ఆగ్రహంతో 'మహర్షి' చిత్రబృందం తీసుకున్న కీలక నిర్ణయం

ఆగ్రహంతో మహర్షి చిత్రబృందం తీసుకున్న కీలక నిర్ణయం
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోని 25వ సినిమా గా తెరకెక్కనున్న 'మహర్షి' సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోని 25వ సినిమా గా తెరకెక్కనున్న 'మహర్షి' సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ తో కనిపించబోతున్నాడు. విదేశాల్లో పెద్ద వ్యాపారవేత్త గా చలామణి అవుతున్న ఒక వ్యక్తి స్నేహితుడి కోసం తిరిగి భారతదేశం వచ్చి వ్యవసాయం చేసే పాత్రలో కనిపించనున్నాడు మహేష్.

అయితే ఈ పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరణ జరుగుతున్న కొన్ని సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ వీడియో లో మహేష్ బాబు పచ్చని పొలాల మధ్యలో నిలబడి మీడియాతో ముచ్చటిస్తూ ఉన్నట్లు కనిపిస్తాడు. అది సినిమాలో ఒక సన్నివేశం. ఈ సన్నివేశం నిజానికి సినిమా మొత్తంలో కీలకమని తెలుస్తోంది. అది లీక్ అవడంతో ఆగ్రహం చెందిన చిత్ర బృందం బయట నుంచి లోపలికి ఎవరు రాకూడదని ఎవరు సెట్స్ లో సెల్ఫోన్లు వాడకూడదని నిబంధనలు పెట్టాలని నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories