Diabetes: మధుమేహం వల్ల ఈ అవయవాలకు చాలా ప్రమాదం.. ఎందుకంటే..?

Diabetes: గత కొన్నేళ్లుగా మారుతున్న జీవనశైలి ప్రజలను అనేక వ్యాధులకు గురిచేస్తోంది.

Arun Chilukuri
Updated on: 30 May 2022 9:00 PM IST
Diabetes is Very Dangerous for These Organs
X

Diabetes: మధుమేహం వల్ల ఈ అవయవాలకు చాలా ప్రమాదం.. ఎందుకంటే..?

Diabetes: గత కొన్నేళ్లుగా మారుతున్న జీవనశైలి ప్రజలను అనేక వ్యాధులకు గురిచేస్తోంది. వీటిలో అత్యంత ముఖ్యమైనవి మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి వ్యాధులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశంతో సహా మొత్తం ప్రపంచంలో మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,.. మీకు డయాబెటిస్ ఉండి మీరు దానిని నిర్లక్ష్యం చేస్తే, అది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అధిక చక్కెర స్థాయి శరీరంలోని అనేక అవయవాలను దెబ్బతీస్తుంది. కాబట్టి అధిక చక్కెర స్థాయి వల్ల ఏ అవయవాలకు హాని కలుగుతుందో తెలుసుకుందాం.

మీరు చాలా కాలంగా మధుమేహ వ్యాధిగ్రస్తులైతే రక్తంలో పెరిగిన చక్కెర స్థాయి మీ కిడ్నీపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అధిక రక్త చక్కెర స్థాయి మూత్రపిండాల కణాలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా మూత్రపిండాల చిన్న రక్త నాళాలు దెబ్బతింటాయి. తరువాత ఇది మూత్రపిండాల ఫెయిల్యూర్‌కి దారి తీస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల కళ్లపై చెడు ప్రభావం ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగుల కళ్లను బలహీనపరుస్తుంది. ఈ పరిస్థితిలో డయాబెటిక్ రోగులు వారి కళ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి.

మధుమేహం కారణంగా కాళ్ళ నరాలపై కూడా చెడు ప్రభావం ఉంటుంది. అధిక చక్కెర కారణంగా పాదాల నరాలలో నొప్పి వస్తుంది. అది దెబ్బతినడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిలో మీరు షుగర్ పేషెంట్ అయితే మీ పాదాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story