Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 02 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | విదియ రా.11-01 తదుపరి తదియ | కృత్తిక నక్షత్రం రా.10-50 తదుపరి రోహిణి | వర్జ్యం ఉ.9-38 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు రా.8-11 నుంచి 9-56 వరకు | దుర్ముహూర్తం మ.12-06 నుంచి 12-52 వరకు తిరిగి మ.2-23 నుంచి 3-09 వరకు | రాహుకాలం ఉ.7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Tirupati Updates: రేణిగుంటలో క్షుద్రపూజలు అంటూ కలకలం..
    2 Nov 2020 3:54 AM GMT

    Tirupati Updates: రేణిగుంటలో క్షుద్రపూజలు అంటూ కలకలం..

    తిరుపతి..

    -రేణిగుంట హిందూ స్మశాన వాటికలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట‌ సమయంలో క్షుద్రపూజలు జరిగాయి అంటూ పుకార్లు.

    -ఒక్కసారిగా ఉలిక్కి పడిన రేణిగుంట గ్రామ ప్రజలు.

    -స్మశాన వాటికలో ఉప్పు కుంకుమ, నిమ్మకాయలు, వంటి పూజ సామాగ్రితో ఈ క్షుద్ర పూజలు‌.

    -దిష్టి తీసుకునేందుకు అలా చేసారు అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్న పరిసర ప్రాంత ప్రజలు.

  • Amaravati Updates: టిడ్కో ఇళ్ళపై బొత్స సత్యనారాయణ శ్వేత పత్రం విడుదల చేయాలి..
    2 Nov 2020 3:33 AM GMT

    Amaravati Updates: టిడ్కో ఇళ్ళపై బొత్స సత్యనారాయణ శ్వేత పత్రం విడుదల చేయాలి..

    అమరావతి..

    సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ..

    -టిడ్కో ఇళ్ళపై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శ్వేత పత్రం విడుదల చేయాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

    -రాష్ట్ర వ్యాప్తంగా తుది దశకు చేరుకున్న టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులు కేటాయించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు?

    -రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వకుండా పదేపదే తేదీలు ఎందుకు మారుస్తున్నారు?

    -కేవలం 4 వేల ఎకరాలపైనే కోర్టులో వివాదాలు ఉన్నాయి.

    -మిగిలిన 39 వేల ఎకరాల లో ఇళ్ల స్థలాలను ఎందుకు పంపిణీ చేయడం లేదు?

    -దీపావళిలోగా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలి.

  • Amaravati Updates: విద్యా రంగంలో సంస్కరణలపై సీఎం జగన్ సమీక్ష..
    2 Nov 2020 3:26 AM GMT

    Amaravati Updates: విద్యా రంగంలో సంస్కరణలపై సీఎం జగన్ సమీక్ష..

    అమరావతి..

    -విద్యా రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష.

    -11గంటలకు క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి,

  • Vijayawada Updates: బిసి కార్పొరేషన్ చైర్మన్,డైరెక్టర్ల అభినందన సభ..
    2 Nov 2020 3:09 AM GMT

    Vijayawada Updates: బిసి కార్పొరేషన్ చైర్మన్,డైరెక్టర్ల అభినందన సభ..

      విజయవాడ..

    - ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నూతనంగా ఎన్నికైన బిసి కార్పొరేషన్ చైర్మన్,డైరెక్టర్ల అభినందన సభ.

    - ఆయా జిల్లాలలో చైర్మన్, డైరెక్టర్లను అభినందించి సన్మానించనున్న జిల్లా ఎమ్మెల్యేలు,మంత్రులు.

    - డైరెక్టర్,చైర్మన్ల అభినందన సభల్లో ముఖ్య అతిథులుగా పాల్గొననున్న జిల్లాల ఇంచార్జ్ మంత్రులు,ఎంపీలు.

    - తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరగనున్న కార్యక్రమం

  • KurnoolDistrict Updates: నంద్యాల విజయ పాల డైరీ ఛైర్మన్ పదవి వివాదం..
    2 Nov 2020 3:06 AM GMT

    KurnoolDistrict Updates: నంద్యాల విజయ పాల డైరీ ఛైర్మన్ పదవి వివాదం..

     కర్నూలు జిల్లా

    - భూమా కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం..

    - తమకే ఛైర్మన్ పదవి దక్కాలంటున్న భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఆయన బావ భార్గవ్ నాయుడు...

    - మళ్ళీ ఛైర్మన్ పీఠం తమదేనంటున్న ప్రస్తుత ఛైర్మన్ భూమా నారాయణరెడ్డి...

    - ఈ రోజు బోర్డు మీటింగ్ జరగనున్న నేపథ్యంలో గత రాత్రి నంద్యాల శివ సాయి గార్డెన్స్ వద్ద ఇరువర్గాల వాగ్వాదం..

    - పరిస్థితి ని చక్క దిద్దిన పోలీసులు..

    - బోర్డు మీటింగ్ సజావుగా సాగేనా అంటున్న డైరెక్టర్ లు

  • Amaravati Updates: నేడు కర్నూల్ జిల్లాలో పర్యటించనున్న జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్...
    2 Nov 2020 2:41 AM GMT

    Amaravati Updates: నేడు కర్నూల్ జిల్లాలో పర్యటించనున్న జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్...

     అమరావతి....

    * బీసీ కార్పోరేషన్ చైర్మన్,డైరెక్టర్ల అభినందన సభలో పాల్గొనున్నా మంత్రి అనిల్ కుమార్

    * తుంగభద్ర పుష్కరాలకు సంబంధించి స్థానిక నేతలతో కలిసి ఘాట్లను పరిశీలించనున్న మంత్రి అనిల్

    * అనంతరం తుంగభద్ర పుష్కరాలు ఏర్పాట్లు పై అధికారులతో సమీక్ష సమావేశం.

  • RTC Updates: నేడు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అంతరాష్ట్ర ఒప్పందం...
    2 Nov 2020 2:34 AM GMT

    RTC Updates: నేడు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అంతరాష్ట్ర ఒప్పందం...

       ఆర్టీసీ.. 

    _ మధ్యాహ్నం 2:45 కిరవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకోనున్న ఏపీ, తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ లు..

    _ తెలంగాణ ప్రతిపాదించిన చెరో లక్షా 61 వేలా కిలోమీటర్లు నడపడానికి ఆంధ్రప్రదేశ్ దాదాపు అంగీకారం...

    _ ఒప్పందం అనంతరం ఏడూ నెలలుగా ఆగిపోయిన రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు పునప్రారంభం...

  • Kadapa District Updates: నకిలీ బంగారాన్ని విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముగ్గిరిని అరెస్టు చేసిన సంబేపల్లె పోలీసులు...
    2 Nov 2020 2:28 AM GMT

    Kadapa District Updates: నకిలీ బంగారాన్ని విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముగ్గిరిని అరెస్టు చేసిన సంబేపల్లె పోలీసులు...

     కడప :

    - సహకరించిన ఓ కానిస్టేబుల్ సైతం అరెస్టు....

    - కోర్టులో హజరుపరచిన పోలీసులు....

    - వారి వద్ద నుంచి 5 లక్షల నగదు...

    - 42 గ్రాముల నకిలీ బంగారం.....

    - 2 వాహానాలు స్వాధీనం

  • Ananthapur Updates: నేటి నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం..
    2 Nov 2020 2:24 AM GMT

    Ananthapur Updates: నేటి నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం..

    అనంతపురం:

    * నేటినుంచి శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ తరగతులు ప్రారంభం

    * నవంబర్ 2 నుంచి ఆగస్టు వరకు కొనసాగనున్న విద్యా సంవత్సరం

    * 180 రోజులు పనిచేయనున్న కళాశాలలు

    * పండగల మినహా రెండో శనివారం ఆదివారం కొనసాగనున్న కళాశాలలు

  • Indrakeeladri Updates: కొండచరియలను పరిశీలించనున్న నిపుణుల కమిటీ..
    2 Nov 2020 2:22 AM GMT

    Indrakeeladri Updates: కొండచరియలను పరిశీలించనున్న నిపుణుల కమిటీ..

     విజయవాడ

    - నేడు ఇంద్రకీలాద్రి పై ఉన్న కొండచరియలను పరిశీలించనున్న నిపుణుల కమిటీ

    - కొండచరియలు పడకుండా పటిష్టమైన చర్యలు దిశగా అధికారుల అడుగులు

    - కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టనున్న అధికారులు

Print Article
Next Story
More Stories