Congo: విషాదం..పడవ బోల్తా పడి చెలరేగిన మంటలు..50 మంది మృతి, వందలాది మంది గల్లంతు

Dhivi
Published on: 17 April 2025 6:47 AM IST
Congo: విషాదం..పడవ బోల్తా పడి చెలరేగిన మంటలు..50 మంది మృతి, వందలాది మంది గల్లంతు
X

Congo: కాంగోలో దారుణ ప్రమాదం జరిగింది. ఓ పడవలో మంటలు చెలరేగి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 50 మంది మరణించగా.. వందలాది మంది గల్లంతయ్యారు. ప్రమాదం గురించి సమాచారం ఇస్తూ స్థానిక అధికారి ఒకరు మాట్లాడుతూ, ఈ ప్రమాదం కాంగో నదిలో జరిగిందని తెలిపారు. పడవలో మంటలు చెలరేగడంతో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. చాలా మందిని రక్షించారు. రెడ్ క్రాస్, స్థానిక ప్రభుత్వ అధికారులు సహాయం చేస్తున్నారు. ప్రమాదం తర్వాత గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు వెతుకుతున్నాయి. మోటారు చెక్క పడవ దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళుతుండగా, మంటలు చెలరేగి ఎంబాండకా పట్టణానికి సమీపంలో పెద్ద ప్రమాదం జరిగిందని అధికారి కొంపెటెంట్ లోయోకో అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థకు తెలిపారు.


HB కొంగోలో అనే పడవ మతంకుము ఓడరేవు నుండి బోలోంబా ప్రాంతానికి బయలుదేరిందని అధికారి లయోకో తెలిపారు. ప్రమాదంలో రక్షించిన దాదాపు 100 మందిని మబందకా టౌన్ హాల్‌లోని తాత్కాలిక ఆశ్రయానికి తరలించినట్లు ఆయన తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఒక మహిళ పడవలో వంట చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని లయోకో చెప్పారు. పడవ మంటల్లో చిక్కుకున్న తర్వాత, మహిళలు, పిల్లలు సహా చాలా మంది నదిలోకి దూకారని ఆయన అన్నారు. ఈత రాకపోవడంతో చాలా మంది నదిలోకి దూకి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాత దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Dhivi

Dhivi

Next Story