Ireland: ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్ధులు మృతి..

Ireland: ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు  విద్యార్ధులు మృతి..
x
Highlights

Ireland: ఐర్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరణించినవారికి పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్,...

Ireland: ఐర్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరణించినవారికి పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్ గా గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళ్లే..ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి సాయిబాబా అయ్యప్పనగర్ లో ఉంటున్నాడు. ప్యూరిఫైడ్ వాటర్ పరికరాల బిజినెస్ చేస్తున్నాడు. అతని పెద్ద కుమారుడు భార్గవ్ ను ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం ఐర్లాండ్ కు పంపించారు. అక్కడ కార్లోలోలని సౌత్ ఈస్ట్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. అలాగే పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన చెరుకూరి రామకోటయ్య పెద్ద కుమారుడు సురేశ్ ఉన్నత చదువుల కోసం ఏడాది కింద ఐర్లాండ్ కు వెళ్లారు. వీరిద్దరూ అక్కడ స్నేహితులయ్యారు.

ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి వీరిద్దరూ మరికొంతమంది స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లారు. ఆ సమయంలో భారీగా మంచు కురుస్తోంది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టు ఢీకొట్టింది. దీంతో కారుతో సహా వారు లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో భార్గవ్, సురేశ్ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories