సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై గ్రనేడ్‌ దాడి

సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై గ్రనేడ్‌ దాడి
x
Representational Image
Highlights

జమ్మూకాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) శిబిరంపై ఉగ్రవాదులు శుక్రవారం గ్రనేడ్‌ దాడికి పాల్పడ్డారు..

జమ్మూకాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) శిబిరంపై ఉగ్రవాదులు శుక్రవారం గ్రనేడ్‌ దాడికి పాల్పడ్డారు.. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఉన్నతాధికారులు దృవీకరించారు. పారామిలిటరీ ఫోర్స్‌కు చెందిన దూనివారి గ్రామంలో ఉన్న శిబిరంపై గుర్తుతెలియని ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరినట్లు పోలీసు వర్గాలు తెలిపాయని ఆంగ్ల వెబ్ సైట్లలో కధనాలు వచ్చాయి. మిలిటెంట్లు శిబిరం వైపు గ్రెనేడ్ విసిరి, ఆపై ఆటోమేటిక్ ఆయుధాల నుండి కాల్పులు జరిపారు. ఇందులో ముగ్గురు సైనికులు గాయపడ్డారని ఒక అధికారి ఒక వార్తా సంస్థకు చెప్పారు. దూనివారి చదూరలోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్‌ విసిరారని దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నామని బుద్గాం ఎస్పీ పేర్కొన్నారు.

కాగా గాయపడిన వారు ఇన్‌స్పెక్టర్ మయేష్ చంద్, కానిస్టేబుల్ లు జి. ప్రకాష్ రావు,కె. సిర్నులుగా గుర్తించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. గ్రనేడ్‌ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. న్యూవాలోని సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో, జవాన్‌కు గాయాలైన వారం రోజుల వ్యవధిలోనే తాజా దాడి జరిగింది. కాగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి జమ్మూ కాశ్మీర్‌లో దళాలు బాగా సిద్ధంగా ఉన్నాయని సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎపి మహేశ్వరి ముందు రోజు చెప్పిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories