Mexico: డ్రగ్స్ ముఠాల ఘర్షణల్లో 53 మంది దుర్మరణం

Mexico:డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం వాటిల్లుతోంది. ప్రపంచ దేశాల్లో అత్యంత హింసాత్మకమైన సినాలోవా కార్టెల్ లో డ్రగ్స్ ముఠాలమధ్య కొంతకాలంగా తీవ్రఘర్షణలు జరుగుతున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Sept 2024 10:26 AM IST
Mexico: 53 people died in drug gang clashes
X

Mexico: డ్రగ్స్ ముఠాల ఘర్షణల్లో 53 మంది దుర్మరణం

Mexico:డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం వాటిల్లుతోంది. ప్రపంచ దేశాల్లో అత్యంత హింసాత్మకమైన సినాలోవా కార్టెల్ లో డ్రగ్స్ ముఠాలమధ్య కొంతకాలంగా తీవ్రఘర్షణలు జరుగుతున్నాయి. మెక్సికోలో సినాలోవా రాష్ట్రంలో జరగుతోన్న ఈ గ్యాంగ్ వార్ లో ఇప్పటి వరకు 53 మంది మరణించారు. మరో 51 మంది ఆచూకీ గల్లంతు అయ్యింది. జులైలో డ్రగ్ డాన్ ఇస్మాన్ ఎల్ మాయో జంబాడ అరెస్టు అయిన నేపథ్యంలో ఈ హింసను కట్టడి చేయలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

సెప్టెంబరు 9 న ఘర్షణలు ప్రారంభమయ్యాయి. రాజధాని కులియాకాన్‌లో ప్రజలకు తీవ్ర అంతరాయం కలిగించాయి. ఇక్కడ కొన్ని రోజులలో పాఠశాలలను మూసివేశారు. అయితే రెస్టారెంట్లు, దుకాణాలు ముందుగానే మూసివేశారు. సినాలోవా గవర్నర్ రూబెన్ రోచా మోయా శుక్రవారం మాట్లాడుతూ, ఇటీవలి రోజుల్లో 40 మందికి పైగా అరెస్టు అయ్యారని.. సినాలోవా అంతటా 5,000 కంటే ఎక్కువ ఆహార ప్యాకేజీలు అందజేసినట్లు తెలిపారు. హింసను తగ్గించేందుకు పోరాడుతున్న మెక్సికో సైన్యం, లాస్ చాపిటోస్ నాయకుడు, జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ సినాలోవా కింగ్‌పిన్ జోక్విన్ "ఎల్ చాపో" గుజ్మాన్ కుమారుడు ఇవాన్ ఆర్కివాల్డో గుజ్మాన్‌కు భద్రతాసిబ్బంది గురువారం అరెస్టు చేసింది..

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story