AP Panchayat Elections 2021 Live Updates: ఏపీ పంచాయతీ ఎన్నికలు లైవ్

AP Panchayat Elections 2021 Fourth Phase Polling Live Updates: ఏపీ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ లైవ్ అప్ డేట్స్

K V D Varma
Updated on: 21 Feb 2021 7:36 PM IST

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసింది. నాలుగో విడతగా ఎన్నికల్లో 2,743 సర్పంచి, 22,423 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 6.30 గంటలకు మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్‌ జరిగింది. దీంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన 13,097 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తి అవుతాయి. పంచాయతీ ఎన్నికల నలుగోదశ పోలింగ్ అప్ డేట్స్ ఎప్పటి కప్పడు hmtv live updates అందిస్తోంది.

Live Updates

  • 21 Feb 2021 8:59 AM IST

    AP Panchayat Elections 2021 Fourth Phase

    కడప :

    * కడప జిల్లాలో నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు...

    * 11 మండలాల్లోని 114 గ్రామపంచాయతీ లలో 1056 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 8.30గం.ల వరకు 9.35 శాతం పోలింగ్ నమోదు

  • 21 Feb 2021 8:58 AM IST

    AP Panchayat Elections 2021 Fourth Phase

    తూ.గో.జిల్లా:

    రాజోలు 

    * రాజోలు నియోజకవర్గంలో  ప్రారంభమైన నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్...

    * నియోజకవర్గ పరిధిలో గల నాలుగు (మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి) మండలాలలోని 71 పంచాయితీలకు గాను రెండు (కూనవరం,మోరి) ఏకగ్రీవాలు కావడంతో మిగిలిన 69 పంచాయితీ లకు పోలింగ్ జరుగనుంది

    * మధ్యాహ్నం 3:30 గంటల వరకు జరగనున్న పోలింగ్.

    * సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు.

  • 21 Feb 2021 8:56 AM IST

    AP Panchayat Elections 2021 Fourth Phase

    తూ.గో.జిల్లా:

    రాజోలు

    * అంతర్వేది నరసన్న పెండ్లి ఘడియలు..

    * సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి కళ్యాణ మహోత్సవం రేపు అనగా 22-02-2021 రాత్రి 11-19 ని లకు ఆరుద్ర నక్షత్రయుక్త తులా లగ్న పుష్కరాంశము నందు అంగరంగ వైభవంగా జరుగును ఆలయ ఏసీ & ఈఓ వై భద్రాజీ

  • 21 Feb 2021 8:54 AM IST

    AP Panchayat Elections 2021 Fourth Phase

    అనంతపురం:

    * పరిగి మండలం ఊటుకూరు పంచాయతీ లో టిడిపి మద్దతు అభ్యర్థి భర్త రమేష్, సుధాకర్ రెడ్డి, పోలింగ్ కేంద్రం వద్ద అల్లర్లు సృష్టిస్తారని ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.

  • 21 Feb 2021 8:54 AM IST

    AP Panchayat Elections 2021 Fourth Phase

    ప్రకాశం జిల్లా:

    * కంభం మండలం రావిపాడు గ్రామంలో ఉదృక్తత.

    * ఓటర్ స్లిప్పుల విషలం వైసీపీ టీడీపీ వర్గాల మద్య తలెత్తిన వివాదం.

    * వైసీపీ సపోర్టేడ్ అభ్యర్థులకు స్లిప్పులు ఇఛ్చి తమకు ఇవ్వలేదంటూ వాగ్వివాదం.

    * ఇరువర్గాల మద్య తోపులాట.

    * వైసీపీ అభ్యర్థులనుండి తమకు అన్యాయం జరగకుండా చూడాలంటూ ఎసై కాల్లు పట్టుకుని వేడుకున్న టీడీపీ సపోర్టేడ్ అభ్యర్థి.

    * రంగంలోకి దిగి ఇరువర్గాల ను చెదరగొట్టిన పోలీసులు.

  • 21 Feb 2021 8:52 AM IST

    AP Panchayat Elections 2021 Fourth Phase

    విజయనగరం:

    * జిల్లా వ్యాప్తంగా పది మండలాల్లో ప్రారంభమైన తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్

    * ఉదయం 7.30 గంటల వరకు జిల్లాలో 7.6 శాతం పోలింగ్ నమోదు

  • 21 Feb 2021 8:51 AM IST

    AP Panchayat Elections 2021 Fourth Phase

    అనంతపురం:

    * ఉదయం 7.30 గంటలకు 4.59 శాతం నమోదు.

  • 21 Feb 2021 8:48 AM IST

    AP Panchayat Elections 2021 Fourth Phase

    అనంతపురం జిల్లా:

    * అనంతపురం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నట్టు ఎస్పీ సత్యఏసుబాబు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న ఎస్పీ సత్య ఏసుబాబు

  • 21 Feb 2021 8:45 AM IST

    AP Panchayat Elections 2021 Fourth Phase

    శ్రీకాకుళం జిల్లా:

    * శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. చివరి దశలో తొమ్మిది మండలాల్లో 259 పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. నరసన్నపేట, ఎచ్చెర్ల, శ్రీకాకుళం మూడు నియోజకవర్గాలలోని 62 సమస్యత్మక గ్రామాలు ఉండటంతో గట్టి బందోబస్త్‌ చర్యలు చేపట్టారు.

  • 21 Feb 2021 8:12 AM IST

    AP Panchayat Elections 2021 Fourth Phase

    విజయనగరం జిల్లా:

    * విజయనగరం జిల్లాలో పంచాయతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 6.30 నిమిషాలకు జిల్లాలోని 10 మండలాలలో 296 పంచాయతిలలో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఇవాళ జరుగుతున్న ఎన్నికలలో 4 లక్షల 54 వేల 142 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

K V D Varma

K V D Varma

Next Story