Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 02 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | విదియ రా.11-01 తదుపరి తదియ | కృత్తిక నక్షత్రం రా.10-50 తదుపరి రోహిణి | వర్జ్యం ఉ.9-38 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు రా.8-11 నుంచి 9-56 వరకు | దుర్ముహూర్తం మ.12-06 నుంచి 12-52 వరకు తిరిగి మ.2-23 నుంచి 3-09 వరకు | రాహుకాలం ఉ.7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 2 Nov 2020 9:24 AM IST
Tirupati Updates: రేణిగుంటలో క్షుద్రపూజలు అంటూ కలకలం..
తిరుపతి..
-రేణిగుంట హిందూ స్మశాన వాటికలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో క్షుద్రపూజలు జరిగాయి అంటూ పుకార్లు.
-ఒక్కసారిగా ఉలిక్కి పడిన రేణిగుంట గ్రామ ప్రజలు.
-స్మశాన వాటికలో ఉప్పు కుంకుమ, నిమ్మకాయలు, వంటి పూజ సామాగ్రితో ఈ క్షుద్ర పూజలు.
-దిష్టి తీసుకునేందుకు అలా చేసారు అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్న పరిసర ప్రాంత ప్రజలు.
- 2 Nov 2020 9:03 AM IST
Amaravati Updates: టిడ్కో ఇళ్ళపై బొత్స సత్యనారాయణ శ్వేత పత్రం విడుదల చేయాలి..
అమరావతి..
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ..
-టిడ్కో ఇళ్ళపై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శ్వేత పత్రం విడుదల చేయాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
-రాష్ట్ర వ్యాప్తంగా తుది దశకు చేరుకున్న టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులు కేటాయించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు?
-రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వకుండా పదేపదే తేదీలు ఎందుకు మారుస్తున్నారు?
-కేవలం 4 వేల ఎకరాలపైనే కోర్టులో వివాదాలు ఉన్నాయి.
-మిగిలిన 39 వేల ఎకరాల లో ఇళ్ల స్థలాలను ఎందుకు పంపిణీ చేయడం లేదు?
-దీపావళిలోగా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలి.
- 2 Nov 2020 8:56 AM IST
Amaravati Updates: విద్యా రంగంలో సంస్కరణలపై సీఎం జగన్ సమీక్ష..
అమరావతి..
-విద్యా రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష.
-11గంటలకు క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి,
- 2 Nov 2020 8:39 AM IST
Vijayawada Updates: బిసి కార్పొరేషన్ చైర్మన్,డైరెక్టర్ల అభినందన సభ..
విజయవాడ..
- ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నూతనంగా ఎన్నికైన బిసి కార్పొరేషన్ చైర్మన్,డైరెక్టర్ల అభినందన సభ.
- ఆయా జిల్లాలలో చైర్మన్, డైరెక్టర్లను అభినందించి సన్మానించనున్న జిల్లా ఎమ్మెల్యేలు,మంత్రులు.
- డైరెక్టర్,చైర్మన్ల అభినందన సభల్లో ముఖ్య అతిథులుగా పాల్గొననున్న జిల్లాల ఇంచార్జ్ మంత్రులు,ఎంపీలు.
- తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరగనున్న కార్యక్రమం
- 2 Nov 2020 8:36 AM IST
KurnoolDistrict Updates: నంద్యాల విజయ పాల డైరీ ఛైర్మన్ పదవి వివాదం..
కర్నూలు జిల్లా
- భూమా కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం..
- తమకే ఛైర్మన్ పదవి దక్కాలంటున్న భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఆయన బావ భార్గవ్ నాయుడు...
- మళ్ళీ ఛైర్మన్ పీఠం తమదేనంటున్న ప్రస్తుత ఛైర్మన్ భూమా నారాయణరెడ్డి...
- ఈ రోజు బోర్డు మీటింగ్ జరగనున్న నేపథ్యంలో గత రాత్రి నంద్యాల శివ సాయి గార్డెన్స్ వద్ద ఇరువర్గాల వాగ్వాదం..
- పరిస్థితి ని చక్క దిద్దిన పోలీసులు..
- బోర్డు మీటింగ్ సజావుగా సాగేనా అంటున్న డైరెక్టర్ లు
- 2 Nov 2020 8:11 AM IST
Amaravati Updates: నేడు కర్నూల్ జిల్లాలో పర్యటించనున్న జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్...
అమరావతి....
* బీసీ కార్పోరేషన్ చైర్మన్,డైరెక్టర్ల అభినందన సభలో పాల్గొనున్నా మంత్రి అనిల్ కుమార్
* తుంగభద్ర పుష్కరాలకు సంబంధించి స్థానిక నేతలతో కలిసి ఘాట్లను పరిశీలించనున్న మంత్రి అనిల్
* అనంతరం తుంగభద్ర పుష్కరాలు ఏర్పాట్లు పై అధికారులతో సమీక్ష సమావేశం.
- 2 Nov 2020 8:04 AM IST
RTC Updates: నేడు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అంతరాష్ట్ర ఒప్పందం...
ఆర్టీసీ..
_ మధ్యాహ్నం 2:45 కిరవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకోనున్న ఏపీ, తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ లు..
_ తెలంగాణ ప్రతిపాదించిన చెరో లక్షా 61 వేలా కిలోమీటర్లు నడపడానికి ఆంధ్రప్రదేశ్ దాదాపు అంగీకారం...
_ ఒప్పందం అనంతరం ఏడూ నెలలుగా ఆగిపోయిన రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు పునప్రారంభం...
- 2 Nov 2020 7:58 AM IST
Kadapa District Updates: నకిలీ బంగారాన్ని విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముగ్గిరిని అరెస్టు చేసిన సంబేపల్లె పోలీసులు...
కడప :
- సహకరించిన ఓ కానిస్టేబుల్ సైతం అరెస్టు....
- కోర్టులో హజరుపరచిన పోలీసులు....
- వారి వద్ద నుంచి 5 లక్షల నగదు...
- 42 గ్రాముల నకిలీ బంగారం.....
- 2 వాహానాలు స్వాధీనం
- 2 Nov 2020 7:54 AM IST
Ananthapur Updates: నేటి నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం..
అనంతపురం:
* నేటినుంచి శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ తరగతులు ప్రారంభం
* నవంబర్ 2 నుంచి ఆగస్టు వరకు కొనసాగనున్న విద్యా సంవత్సరం
* 180 రోజులు పనిచేయనున్న కళాశాలలు
* పండగల మినహా రెండో శనివారం ఆదివారం కొనసాగనున్న కళాశాలలు
- 2 Nov 2020 7:52 AM IST
Indrakeeladri Updates: కొండచరియలను పరిశీలించనున్న నిపుణుల కమిటీ..
విజయవాడ
- నేడు ఇంద్రకీలాద్రి పై ఉన్న కొండచరియలను పరిశీలించనున్న నిపుణుల కమిటీ
- కొండచరియలు పడకుండా పటిష్టమైన చర్యలు దిశగా అధికారుల అడుగులు
- కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టనున్న అధికారులు













