ATMలలో ₹100, ₹200 నోట్ల లభ్యత పెరిగింది – RBI లక్ష్యాన్ని ముందే చేరిన బ్యాంకులు

ATMలలో ₹100, ₹200 నోట్ల లభ్యత పెరిగింది – RBI లక్ష్యాన్ని ముందే చేరిన బ్యాంకులు
x

ATMలలో ₹100, ₹200 నోట్ల లభ్యత పెరిగింది – RBI లక్ష్యాన్ని ముందే చేరిన బ్యాంకులు

Highlights

ATMలలో రూ.100, రూ.200 నోట్లు మరింతగా అందుబాటులోకి వచ్చాయి. RBI సూచించిన గడువుకు మూడు నెలల ముందే దేశవ్యాప్తంగా 73% ATMలలో ఈ నోట్లు అందుబాటులో ఉన్నాయని CMS Infosystems వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో ప్రజలు ఎక్కువగా వినియోగించే రూ.100, రూ.200 నోట్ల లభ్యత గణనీయంగా పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా, బ్యాంకులు, వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు వాటి యంత్రాల్లో ఈ నోట్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాయి.

2024 ఏప్రిల్‌లో RBI జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, 2025 సెప్టెంబర్ 30 నాటికి 75% ATMలలో, అలాగే 2026 మార్చి 31 నాటికి 90% ATMలలో రూ.100 లేదా రూ.200 నోట్ల ఉపసంహరణ ఉండాలని స్పష్టం చేసింది. అయితే తాజా గణాంకాల ప్రకారం ఇప్పటికే 73% ATMలలో ఈ నోట్లు అందుబాటులోకి వచ్చాయి.

CMS Infosystems విడుదల చేసిన డేటా ప్రకారం, 2023 డిసెంబర్ నాటికి ATMలలో ఈ నోట్ల లభ్యత 65% ఉండగా, 2024 జూన్ నాటికి అది 73%కి చేరింది. దీని వలన ప్రజలకు చిన్న నోట్ల లభ్యత మెరుగవుతూ, నగదు లావాదేవీలు మరింత సౌలభ్యంగా మారుతున్నాయి.

RBI సూచనల మేరకు బ్యాంకులు, ATM ఆపరేటర్లు ప్రజల అవసరాల మేరకు చిల్లర నోట్లను అందించడంపై దృష్టి పెట్టడంతో ఈ ప్రగతి సాధ్యమైంది. ఇక మిగిలిన 2% టార్గెట్‌ కూడా ముందుగా చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories