London: లండన్‌లో రోడ్డు ప్రమాదం.. భారత పీహెచ్‌డీ విద్యార్థిని మృతి

Indian PhD Student dies in London Road Accident
x

London: లండన్‌లో రోడ్డు ప్రమాదం.. భారత పీహెచ్‌డీ విద్యార్థిని మృతి

Highlights

London: నీతి ఆయోగ్‌లో ఓ ప్రాజెక్టు వర్క్ చేసిన చేష్టా కొచ్చర్

London: లండన్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన చేష్టా కొచ్చర్ దుర్మరణం చెందారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆమె బిహేవియరల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. సైక్లింగ్ చేస్తుండగా ఓ ట్రక్కు ఢీకొనడంతో ఆమె మరణించారు. ఆ సమయంలో ఆమె భర్త ప్రశాంత్ కొంత దూరంలో ఉన్నారు. వెంటనే వచ్చి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఆమె మృతి చెందారు. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఉండే చేష్టా.. గత సెప్టెంబర్‌లోనే పీహెచ్‌డీ చేయడానికి లండన్ వెళ్లారు.

ఈ ఘటన వివరాలను నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. 2021 - 23 మధ్య ఆమె నీతి ఆయోగ్‌లోని నేషనల్ బిహేవియరల్ ఇన్‌సైట్స్ యూనిట్‌లో సీనియర్ అడ్వయిజర్‌గా సేవలందించారు.. ఆమె ఢిల్లీ యూనివర్శిటీ, అశోక యూనివర్శిటీ, పెన్సిల్వేనియా, షికాగో యూనివర్శిటీల్లో విద్యనభ్యసించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories