Pak Army Chief: పాక్‌ ఆర్మీ చీఫ్‌ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఏం జరగనుంది? ఆయనకు సొంత దేశంలోనే దిక్కులేదా?

Pak Army Chief
x

Pak Army Chief: పాక్‌ ఆర్మీ చీఫ్‌ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఏం జరగనుంది? ఆయనకు సొంత దేశంలోనే దిక్కులేదా?

Highlights

Pak Army Chief: భారత ప్రభుత్వం ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై స్పష్టమైన దృష్టిని ప్రపంచానికి తెలియజేసింది.

Pak Army Chief: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ తతంగం ఇప్పుడు అంతర్జాతీయంగా నవ్వులు పుట్టిస్తోంది. తన దేశంలో తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభం, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి వంటి మూడే దిక్కుల మంటలు మండుతున్నా, అవన్నీ పక్కన పెట్టి భారత్ మీద లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. తన చేతిలో విచ్చలవిడిగా జారిపోతున్న అధికారాన్ని పట్టుకుని ఉంచుకోవాలన్న ఆతృతతో అసీమ్ ఇప్పుడు దేశీయ సమస్యలను మరిచి ఓటమిని భారత్ మీదకు నెట్టే ప్రయత్నంలో ఉన్నారు.

ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో భారత్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వ్యూహంగా కనిపించినా, ఆలోచించాక అవి అర్థహీనంగా మారుతున్నాయి. భారత్–పాకిస్తాన్ వేర్వేరు దేశాలు అన్న విషయం లోకానికి తెలియనిదేమీ కాదు. కానీ అసీమ్ తన పదవిని నిలబెట్టుకునేందుకు ఆ మూల్యాలనే తన రాజకీయ ఆయుధంగా మార్చుకున్నారు. దేశం గాడి తప్పిన సమయంలో సెంటిమెంట్ కార్డు వేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక అసలు సంగతిలోకి వస్తే, పాకిస్తాన్ అంతటా ఇప్పుడు అసీమ్ మునీర్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జూనియర్ ఆఫీసర్లు స్వయంగా ఉన్నతాధికారులకు లేఖలు రాస్తూ ఆయనను తప్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. దీనికి తోడు అమెరికాలో అసీమ్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టిన పాకిస్తాన్ డెమోక్రసీ యాక్ట్, అంతర్జాతీయ ఒత్తిడిని మరింత పెంచింది. పాక్ ఆర్మీలోని అంతర్గత రాజకీయాలు అతని కుర్చీకి ప్రమాదంగా మారుతున్న వేళ, కశ్మీర్ వంటి సెంటిమెంట్‌ను తన రక్షణ గోడగా ఉపయోగించుకోవాలని ఆయన యత్నం చేస్తున్నారు.

అయితే ఈసారి ఆ వ్యూహం తిరగబెట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై స్పష్టమైన దృష్టిని ప్రపంచానికి తెలియజేసింది. అంతర్జాతీయ వేదికలపై కూడా భారత్‌ పాకిస్తాన్‌ను బాగా కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసీమ్ చేసిన వ్యాఖ్యలు మరింత చిక్కుల్లోకి నెట్టే అవకాశముంది.

ఇక అసీమ్‌కు దేశం లోపల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత, ఆర్థికంగా పాకిస్తాన్ పడుతున్న పతనం, అంతర్జాతీయంగా మిత్ర దేశాల నుంచి వస్తున్న ఒత్తిడులు..ఇలా అన్నీ ఆయన తలపై ఉరి తాడుగా మారుతున్నాయి. దేశంలో సమస్యలెన్నో ఉన్నా, అవన్నీ పక్కన పెట్టి భారత్ మీద అబద్దపు గూబలు వేసే ప్రయత్నం తాను చేసిన పొరపాటే అని ఆయన గుర్తించే సమయం దగ్గర్లోనే ఉందనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories