టీ కొట్టు డబ్బాలో పేలిన రెండు సిలిండర్లు

టీ కొట్టు డబ్బాలో పేలిన రెండు సిలిండర్లు
x
Highlights

మహబూబ్‌నగర్‌లోని పద్మావతి కాలనీలో గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో ఆరుగురు గాయపడ్డారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ టీ కొట్టులో రెండు సిలిండర్లు పేలాయి. ఈ...

మహబూబ్‌నగర్‌లోని పద్మావతి కాలనీలో గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో ఆరుగురు గాయపడ్డారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ టీ కొట్టులో రెండు సిలిండర్లు పేలాయి. ఈ ఉదయం మున్సిపల్‌ సిబ్బంది టీకొట్టు దగ్గర్లోనే చెత్తకు నిప్పంటించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డబ్బా యజమానితో పాటు ఐదుగురు మున్సిపల్‌ సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న కారు అద్దాలు సైతం ధ్వంసం అయ్యాయి. సిలిండర్‌ లీకేజీ వల్లే పేలుడు జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories