దారుణం: నోట్లో బియ్యం కుక్కి.. మహిళపై అత్యాచారం

దారుణం: నోట్లో బియ్యం కుక్కి.. మహిళపై అత్యాచారం
x
Highlights

ప్రకాశం జిల్లా ఒంగోలులోని కేశవరాజుకుంట శివారులో దారుణం జరిగింది. ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి అనంతరం నోట్లో బియ్యం గింజలు పోసి...

ప్రకాశం జిల్లా ఒంగోలులోని కేశవరాజుకుంట శివారులో దారుణం జరిగింది. ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి అనంతరం నోట్లో బియ్యం గింజలు పోసి హత్యాయత్నం చేశారు. ఆమె చనిపోయిందనుకుని అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలికి తెలిసినవారే శివారు ప్రాంతానికి రప్పించి అత్యాచారానికి పాల్పడ్డారా లేక మహిళను కిడ్నాప్‌ చేసి అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారా అన్నది తేలాల్సి ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న మహిళ స్పృహలోకి వస్తే మిస్టరీ వీడిపోయే అవకాశం ఉందని తొలుత పోలీసులు భావించారు. అయితే బాధితురాలు చికిత్ప పొందుతూ మృతి చెందడంతో కేసు మిస్టరీగా మారింది. ఈ సంఘటనలో ప్రాధమిక ఆధారాలను గుర్తించిన పోలీసులు మహిళపై అత్యాచారంచేసి అనంతరం హత్యాయత్నం చేసినట్టు భావిస్తున్నారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలు ఒంగోలు శ్రీనగర్ కాలనీకి చెందిన పోలమ్మగా గుర్తించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories