Live Updates:ఈరోజు (ఆగస్ట్-02) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 02 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం చతుర్దశి (రాత్రి 9-30 వరకు) తదుపరి పూర్ణిమ; పూర్వాషాఢ నక్షత్రం (ఉ. 7-27 వరకు) తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం, అమృత ఘడియలు (రాత్రి 11-16 నుంచి 2-53 వరకు), వర్జ్యం (మ. 3-32 నుంచి 5-10 వరకు) దుర్ముహూర్తం ( సా. 4-47 నుంచి 5-38 వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-30

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్
    2 Aug 2020 11:46 AM GMT

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్

    - కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్

    - ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అమిత్ షా

    - కరోనా లక్షణాలతో టెస్ట్ చేయించుకున్న అమిత్ షా

    - నా ఆరోగ్యం బాగానే ఉంది

    - వైద్యుల సలహా మేరకు నన్ను ఆసుపత్రిలో చేర్పించారు

    - గత కొద్ది రోజులుగా నాతో సంప్రదించిన వారంతా కరోనా టెస్టులు చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాను.

  • 2 Aug 2020 11:39 AM GMT

    బిగ్ బీ అమితాబచ్చన్ కు కరోనా నెగిటివ్

    - బిగ్ బీ అమితాబచ్చన్ కు కరోనా నెగిటివ్

    - హాస్పటల్ నుండి డిశ్చార్జ్, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన  అభిషేక్ బచ్చన్

  • 2 Aug 2020 11:22 AM GMT

    శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం

    - శ్రీకాకుళం జిల్లలో కంచిలిల దగ్గర ఘోర రోడ్ ప్రమాదం.

    - లారీని డీకోట్టిన స్కార్పియో, ముగ్గురు మృతి.

    - మృతులు పచ్చిమబెంగాల్ లోని ఖరగ్ పూర్ వాసులుగా గుర్తింపు.   

  • 2 Aug 2020 11:16 AM GMT

    థియేటర్ వర్కర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ

    రాజమండ్రి :

    నగరంలోని స్వామి థియేటర్ వద్ద సినిమా థియేటర్ వర్కర్లకు ఆదివారం నిత్యావసర సరుకులు, రూ. 500 నగదు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ హాజరై ఆయన చేతుల మీదుగా అందజేశారు.

    ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సినిమా ధియేటర్ వర్కర్లు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

  • 2 Aug 2020 11:11 AM GMT

    చింతకుంట గ్రామంలో ఘర్షణ.. ఐదుగురికి గాయాలు

    అనంతపురం: పుట్లూరు మండలం చింతకుంట గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొని 5 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పుట్లూరు ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ పోలీసు జీవులో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

  • 2 Aug 2020 11:10 AM GMT

    అనాధ బాలికలకు సాయం అందిస్తున్న దాతలు

    సంతబొమ్మాళి: మండలం నౌపడలో తల్లిదండ్రులు కోల్పోయి అనాధలైన బాలికలు స్వాతి, పల్లవిలకు సాయం అందించడానికి పలువురు స్పందిస్తూ ముందుకు వస్తున్నారు. ఈ మేరకు ఆదివారం నౌపడకు చెందిన కళింగ కోమట్ల సంఘం చైర్మన్ వరాహ నరసింహ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ కొంచాడ దుర్గారావు, కళింగ కోమట్ల సంఘం జిల్లా నెంబర్ దుంప మోహన్ రావులు ఆ బాలికలకు15,000 రూపాయలు అందజేశారు. అలాగే శ్రీకాకుళంకు చెందిన జీల్ ఫౌండేషన్ నిత్యావసర సరుకులు, బియ్యం అందించారు.


  • కోనసీమలో కర్ఫ్యూ
    2 Aug 2020 7:45 AM GMT

    కోనసీమలో కర్ఫ్యూ

    తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం: 

    - కోనసీమలో ప్రశాంతంగా కొనసాగుతున్న కర్ఫ్యూ

    - ఇళ్లకే పరిమితమైన జనం

    - అత్యవసర సేవలకు మినహాయింపు

    - కోనసీమలో కర్ఫ్యూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్న డి.ఎస్.పి మశుం భాష

  • మాణిక్యాలరావుకు  బీజేపీ నేతల నివాళి
    2 Aug 2020 7:42 AM GMT

    మాణిక్యాలరావుకు బీజేపీ నేతల నివాళి

    గుంటూరు: బిజేపి ఆఫీస్ లో మాజీ మంత్రి మాణిక్యాలరావు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించిన బిజేపి నేతలు కన్నా లక్ష్మి నారాయణ, యడ్లపాటి రఘునాధ బాబు, మాజీ మంత్రులు శనక్కాయల అరుణ, రావెల ,

    - మాణిక్యాలరావు 9 వఏటనే సంఘ్ కార్యక్రమాలలో పాల్గోనేవాడు.

    - పశ్చిమ గోదావరి జిల్లాలో బిజేపి అభివృద్ధి కి కృషి చేశారు.

    - తాడేపల్లిగూడెం బిజేపి అభ్యర్దిగా గెలుపొంది మంత్రిగా పని చేశారు.

    - పార్టీ ఏ పని అప్పగించిన చిత్త లు తో నిర్వహించేవారు. 

    - మాణిక్యాలరావు లాంటి నిబద్దత కల వ్యక్తిని ఏపి బిజేపి కోల్పోయింది.

    - మాణిక్యాలరావు కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం...

  • దళితులపై దాడులకు నిరసనగా ఆందోళన
    2 Aug 2020 7:35 AM GMT

    దళితులపై దాడులకు నిరసనగా ఆందోళన

    గుంటూరు జిల్లా,తెనాలిలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆందోళన...

    - తెనాలి రజక చెరువు సెంటర్ లో దీక్షా  శిబిరం ఏర్పాటు చేసి నిరసన.

    - ధీక్ష శిబిరాన్ని భగ్నం చేసిన పోలీసులు

  • షిప్ యార్డ్ ప్రమాద మృతులకు కేజీహెచ్ లో పోస్టుమార్టం
    2 Aug 2020 7:31 AM GMT

    షిప్ యార్డ్ ప్రమాద మృతులకు కేజీహెచ్ లో పోస్టుమార్టం

    విశాఖ: హిందూస్థాన్ షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు కేజీహెచ్ లో పోస్టుమార్టం.

    కేజీహెచ్ మార్చురీ వద్ద రోధిస్తున్న మృతుల బంధువులు.

    కనీసం యాజమాన్యం స్పందించలేదని వాపోతున్న బాధిత కుటుంబాలు.

    ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన కమిటీలు

Print Article
Next Story
More Stories