మీరే కాదు.. నేనూ గిన్నెలు కడిగేస్తా..

మీరే కాదు.. నేనూ గిన్నెలు కడిగేస్తా..
x
Highlights

ఇళ్లలో గిన్నెలు తోమేది ఎవ‌రు? అంటే మహిళలే కదా అంటారేమో.. లాక్‌డౌన్ పుణ్యమాని ఇంట్లో ఖాళీగా ఉండే భ‌ర్త‌లకు కూడా ఈ పని త‌ప్ప‌లేదు. ఈ విష‌యాన్ని...

ఇళ్లలో గిన్నెలు తోమేది ఎవ‌రు? అంటే మహిళలే కదా అంటారేమో.. లాక్‌డౌన్ పుణ్యమాని ఇంట్లో ఖాళీగా ఉండే భ‌ర్త‌లకు కూడా ఈ పని త‌ప్ప‌లేదు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే ఇప్పుడు పెంపుడు జంతువులు కూడా అంట్లు తోమేస్తున్నాయి.. దీనికి ఉదాహరణ ఈ ఫోటోనే అని చెప్పవచ్చు.. సాధారణంగా పెంపుడు మూగజీవాలు తమ యజమానులు ఏది చెబితే అది చేస్తుంటాయని మనకందరికీ తెలుసు.. అలాంటి వాటిలో ముఖ్యంగా శునకాలు ముందుంటాయి. అలా ఒక శునకం కూడా అంట్లు తోమే పనికి పూనుకుంది.

ముకుల్ సింగ్ అనే వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ప్రకారం.. వంట‌గ‌దిలో ఓ శున‌కం కుర్చీపై కూర్చుని అంట్లు తోముతుంది. ఈ ఫోటో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటో చూసిన కొందరు వ్యక్తులు.. లాక్ డౌన్ బాధలు భర్తల తోపాటు శునకాలు కూడా తప్పలేదని సెటైర్లు వేస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం మూగ‌జీవాల‌ను వేధిస్తున్న య‌జ‌మానిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories