భర్తను చంపేందుకు స్కెచ్... కానీ ప్లాన్ రివర్స్... ప్రియుడు,భర్త మృతి

భర్తను చంపేందుకు స్కెచ్... కానీ ప్లాన్ రివర్స్... ప్రియుడు,భర్త మృతి
x
Highlights

వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడని భర్తను చంపేందుకు ఓ భార్య స్కెచ్ వేసింది. కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో ప్రియుడు, భర్త ఇద్దరు...

వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడని భర్తను చంపేందుకు ఓ భార్య స్కెచ్ వేసింది. కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో ప్రియుడు, భర్త ఇద్దరు చనిపోయారు.. ఇక వివరాలోకి వెళ్తే ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. గుజరాత్ లో కుష్బూ అనే మహిళా టీచర్ గా పని చేస్తుంది. అక్కడే స్థానికంగా ఓ బ్యాంకులో పనిచేసే తుషార్ అనే ఓ ప్యూన్ తో పరిచయం అయి వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఇక అతనితోనే జీవించాలని అనుకున్నా కుష్బూ తన భర్తను విడాకులు కావాలని అడిగింది. కానీ దానికి ఆమె భర్త కుదరదు అని చెప్పడంతో అతడి అడ్డు తోలిగించుకోవాలని ప్రయత్నం చేసింది. ప్రియుడుతో కలిసి పక్కా స్కెచ్ వేసింది. అందులో భాగంగానే హాస్టల్ లో చదువుకుంటున్న కొడుకును తీసుకువచ్చేందుకు భర్తతో కలిసి బైక్ పై వెళ్ళింది.

స్కెచ్ ప్రకారం మధ్యలో వీరిని ఆమె ప్రియుడు అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిని ఒకరు తన్నుకున్నారు. ఈ క్రమంలో పక్కన ఉన్నా చెరువులో ఇద్దరు పడిపోయారు. వీరిని రక్షిచేందుకు కుష్బూ ప్రయత్నం చేసింది. కానీ లాభం లేకుండా పోయింది. దీనితో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని కుష్బూ ని అరెస్ట్ చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories