మరోసారి కిమ్ విధ్వంసం : ప్రశ్నించిన అధికారిని కాల్చి చంపారు

మరోసారి కిమ్ విధ్వంసం : ప్రశ్నించిన అధికారిని కాల్చి చంపారు
x
Highlights

త్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి విధ్వంసానికి పాల్పడ్డాడు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రశ్నించిన తన ఐదుగురు అధికారులకు భయంకరమైన శిక్ష విధించాడు..

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి విధ్వంసానికి పాల్పడ్డాడు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రశ్నించిన తన ఐదుగురు అధికారులకు భయంకరమైన శిక్ష విధించాడు. నియంత ఆదేశాల మేరకు ఓ అధికారిని చంపేశారు. ఓ విందులో దేశ ఆర్థిక వ్యవహారాలపై చర్చిస్తున్న సమయంలో.. కిమ్ పాలన విధానాలపై ఐదుగురు అధికారులు చర్చ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఒకతను కిమ్ నిర్ణయాలను ప్రశ్నించాడు.. దేశంలో పారిశ్రామిక అభివృద్ధి అవసరమని చర్చ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్ధిక కష్టాలను అధిగమించడానికి ఉత్తర కొరియా కూడా విదేశీ సహాయం కోరాలని లేవనెత్తారు. దీంతో కిమ్ జోంగ్-ఉన్ కు కోపం వచ్చింది.

పైగా కిమ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధిపతి కూడా కావడంతో అతని చేతగానితనం బయటపడినందుకు అధికారులపై తీవ్రంగా కోపం పెంచుకున్నాడు. ఆ తరువాత తన అధికార యంత్రాంగంలో ముఖ్యమైన అధికారులను పిలిపించి, ఉత్తర కొరియా పాలనను బలహీనపరిచేందుకు వారు ప్రయత్నించారని సాకు చెప్పాడు. దాంతో అందులో ఒకతన్ని జూలై 30 న అతన్ని కాల్చి చంపారు. అంతేకాదు తన విధానాలను ప్రశ్నించినందుకు వీరందరి కుటుంబాలను యెడోక్‌లోని రాజకీయ శిబిరానికి పంపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories