దారుణం; తల,మొండెం వేరు చేసి...

దారుణం; తల,మొండెం వేరు చేసి...
x
Highlights

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. మధ్య వయస్సు గల ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల...

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. మధ్య వయస్సు గల ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల విచారణలో హత్యకు గురైన మహిళ శ్రీమతి శెట్టి అని తేలింది. రెండు గోనె సంచుల్లో వేర్వేరు చోట్ల బాధితురాలి శరీర భాగాలు లభ్యమయ్యాయి. శరీర భాగాలకు సంబంధించిన ఒక సంచి నందిగూడ ప్రాంతంలో, ఆమె తల, చేతులు,కాళ్లకు సంబంధించిన మరో సంచి నంతూరు, కేపీటీ ప్రాంతంలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గురైన శ్రీమతి శెట్టి మంగళూరులోని పండేశ్వర్ ప్రాంతంలో ఎలక్ట్రికల్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. శ్రీమతి శెట్టి కొంతకాలంగా భర్త నుంచి దూరంగా ఉంటోంది. భర్త సుదీప్ నుంచి ఆమె విడాకులు తీసుకుందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఈ హత్యలో అతడి హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. మృతురాలిపై అత్యాచారం జరిగిందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.








Show Full Article
Print Article
Next Story
More Stories