వైద్యుడితో వివాహేతర సంబంధం.. భర్త మృతదేహం చూసి విరగబడి నవ్విన భార్య!

వైద్యుడితో వివాహేతర సంబంధం.. భర్త మృతదేహం చూసి విరగబడి నవ్విన భార్య!
x
Highlights

వివాహేతర సంబంధం ఓ వ్యక్తిని బలితీసుకుంది. ప్రియుడితో సంబంధం పెట్టుకున్న భార్య భర్తను కిరాతకంగా చంపించింది. చివరకు అతడి శవం చూసి కూడా ఆమె మనసులో తప్పు...

వివాహేతర సంబంధం ఓ వ్యక్తిని బలితీసుకుంది. ప్రియుడితో సంబంధం పెట్టుకున్న భార్య భర్తను కిరాతకంగా చంపించింది. చివరకు అతడి శవం చూసి కూడా ఆమె మనసులో తప్పు చేశానన్న బాధలేదు. భర్త డెడ్ బాడీని చూసి విరగబడి నవ్వింది. ఈ ఘటన చూసిన విస్తుపోవడం స్థానికులు, పోలీసుల వంతైంది.

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భార్య తన భర్తను కడతేర్చిన దారుణ సంఘటన ప్రకాశం జిల్లా కంభంలో జరిగింది. అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన రజనీ తన భర్త జగన్మోహన్‌రెడ్డిని అతి కిరాతకంగా హత్య చేయించింది. హత్యలో ప్రధాన నిందితుడు రజనీ ప్రియుడు డాక్టర్ వెంకట నారాయణగా పోలీసులు తేల్చారు.

కంభంలో వెంకటనారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. రజనీ, జగన్మోహన్‌రెడ్డిలు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కంభంలో వున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలోని డాక్టర్ వెంకటనారాయణ వద్దకే వెళ్తుంటారు. కొంతకాలంగా రజనీతో అక్రమసంబంధం పెట్టుకున్న వెంకట నారాయణ. రజనీ సహకారంతో హత్యకు ప్లాన్‌ చేశాడు. ఇందుకు కిరాయి హంతకులకు 12లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

పథకం ప్రకారం జగన్‌మోహన్‌రెడ్డిని కిడ్నాప్‌ చేసి. ఆత్మకూరు ఫారెస్ట్‌కు తీసుకెళ్లి చంపేశారు. విచారణలో రజనీని జగన్‌మెహన్‌రెడ్డిని చంపి పడేసిన స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ శవం చూసి ఆమె నవ్వడం పోలీసుల్ని ఆశ్చర్యపరిచింది. పోలీసులు రజిని వెంకటనారాయణతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు మరో ఇద్దరు నేరస్తులను పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories