కొత్త పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులు.. రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోండి

Arun Chilukuri
Published on: 16 May 2019 9:52 PM IST
కొత్త పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులు.. రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోండి
X

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతుబీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. రైతుబీమాకు దరఖాస్తు చేసుకునేవారు 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారై ఉండాలి. కొత్త పట్టాపాస్ పుస్తకం లేదా ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టా కలిగి ఉన్నవారు రైతులు తమ వద్ద ఉన్న ఆధారాల నకలు కాపీలను కార్యాలయంలో అందజేయాలి. నామిని పేరు, వారికి సంబంధించిన ఆధారాలను కచ్చితంగా దరఖాస్తుతో జతచేయాలి. రైతుబీమా చేయించుకునేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. రైతు అనుకోని పరిస్థితిలో మృతి చెందితే రాష్ట్ర ప్రభుత్వం నామినీకి 5 లక్షల రూపాయలు చెల్లిస్తుంది అధికారులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story