Live Updates: ఈరోజు (సెప్టెంబర్-02) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 02 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం పూర్ణిమ (ఉ. 9-31 వరకు) తదుపరి పాడ్యమి శతభిష నక్షత్రం (సా. 6-25 వరకు) తదుపరి పూర్వాభాద్ర, అమృత ఘడియలు (ఉ. 10-46 నుంచి 12-28 వరకు) వర్జ్యం (రా. 1-19 నుంచి 3-03 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-35 నుంచి 12-25 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-12
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 2 Sept 2020 1:16 PM IST
Srikakulam District updates: శ్రీకాకుళం మునిసిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరాహ నరసింహం (వరం) మృతి..
శ్రీకాకుళం జిల్లా..
-శ్రీకాకుళం మునిసిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరాహ నరసింహం (వరం) మృతి..
-గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వరం..
-హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి..
- 2 Sept 2020 1:12 PM IST
Guntur District updates: తల్లి కూతుళ్ళు మృతి కేసు..
గుంటూరు ః.....
-తల్లి కూతుళ్ళు మృతి కేసు..
-మనోజ్ఞ ఆమె కూతురు తులసి అనుమానాస్పద మృతి పై బలపడుతున్న అనుమానాలు..
-పోస్టు మార్టం రిపోర్ట్ లో 36నుండి 48గంటల ముందు చనిపోయినట్లుగా నివేదిక...
-శనివారం ఉదయం అపార్ట్ మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారన్న భర్త కళ్యాణ్ చంద్....
-ఆదివారం మద్యాహ్నం డెడ్ బాడీలకు పోస్టు మార్టం..
-36 నుండి 48గంటల ముందు చనిపోతే ఆత్మహత్య ఎలా చేసుకుంటారనే సందేహం వ్యక్తం చేస్తున్న మనోజ్ఞ కుటుంబ సభ్యులు..
-శుక్రవారం నుండి భర్త కాల్ డేటా బయటకు తీస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్న మనోజ్ఞ కుటుంబ సభ్యులు..
- 2 Sept 2020 1:09 PM IST
అంబులెన్స్కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్
సీఎం కాన్వాయ్ అంబులెన్స్కు దారిఇచ్చింది.
పులివెందుల నుంచి తిరిగి వస్తున్న సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు.
గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు.
ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు.
అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.

- 2 Sept 2020 12:56 PM IST
Pavan Kalyan: కడపలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు..
కడప :
-కడపలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు..రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కార్యదర్శి సుంకర శ్రీనివాస్ కామెంట్స్ ....
-విశ్వసనీయత కలిగిన నేత పవన్ కళ్యాణ్
-పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురష్కరించుకుని సేవా కార్యక్రమాలను చేపట్టాం
-రానున్న రొజుల్లొ ఖచ్చితమైన ప్రణాళికతొ ప్రజాసమస్యలపై పోరాటాలకు జనసేన సిద్దంగా ఉంది
-ఎన్నికలలొ వైసిపి సాధ్యం కానీ హామీలిచ్చి అప్పుల కుంపటిగా మార్చింది...
-రానున్న రొజుల్లొ ప్రజలను చైతన్యవంతులను చేస్తాం
-అరాచక పాలనపై పొరాడేందుకు జనసేన, బిజేపి సిద్దంగా ఉన్నాయి..
-పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లొ ప్లెక్సీలు కడుతూ చిత్తూరు జిల్లాలొ అభిమానులు చనిపొవడం బాధకరం..
- 2 Sept 2020 12:49 PM IST
Rajahmundry-Amalapuram updates: జన సైనికులు తలపెట్టిన రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న పోలీసులు..
తూర్పుగోదావరి...... అమలాపురం......
-జన సైనికులు తలపెట్టిన అమలాపురం రూరల్ ఈదరపల్లి - ఇందుపల్లి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న పోలీసులు...
-అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు మరియు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు...
