విజయవాడలో ఆటో డ్రైవర్ ఘాతుకం... ప్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్

విజయవాడలో ఆటో డ్రైవర్ ఘాతుకం... ప్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్
x
Highlights

రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరుగుతునే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మనవ మృగాలచేతిలో మహిళలు బలికాక తప్పడం లేదు. తాజాగా ఓ మహిళపై ఆటో డ్రైవర్‌, అతడి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరుగుతునే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మనవ మృగాలచేతిలో మహిళలు బలికాక తప్పడం లేదు. తాజాగా ఓ మహిళపై ఆటో డ్రైవర్‌, అతడి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే విజయవాడ వాంబేకాలనీకి చెందిన యువతి (23) భర్త వదిలేయడంతో తల్లితో కలిసి ఉంటుంది. రింగ్ రోడ్డులో సమోసాలు తయారు చేసే ఓ కంపెనీలో యువతి పనిచేస్తుంది. ఇంటి వద్ద నుండి కంపెనీకి వెళ్లేందుకు రోజూ సర్వీసు ఆటో ఎక్కి వెళ్తుండేది. ఈ నేపథ్యంలో ఆటోడ్రైవర్ వెంకటేష్ అలియాస్ వెంకీకి ఆ యువతిపై కన్నుపడింది. ఎలాగైన యువతిని లొంగదీసుకోవాలని పన్నగం పన్నాడు.

అయితే రోజులాగే కంపెనీకి వెళ్లేందుకు ఆమె లెనిన్ సెంటర్ వద్దకు వచ్చింది. దీంతో ఆ యువతి ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ కొంచెం నీతో మాట్లాడాలి అంటూ ఆమెను బందర్ బీచ్ కు తీసుకెళ్లాడు. ఆటో ఆపి కిందకు దిగి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఇప్పుడు తన కోరిక తీర్చాలంటూ కోరాడు. అందుకు ఆ యువతి నిరాకరించింది. ఎన్నిసార్లు అడిగిన అదే సమాధానం చెప్పడంతో ఆమెని నిర్భందించి తన నలుగురు స్నేహితులను అక్కడికి రప్పించుకొని యువతిపై అత్యాచారం చేశారు. దాదాపు ఎనిమిది గంటలు యువతికి నరకం చూపారు. తనును వదిలిపెట్టాలని కళ్లమీద పడి వేడుకున్న కానీ కొంచెం కూడా కనికరించలేదు. అయితే ఎట్టకేలకు మంగళవారం 9:30 సమయంలో యువతి వారి నుండి తప్పించుకొని ఇంటికి చేరుకుంది. తన కుమార్తే వంటిపై గాయాలను చూసిన తల్లి గట్టిగ ఆడగడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో తల్లి ఐద్వా మహిళ నేతలతో గవర్నర్‌పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కేసులో నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories