శ్రీనగర్‌లోని జీలం నదిలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Jhelum River: 10 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

Jyothi
Published on: 17 April 2024 10:24 AM IST
Rescue operation in the Jhelum River in Srinagar
X

శ్రీనగర్‌లోని జీలం నదిలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Jhelum River: శ్రీనగర్‌లోని జీలం నదిలో ప్రయాణికుల పడవ బోల్తా పడిన విషాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ రెండో రోజు కొనసాగుతుంది. మొత్తం 19 మంది ప్రయాణికులతో వెళ్తోన్న పడవ జీలం నది ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ 10 మందిని రక్షించింది. ఇక నదిలో గల్లంతైన మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పడవ ప్రమాదంలో మృతి చెందిన వారిలో స్కూల్ విద్యార్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story