ఆసిస్‌లో పేలిన ఢిల్లీ డైనమైట్

ఆసిస్‌లో పేలిన ఢిల్లీ డైనమైట్
x
Highlights

టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్...కంగారూ గడ్డపై సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న...

టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్...కంగారూ గడ్డపై సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరిటెస్టు రెండోరోజుఆటలో రిషభ్ పంత్ మెరుపు సెంచరీతో చెలరేగిపోయాడు. 12 ఏళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ...విదేశీ గడ్డపై సాధించిన అత్యధిక పరుగుల రికార్డును రిషభ్ పంత్ తెరమరుగు చేశాడు. 21 ఏళ్ల ఈ ఢిల్లీ కుర్రోడు...టీమిండియా వికెట్ కీపర్ డైనమైట్ రిషభ్ పంత్.

ఢిల్లీలోని ఓ దిగువమధ్యతరగతి కుటుంబం నుంచి భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన రిషభ్ ...ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో సభ్యుడిగా ఐపీఎల్ లో పాల్గొనడం ద్వారా తన బ్యాట్ పవర్ ఏంటో చాటుకొన్నాడు. ఇండియా-ఏ జట్టులో సభ్యుడిగా సైతం నిలకడగా రాణించడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడమేకాదు.. ధోనీ, దినేశ్ కార్తీక్, .పార్థివ్ పటేల్, వృద్ధిమాన్ సాహా లాంటి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనా...సీనియర్ జట్టులో చోటు సంపాదించాడు.

బెంగళూరు వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టీ-20 మ్యాచ్ ద్వారా...టీమిండియా క్యాప్ అందుకొన్న రిషభ్...2018 ఇంగ్లండ్ టూర్ లోనే...టెస్ట్ అరంగేట్రం చేశాడు. నాటింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన టెస్ట్ ద్వారా 20 ఏళ్ల చిరుప్రాయంలోనే రిషభ్ పంత్ టెస్ట్ క్యాప్ సాధించాడు. అదే సిరీస్ లో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఆఖరిటెస్ట్ మ్యాచ్ ఆఖరి ఇన్నింగ్స్ లో రిషభ్ ఓ మెరుపు సాధించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఆఖరిటెస్ట్ ఆఖరిరోజు ఆటలో....ఫైటింగ్ సెంచరీ సాధించడం ద్వారా...గతంలో ఏ భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సాధించని ఘనతను సొంతం చేసుకొన్నాడు. కేవలం 20 ఏళ్ల వయసులోనే... ఓ టెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన టీమిండియా తొలి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా చరిత్ర సృష్టించాడు.

ఓపెనర్ రాహుల్ తో కలసి ఆరో వికెట్ కు 204 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన రిషభ్ పంత్..15 బౌండ్రీలు, 4 సిక్సర్లతో...కేవలం తన రెండోటెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్ లోనే మూడంకెల స్కోరు సాధించగలిగాడు. 2007 సిరీస్ లో ఇంగ్లండ్ పై నాలుగో ఇన్నింగ్స్ లో మహేంద్రసింగ్ ధోనీ సాధించిన 76 పరుగుల నాటౌట్ స్కోరే...అప్పటి వరకూ.. నాలుగో ఇన్నింగ్స్ లో ఓ భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అత్యధిక స్కోరుగా ఉంది. అయితే...ఆ రికార్డును రిషభ్ పంత్...ఓవల్ టెస్ట్ ద్వారా తెరమరుగు చేయగలిగాడు. ఆ తర్వాత...ఆస్ట్రేలియాతో ప్రారంభమైన ... నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సైతం...వికెట్ కీపింగ్ తో పాటు...బ్యాటింగ్ లోనూ రిషభ్ పంత్ మెరుపులు మెరిపించాడు. వికెట్ కీపర్ గా ....మొదటి మూడుటెస్టుల్లోనే 21 క్యాచ్ లు పట్టి...నరేన్ తమానే, కిర్మాణీల పేరుతో ఉన్న రికార్డును ఒక్కమాటలో చెప్పాలంటే..జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీకి...ఈ ఢిల్లీ డైనమైటే అసలు సిసలు వారసుడని...భారత్ క్రికెట్ అమ్ములపొదిలో తాజా అస్త్రమని ప్రత్యేకంగా చెప్పాలా మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories