Coronavirus Updates in AP: ఏపీలో అత్యదికంగా 7,998 కేసులు నమోదు..

Coronavirus Updates in AP: ఏపీలో అత్యదికంగా 7,998 కేసులు నమోదు..
x
Representational Image
Highlights

Coronavirus Updates in AP: రాష్ట్రంలో గత 24 గంటల్లో 58052 సాంపిల్స్‌ ని పరీక్షించగా 7,998 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

Coronavirus Updates in AP: రాష్ట్రంలో గత 24 గంటల్లో 58052 సాంపిల్స్‌ ని పరీక్షించగా 7,998 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కొత్తగా 5, 428 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ వల్ల తూర్పు గోదావరి లో 14, గుంటూరు లో 07, కర్నూల్ 07, కృష్ణ 06, శ్రీకాకుళంలో 06, విశాఖపట్నం 05, విజయనగరం 05, చిత్తూరు 03, పచ్చిమ గోదావరి 03, ప్రకాశం 03, కడప 01, అనంతపురంలో 01 మరణించారు.

నేటివరకు రాష్ట్రంలో 14,93,897 సాంపిల్స్‌ ని పరీక్షించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 72,711 పాజిటివ్ కేసు లకు గాను.. 2895 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారుండగా.. 884 మంది మరణించారు. ప్రస్తుతం కేసులతో కలిపి రాష్ట్రంలో 34,272 యాక్టివే కేసులు ఉన్నాయ్. ఇక కరోనాతో పోరాడి రాష్ట్రంలో ఇప్పటివరకు 37,555 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ను విదుల చేసింది.





Show Full Article
Print Article
Next Story
More Stories