రూ.1.30 లక్షలకు గిరిజన మహిళ అమ్మకం!

రూ.1.30 లక్షలకు గిరిజన మహిళ అమ్మకం!
x
Highlights

కొమ్రం భీమ్ జిల్లాలో మహిళ అమ్మకం కలకలం రేపింది. తిర్యాని ‌మండలం దంతన్ పల్లికి చెందిన గిరిజన మహిళని మధ్యప్రదేశ్ కు చెందిన బ్రోకర్లు ఒక లక్ష 30 వేలకు...

కొమ్రం భీమ్ జిల్లాలో మహిళ అమ్మకం కలకలం రేపింది. తిర్యాని ‌మండలం దంతన్ పల్లికి చెందిన గిరిజన మహిళని మధ్యప్రదేశ్ కు చెందిన బ్రోకర్లు ఒక లక్ష 30 వేలకు విక్రయించారు. ఈ వ్యవహారంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కీలకపాత్ర పోషించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన బ్రోకర్ కోసం గాలిస్తున్నారు. గత జూలైలో తన కూతురు కనిపించడం లేదని ఆ మహిళ తండ్రి తిర్యాణి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో మహిళా విక్రయం వెలుగులోకి వచ్చింది. దళారుల చేతిలో మోసపోయి ప్రాంతం కానీ ప్రాుతంలో ఇతరుల చేతిలో చిక్కిన ఆ మహిళ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు అంతా చెప్పడంతో మరిన్ని విషయాలు తెలిశాయి. దీంతో జిల్లాలో మానవ అక్రమ రవాణా బయటకు తెలిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories