Pakistan: పాకిస్తాన్ లో 48గంటలపాటు పెట్రోల్ బంక్ లు మూసివేత

Petrol stations,  closed, 48 hours , Pakistan
x

Pakistan: పాకిస్తాన్ లో 48గంటలపాటు పెట్రోల్ బంక్ లు మూసివేత

Highlights

Pakistan: భారత్ ను దెబ్బతీయాలని దిక్కుమాలిన ప్లాన్స్ వేస్తూ భంగపాటుకు గురవుతున్న పాకిస్తాన్ కు స్వదేశంలో మరో సంక్షోభవం ఎదురైంది. అక్కడ దేశవ్యాప్తంగా...

Pakistan: భారత్ ను దెబ్బతీయాలని దిక్కుమాలిన ప్లాన్స్ వేస్తూ భంగపాటుకు గురవుతున్న పాకిస్తాన్ కు స్వదేశంలో మరో సంక్షోభవం ఎదురైంది. అక్కడ దేశవ్యాప్తంగా ఇంధన ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రాజధాని నగరమైన ఇస్లామాబాద్ లో రెండు రోజులపాటు పెట్రోల్ బంక్స్ అన్నింటినీ మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

శనివారం నుంచి రానున్న 48గంటలపాటు ఇస్లామాబాద్ లోని అన్ని పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లను పూర్తిగా మూసివేయాలని అక్కడి పరిపాలనా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం తక్షణ ఉత్తర్వులు జారీ చేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ అనూహ్య నిర్ణయం వెనక కారణాలేంటనేది తెలియరానప్పటికీ..ఇంధన కొరత కారణంగానే బంక్స్ లను మూసివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల ద్రుష్ట్యా నిల్వలను పెంచుకోవడం కోసమే ఈ చర్యలు చేపట్టి ఉంటుందని సమచారం.

ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న పాక్..భారత్ తో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం మరింత కుదేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం తీవ్రం అయితే నిత్యావసరాల కొనుగోలుకు కూడా దాయాది వద్ద ఆర్థిక వనరులు ఉండవని చెబుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ముందు మరోసారి సాయాన్ని అర్థించింది. తమ అభ్యర్థనను అంగీకరించి ఐఎంఎఫ్ ఒక బిలియన్ డాలర్ల సాయాన్ని అందించేందుకు అంగీకరించిందని పాకిస్తాన్ ప్రధాన కార్యాలయం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories