Pakistan Army convoy: ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి.. 47 మంది సైనికులు మృతి, 30 మందికి గాయాలు

Dhivi
Published on: 6 Jan 2025 9:20 AM IST
Pakistan Army convoy: ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి.. 47 మంది సైనికులు మృతి, 30 మందికి గాయాలు
X

Pakistani Army: పాకిస్తాన్ బాంబుదాడులో మరోసారి రక్తమోడింది. శనివారం రోజు బెలూచిస్తాన్ లోని తుర్బత్ నగర శివారులో బెహ్మాన్ ఏరియాలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే మిలిటెంట్ సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 47 మంది పాక్ సైనికులు మరణించారు. మరో 30మందికిపైగా జవాన్లు గాయపడ్డారు. ఈ విషయాన్ని బెలూచిస్తాన్ పోస్టు సంచలన వార్తను ప్రచురించింది.

బలూచిస్థాన్ పోస్ట్ కథనం ప్రకారం, పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్ కరాచీ నుంచి కెచ్‌కు వెళుతుండగా ఈ దాడి జరిగింది. 7 బస్సులు, 6 ఎస్కార్ట్ వాహనాలతో సబర్బన్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. లక్షిత బస్సులో 53 మంది ప్రయాణిస్తున్నారని, వీరిలో ఎక్కువ మంది ఎఫ్‌సీ సైనికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో రెండు ఎఫ్‌సి వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడు ధాటికి బస్సులోని ప్రయాణికులంతా అస్వస్థతకు గురయ్యారు.


ఈ దాడి వివరాలను బీఎల్ఏ అధికార ప్రతినిధి జీయంద్ బెలూచ్ తమకు తెలిపినట్లు కథనంలో బెలూచిస్తాన్ పోస్టు తెలిపింది. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తిని ఫిదాయూ సంగత్ బహర్ అలీగా గుర్తించారు. అతను తర్బత్ నగరంలో దరష్త్ హోచత్ ఏరియాకు చెందినవాడని బీఎల్ఏ వర్గాలు తెలిపాయి. 2017 నుంచి అతను బెలూచిస్తాన్ నేషనల్ మూవేమెంట్ లో పనిచేస్తున్నాడని..2022లో ఫిదాయిూ మిషన్ లో భాగమైనట్లు తెలిపాయి.

జరిగిన వెంటనే భద్రతా బలగాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బలూచిస్థాన్ పోస్ట్ ప్రకారం, క్వెట్టా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) జోహైబ్ మొహ్సిన్, అతని కుటుంబం కూడా ఈ పేలుడులో గాయపడినట్లు నివేదించింది. అందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రింద్ మాట్లాడుతూ, ఎస్‌ఎస్‌పి మొహ్సిన్‌కు స్వల్ప గాయాలు కాగా, అతని కుటుంబానికి చెందిన నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి, మృతదేహాలను స్వస్థలాలకు తరలించే ప్రక్రియను ప్రారంభించారు.

పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధితులకు సంతాపం తెలిపారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ఫరాజ్ బుగ్తీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇది అమానవీయ చర్యగా పేర్కొంటూ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్‌లోని అత్యంత చురుకైన "స్వాతంత్ర్య అనుకూల" సాయుధ సమూహాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ సమూహం తరచుగా అధిక ప్రొఫైల్ దాడులను నిర్వహిస్తుంది. BLA తన వార్షిక నివేదిక "Dhak - 2024" లో, BLA గత సంవత్సరం 300 కంటే ఎక్కువ ఆపరేషన్లు నిర్వహించిందని, ఇందులో వందలాది మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని పేర్కొంది.

Dhivi

Dhivi

Next Story