యం: సా.06-55 నుంచి రా.08-41వరకు | అమృత ఘడియలు: తె.05-32నుంచి 06-36 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ. 12-09 నుంచి 12.56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Telangana congress: 2023లో కాంగ్రెదే అధికారం
    2 Oct 2020 10:30 AM GMT

    Telangana congress: 2023లో కాంగ్రెదే అధికారం

      మాణికం ఠాకూర్ ...తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్.

    . ఇందిరమ్మ ఇక్కడి నుండి నామినేషన్ వేసిన చోటు... అందుకే ఇక్కడి నుండి నేను ఇంఛార్జిగా కార్యక్రమాలు మొదలుపెట్టాను

    - 2023 లో తెలంగాణ లో అధికారంలోకి రావాలని నన్ను ఇక్కడికి పంపించారు

    - విజన్ 2023 పేరుతో మనం ముందుకు వెళదాం

    -వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 79 స్థానాలు కాంగ్రెస్ గెలవాలి

    - తెలంగాణ లో అన్ని వర్గాలు మేలు జరగాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు

    - కానీ సోనియా కల నెరవేరలేదు

    - కేసీఆర్ చేతుల్లో ఉన్న తెలంగాణలో సోనియాగాంధీ లక్ష్యాలు నెరవేరడం లేదు

    - తెలంగాణలో ప్రతీ పౌరుడికి సాధికారత కావాలని సోనియాగాంధీ కోరుకున్నారు

    - కానీ కేసీఆర్.. ఆయన కొడుకు..అల్లుడు.. బిడ్డ చేతిలోనే అధికారం ఉండిపోయింది

    - నష్టపోయిన అన్ని వర్గాలు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి రావాలని కోరుతున్న

    - ఏమీ లేని స్థితి నుండి... కేసీఆర్ అత్యంత దనికుడు అయ్యారు

    - కాంగ్రెస్ సమేశంలో మంత్రుల ప్రస్తావన తెచ్చిన ఇంచార్జ్.

    - 2023 లో కాంగ్రెస్ వస్తే జగ్గారెడ్డి ని మంత్రి ని చేస్తాం.


  • Damodara Rajanarsimha|కేసీఆర్ చెప్పేవి అన్ని అబద్ధాలే: దామోదర్ రాజనర్సింహ
    2 Oct 2020 10:24 AM GMT

    Damodara Rajanarsimha|కేసీఆర్ చెప్పేవి అన్ని అబద్ధాలే: దామోదర్ రాజనర్సింహ

    దామోదర్ రాజనర్సింహ...మాజీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు 

    - కమిషన్ రాజకీయాలు తెలంగాణ జరుగుతున్నాయి.

     - తెలంగాణ తెచ్చుకుంది కుటుంబ పాలన కోసం కాదు.

    - తెలంగాణను యువకులు కాపాడుకోవాలి.

    - అందరూ నడుం బిగించాలి.

  • Tamilisai Soundararajan| నేను డాటర్ ఆఫ్ తమిళనాడు.. సిస్టర్ ఆఫ్ తెలంగాణ
    2 Oct 2020 10:19 AM GMT

    Tamilisai Soundararajan| నేను డాటర్ ఆఫ్ తమిళనాడు.. సిస్టర్ ఆఫ్ తెలంగాణ

    తమిళ్ సై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్

    - అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను ఖండించిన గవర్నర్ తమిళ సై

    - రాజకీయ డ్రామా చేయడానికి రాజ్ భవన్ అడ్డా కాదు - గవర్నర్ తమిళ సై

    - కరోనా కారణంగా ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు - తమిళ సై

    - నాలుగు నెలలుగా రాజ్ భవన్ అదే విధానాన్ని అవలంభిస్తుంది

    - పిర్యాదులు ఉంటే ఈ మెయిల్ ద్వారా ఎప్పుడైనా చేయవచ్చు

    - రాజకీయాలు రాజ్ భవన్ కి ఆపాదించవద్దు

    -తొందరలోనే తెలుగు నేర్చుకుంటాను

    - కరోనా కేసుల రీకవరి లో తెలంగాణ రాష్ట్రం ముందు ఉంది. క్రమంగా ఉదృతి తగ్గుతుంది

    - తెలంగాణ రాష్ట్రం చేపట్టిన కరోనా నివారణ చర్యలతోనే వైరస్ అదుపులోకి వస్తుంది

    - దేశంలోనే తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా గా ఉండటం గర్వంగా ఉంది

  • Thammineni Sitharam: గత ప్రభుత్వంలో ప్రజలు పన్నులు కట్టలేదా ?
    2 Oct 2020 10:15 AM GMT

    Thammineni Sitharam: గత ప్రభుత్వంలో ప్రజలు పన్నులు కట్టలేదా ?

    - గిరిజన భూములు గిరిజనులకే చెందాలనే పోరాటం దశాబ్దాలుగా సాగుతోందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. 

    - గిరిజనులకు భూ హక్కు కల్పించాలని వైఎస్సార్ ఆలోచన చేశారు..

    - తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ గిరిజనుల కలలను సాకారం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్..

    - ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదనే అసంతృప్తి అన్ని వర్గాల్లో నెలకొంది..

    - అందుకే నాటి ప్రభుత్వాన్ని ప్రజలు మట్టికరిపించి జగన్ కు 151 స్థానాలతో పట్టం కట్టారు..

    - రైతులకు ఉచిత విద్యుత్ పథకం కింద మేలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తే ప్రతిపక్షం అసత్య ప్రచారాలు చేస్తోంది..

    - బోర్లకు మీటర్లు పెడితే రైతులకు అన్యాయం జరుగుతుందంటూ అబద్ధాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది..

    - పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని నిర్ణయిస్తే ప్రతిపక్ష నేత కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి అడ్డుకున్నారు..

    -ఇదెక్కడి సంస్కారం? ప్రభుత్వం ఏదైనా చేయకపోతే చేయమని ఒత్తిడి తేవాల్సిన ప్రతిపక్షం అడ్డంకులు సృష్టించడం ఏమిటో అర్థం కావడం లేదు..

  • Visakha updates: మహాత్మా గాంధీ చెప్పిన సిద్ధాంతాలను రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్నారు..
    2 Oct 2020 6:52 AM GMT

    Visakha updates: మహాత్మా గాంధీ చెప్పిన సిద్ధాంతాలను రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్నారు..

    విశాఖ..

    -విశాఖ జీవిఎంసీ గాంధీ విగ్రహాం వద్ద

    -గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.

    -ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్స్..

    -గ్రామ స్వరాజ్యమే ద్యేయంగా ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారు.

    -ప్రపంచ దేశాలకు గాంధీజీ ఆశయాలు ఆదర్శం.

    -మహాత్మాగాంధీ గొప్ప నేత.

  • Durgam Cheruvu updates: కేబుల్ బ్రిడ్జి మీద ప్రమాదకరంగా ఫోటోలు దిగుతున్న యువత, మహిళలు ..
    2 Oct 2020 6:48 AM GMT

    Durgam Cheruvu updates: కేబుల్ బ్రిడ్జి మీద ప్రమాదకరంగా ఫోటోలు దిగుతున్న యువత, మహిళలు ..

    దుర్గం చెరువు..

    -ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి మీద సోమవారం టు శుక్రవారం ఆగడం నిషేదం..

    -వీకెండ్స్ లో మరీ పెరుగుతున్న సందడి..

    -రోడ్డుకు అడ్డంగా నిలబడి రాకపోకలకు ఆటంకం

    -ప్రమాదకరంగా మారిన సందర్శకుల పర్యటన

  • 2 Oct 2020 6:24 AM GMT

    Warangal Urban updates: కేంద్రం ప్రవేశపెట్టిన రైతు బిల్లును వెతిరేకిస్తూ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ...

    వరంగల్ అర్బన్..

    -హాజరైన ఏఐసీసీ సెక్రటరీ శ్రీనివాసన్, మాజీ మంత్రి కొండా సురేఖ, జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు.

  • 2 Oct 2020 5:26 AM GMT

    Telangana updates: తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చిరంజీవులు ఆకస్మికంగా బదిలీ..

    తెలంగాణ.. 

    -కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా రిజిస్ట్రేషన్ల విధానంలో మార్పులు జరుగుతున్న తరుణంలో ఐజీని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

    -చిరంజీవులు స్థానంలో... సీఎంఓలో కొత్తగా కార్యదర్శిగా చేరిన శేషాద్రికి అదనపు బాధ్యతలు అప్పగించిన సర్కార్.

  • 2 Oct 2020 5:20 AM GMT

    Kamareddy District updates: జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ: కలెక్టర్ శరత్!

    కామారెడ్డి జిల్లా: 

    -జిల్లాలో బతుకమ్మ చీరలను ఈ నెల 13 నుంచి 15 వరకు పంపిణీ జిల్లా కలెక్టర్ శరత్

    -జిల్లాకు 3,45,248 చీరలు అవసరం కాగా ఇప్పటివరకు 2,68,280 వచ్చాయి మిగిలినవి త్వరలోనే జిల్లాకు రాక

    -స్వయం సహాయ సంగల మహిళలు రేషన్ డీలర్ పంచాయితీ కార్యదర్శి లతో గ్రామ స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకొని గ్రామములో ఏర్పాటు చేసే గోదాముల్లో     ఉంచి పంపిణీ చేయాలి.

  • Jayashankar Bhupalpally district: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..
    2 Oct 2020 5:17 AM GMT

    Jayashankar Bhupalpally district: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

    -12 గేట్లు ఎత్తిన అధికారులు

    -పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

    -ప్రస్తుత సామర్థ్యం 117.600 మీటర్లు

    -పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    -ప్రస్తుత సామర్థ్యం 7.77 టీఎంసీ

    -ఇన్ ఫ్లో 90,000 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో 30,000 క్యూసెక్కులు

Print Article
Next Story
More Stories