- 2 Sept 2020 12:45 PM IST
The late leader Y.S.R.: మహానేత మరణించి 11 ఏళ్లు అయ్యింది.
అమరావతి.
-సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రభుత్వ సలహాదారు..
-దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకున్నారు..
-మహానేత మరణించి 11 ఏళ్లు అయ్యింది.
-ప్రతి వ్యక్తి రాజశేఖర్ రెడ్డిని తమ కుటుంబ సభ్యడని భావించారు..
-విలువలు కోసం కట్టుబడిన వ్యక్తి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి..
-సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు..
-కోట్లాది మంది గుండెల్లో రాజశేఖర్ రెడ్డి స్తానం సంపాదించారు..
-రాజశేఖర్ రెడ్డి జీవితం అందరికి ఒక స్ఫూర్తి..
-ఆయన స్పూర్తితో పుట్టిన పార్టీనే వైఎస్ఆర్సీపీ..
-రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాము..
-రాజశేఖర్ రెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నట్టే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు..
-రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో వైస్సార్సీపీని ముందుకు తీసుకెళ్తాము..
-వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిది..
- 2 Sept 2020 12:37 PM IST
Guntur updates: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్దంతి..
గుంటూరు.....
-జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్దంతి .
-వైఎస్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించిన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, రోహిత్
-గుంటూరు...
-పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ
-కాంగ్రెస్ మాజీ సీఎం వైఎస్ వర్దంతి ని అన్ని జిల్లా కార్యాలయాల్లో నిర్వహించాం.
-వైఎస్ లేని లోటు రాష్టానికి తీవ్రంగా ఉంది.
-ఇందిరమ్మ రాజ్యం , అంబేద్కర్ ఆశయాల కోసం పని చేసిన వ్యక్తి వైఎస్,
-రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకున్న బలమైన నేత వైఎస్.
-వైఎస్ ఆశయాల కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంది.
-నేటి ప్రభుత్వం కాంగ్రెస్ లో
-వైఎస్ పెట్టిన పధకాలకు పేర్లు మార్చింది.
-వైఎస్ పధకాలే తప్ప కొత్త పధకాలు వైసిపి తెచ్చినవి ఏవి లేవు.
- 2 Sept 2020 12:33 PM IST
Y. S. Jaganmohan Reddy: కడప విమానాశ్రయానికి బయలుదేరిన సీఎం జగన్...
కడప :
-ఇడుపులపాయ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో కడప విమానాశ్రయానికి బయలుదేరిన సీఎం జగన్
- 2 Sept 2020 12:30 PM IST
YSR Vardhanti in West Godavari: డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి శ్రీ రంగ నాథ రాజు...
పశ్చిమగోదావరి జిల్లా..
-పశ్చిమగోదావరి జిల్లా ఆచంట లో స్వర్గీయ డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి 11 వ వర్ధంతి సందర్భంగా బుధ వారం డాక్టర్ వై యస్ ఆర్ విగ్రహానికి మంత్రి శ్రీ రంగ నాథ రాజు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించి అంజలి ఘటించిన మంత్రి శ్రీ రంగ నాథ రాజు.
- 2 Sept 2020 12:15 PM IST
Amaravati updates: ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు..
అమరావతి..
-ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు..
-జీవో నెంబర్ 411 ప్రకారం 3 మద్యం బాటిళ్లను తీసుకురావచ్చని, ఈ జీవో అమలు చేయాలని రిట్ పిటిషన్ లో తీర్పు ఇచ్చిన ఏపీ హైకోర్టు
-జీవో 411 ప్రకారం మద్యం బాటిళ్లు తీసుకువచ్చే అవకాశం ఉన్నా ఏపీ పోలీసులు, SEB అధికారులు సీజ్, అరెస్టు చేస్తున్నారని కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు
-దీనిపై తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-3 మద్యం బాటిళ్లు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావచ్చని తాజా ఉత్తర్వుల్లో వెల్లడి..








