దారుణం..బతికుండగానే భర్తను స్మశానంలో వదిలేసిన భార్య

దారుణం..బతికుండగానే భర్తను స్మశానంలో వదిలేసిన భార్య
x
Highlights

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ఎలవర్తిలో దారుణం జరిగింది. సభ్యసమాజం తలదించుకునేలా ఓ భార్య అమానుషంగా వ్యవహరించింది. అనారోగ్యంపాలైన భర్తను...

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ఎలవర్తిలో దారుణం జరిగింది. సభ్యసమాజం తలదించుకునేలా ఓ భార్య అమానుషంగా వ్యవహరించింది. అనారోగ్యంపాలైన భర్తను స్మశానవాటికలో వదిలేసింది. అయితే, నడవలేని స్థితిలో నరకయాతన పడుతోన్న బాధితుడు సత్తయ్యను గమనించిన గ్రామస్తులు భార్యపై ఒత్తిడి తెచ్చి సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న సత్తయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

సత్తయ్య సొంతూరు చేవెళ్ల అయితే, ఉన్న భూమిని, ఇంటికి అమ్మేయడంతో భార్య చేవెళ్లను వదిలిపెట్టి శంకర్‌పల్లి మండలం ఎలవర్తికి వెళ్లి అద్దె ఇంట్లో నివాసముంటోంది. అయితే, సొంతూరును వదిలిపెట్టలేక చేవెళ్లలోనే ఉండిపోయిన సత్తయ్య డ్వాక్రా బిల్డింగ్ లో ఉంటూ అక్కడపెట్టే భోజనం తింటూ జీవిస్తున్నాడు. బాగోగులు చూసేవాళ్లు లేకపోవడంతో ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మరోవైపు కాలికి గాయంతో కావడంతో కదల్లేని స్థితికి చేరడంతో గ్రామస్తులు భార్యకు ఫోన్ చేసి ఆమెతో పంపించారు. అయితే, భర్తను శంకర్‌పల్లి మండలం ఎలవర్తికి తీసుకొచ్చిన భార్య ఇంటికి తీసుకెళ్లకుండా స్మశానంలో వదిలేసింది. అప్పుడప్పుడూ స్మశానానికి వెళ్లి చూసొచ్చేది. ఇది గమనించిన గ్రామస్తులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే, సత్తయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.

బతికుండానే భర్తను స్మశానంలో వదిలేసిన భార్యపై గ్రామస్తులు మండిపడుతున్నారు. మరీ ఇంత అమానుషమా అంటూ తిట్టిపోస్తున్నారు. కట్టుకున్న భర్తను అలా స్మశానంలో వదిలేయడానికి మనసెలా వచ్చిందంటూ ఫైరవుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories