Sheikh Hasina: షేక్ అయిపోయిన షేక్ హసీనా.. పార్టీ అడ్రెస్ గల్లంతు.. యూనస్ దెబ్బకు అవామి లీగ్ విలవిల


Sheikh Hasina: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ ను అధికారికంగా నిషేధించింది. రెండు రోజుల ముందు మహమ్మద్ యూనస్...
Sheikh Hasina: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ ను అధికారికంగా నిషేధించింది. రెండు రోజుల ముందు మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం సవరించిన ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం షేక్ హసీనా అవామీ లీగ్ ను అధికారికంగా నిషేధించినట్లు ప్రకటించింది. దీని ద్వారా ఆ దేశ యుద్ధ నేరాల ట్రిబ్యునల్ విచారణ పెండింగ్ లో ఉన్న ఉగ్రవాదంలో పాల్గొనడం సంస్థలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు అనుమతించారు. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఈ రోజు జారీ చేసినట్లు బంగ్లాదేశ్ హోం సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ జహంగీర్ ఆలం తెలిపారు.
ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ నోటిఫికేషన్ ప్రకారం షేక్ హసీనా అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై విచారణ పూర్తయ్యే వరకు ఆ పార్టీతోపాటు దాని అనుబంధ సంస్థలను ఉగ్రవాద నిరోధక చట్టం 2025 కింద నిషేధించినట్లు బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. సవరించిన చట్టంలోని సెక్షన్ 18 ప్రభుత్వానికైనా ఏదైనా సంస్థ ఉగ్రవాదంలో పాల్గొన్నట్లు ప్రకటించే అధికారం ఉంటుంది. అది సహేతుకమైన కారణాల ఆధారంగా ఉగ్రవాద అనుబంధ సంస్థగా ప్రకటించే అధికారం ఇస్తుందన్నారు.
2009నాటి అసలు ఉగ్రవాద నిరోధక చట్టంలో సంస్థని నిషేధించే నిబంధన ఎక్కడా లేదు. అయినప్పటికీ అవామీ లీగ్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసింది. భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీని అనర్హులుగా ప్రకటించింది. ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడిన కొన్ని గంటల్లోనే హోంమంత్రిత్వ శాఖ బంగ్లాదేశ్ అవామీలీగ్ దాని అనుబంధ సంస్థ కార్యకలాపాలను నిషేధించిందని బోట్ కమిషన్ తెలిపింది.ఈ క్రమంలో అవామీ లీగ్ రిజిస్ట్రేషన్ ను నిలిపివేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఆదివారం రాత్రి అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఉగ్రవాద నిరోధక చట్టాన్ని సవరిస్తూ..ఓ ఆర్డినెన్స్ జారీ చేశారు. చట్టం ప్రకారం విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలకు మద్దతుగా పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా కంటెంట్, బహిరంగ సభలను నిషేధించారు. సలహాదారుల మండలి , ప్రధాన సలహాదారు యూనస్ నేత్రుత్వంలోని మంత్రివర్గం, ఉగ్రవాద నిరోధకచట్టం 2009కి మార్పులను ఆమోదించిన కొన్ని గంటల తర్వాత ఒక నిర్దిష్ట సంస్థ అన్ని కార్యకలాపాలపై నిషేధం విధించిన కొన్ని గంటల తర్వాత ఈ ఆర్డినెన్స్ పై సంతకం చేశారు.
యూఎన్ హక్కుల కార్యాలయం నివేదిక ప్రకారం జులై 15 నుంచి ఆగస్టు 15 మధ్య దాదాపు 1,400 మంది మరణించడంతో అవామీ లీగ్ ప్రభుత్వం ఆగస్టు 5, 2004న కూలిపోయింది. అందులో చాలా మంది అవామీ లీగ్ మద్దతుదారులు పోలీసులపై ప్రతీకారచర్యలకు గురికావాల్సి వచ్చింది. 1949లో ఏర్పడిన అవామీ లీగ్..అప్పటి తూర్పు పాకిస్తాన్ లో బెంగాలీల స్వయంప్రతిపత్తి కోసం దశాబ్దాలుగా ఉద్యమాన్ని నడిపించింది. చివరికి 1971లో విముక్తి యుద్ధానికి నాయకత్వం వహించింది.
చాలామంది అవామీ లీగ్ మద్దతుదారులు పోలీసుల ప్రతీకార చర్యలకు బాధితులయ్యారు. 1949లో ఏర్పడిన అవామీ లీగ్, అప్పటి తూర్పు పాకిస్తాన్ లో బెంగాలీల స్వయంప్రతిపత్తి కోసం దశాబ్దాలుగా ఉద్యమానికి నాయకత్వం వహించింది. చివరికి 1971లో విముక్తి యుద్ధానికి నాయకత్వం వహించింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



