నెటిజన్ల పై ఫైర్ అయిన అనసూయ

నెటిజన్ల పై ఫైర్ అయిన అనసూయ
x
Highlights

స్టార్ యాంకర్‌ మరియు నటి అనసూయ నెటిజన్లపై మండి పడుతున్నారు. ఈమధ్యనే భారత దేశాన్ని స్తంభింపచేసిన పుల్వామా దాడిని ఖండిస్తూ అనసూయ ట్విటర్‌లో ఒక పోస్ట్‌...

స్టార్ యాంకర్‌ మరియు నటి అనసూయ నెటిజన్లపై మండి పడుతున్నారు. ఈమధ్యనే భారత దేశాన్ని స్తంభింపచేసిన పుల్వామా దాడిని ఖండిస్తూ అనసూయ ట్విటర్‌లో ఒక పోస్ట్‌ పెట్టింది. అయితే అనసూయ చేసిన ట్వీట్లపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ 'నీకు షోలు చేసుకునే టైం అయింది కదా. పో పొట్టి దుస్తులు వేసుకుని సిద్ధంగా ఉండుపో'అంటూ అసభ్యకరంగా కామెంట్లు పెట్టారు. వాటిపై అనసూయ ఘాటుగా స్పందించడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఒక వీడియో ద్వారా తన మనసులో మాట బయపెట్టింది అనసూయ.

"మొన్న పుల్వామా ఘటన జరిగినప్పుడు నేను దాడిని ఖండిస్తూ ట్వీట్లు చేస్తే కొందరు వాటిపై అసభ్యకర కామెంట్లు పెట్టారు. నన్ను ట్రోల్‌ చేస్తున్న మీరు ఏం చేస్తున్నారు? దేశం పట్ల అంత భక్తి, శ్రద్ధ ఉంటే కశ్మీర్‌కు వెళ్లి యుద్ధం చేయాలి కానీ అది మానేసి ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ముందు కూర్చుని ఏం చేస్తున్నారు? నా పని నేను చేసుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? దాడి జరిగిందని ఓ ట్వీటు పెట్టేసి, ఓసారి సంతాపం తెలిపేసి వెళ్లి బిర్యానీలు తీనేయడం లేదా? మనం చేస్తున్న పనికి, మాట్లాడిన దానికి పొంతన ఉండాలి. ముందు మీ ఇంట్లో వారిని గౌరవించండి. మీరు ఇక మారరా? మీ బుద్ధి ఇంతేనా? నేను ఏం పోస్ట్‌ చేసినా ప్రస్తావన తిరిగి నా దుస్తుల వద్దకే వస్తుందెందుకు? చేస్తే మంచి చేయండి. లేదంటే ఇంట్లో కూర్చోండి." అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories